టిడిపి కార్పొరేట్ పార్టీ ఆఫీసన్పిస్తూంది!!
రోజులు మారే కొద్ది సంస్కృతి మారుతుంది, సంప్రదాయాలు మారుతున్నాయి జనాలను ఉద్ధరిస్తామని ముందుకొచ్చి పార్టీలు పెట్టిన రాజకీయ నాయకులు కార్పొరేట్ యజమాన్యం వలె వ్యవహరిస్తుందేమో అన్పిస్తూంది. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అంధకారంలోకి నెట్టేసి ఎందుకు ఈ పార్టీని నమ్ముకొన్నామా అని పశ్చాత్తాప పడుతున్న విషయం జనమెరిగిన సత్యం. టిడిపిని అభిమానించే కార్యకర్తలు, నాయకులు తమ ఆస్తిపాస్తులను పణంగా పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయబట్టే ఇన్నేళ్లు ప్రతిపక్షంలో వున్న పార్టీ అధికారంలోకి వచ్చిందని వాదనను ఎవరు కాదనరేమో!
పార్టీ బలోపేతం అవడానికి ఇతర పార్టీ నాయకులను, ఎన్నికైన నాయకులను పార్టీలో చేర్చుకోవడం ఆహ్వానించ దగ్గ పరిణామమే. కానీ అదే పనిగా పెట్టుకొని ఇంత కాలం పార్టీని నమ్ముకొన్న వారిని నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదేమో ఆలోచించుకోవాల్సిన బాధ్యత అధినాయకుడి మీద వుంటుంది.
పార్టీ బలోపేతం అవడానికి ఇతర పార్టీ నాయకులను, ఎన్నికైన నాయకులను పార్టీలో చేర్చుకోవడం ఆహ్వానించ దగ్గ పరిణామమే. కానీ అదే పనిగా పెట్టుకొని ఇంత కాలం పార్టీని నమ్ముకొన్న వారిని నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదేమో ఆలోచించుకోవాల్సిన బాధ్యత అధినాయకుడి మీద వుంటుంది.
ఏ యుద్ధంలోనైనా ఏ సందర్భంలోనైనా ఒకరు ఆయుధాన్ని చేజార్చుకొంటే నిజమైన వీరుడు తనకు దక్కిన ఆయుధాన్ని మరలా ఎదుటి వాడికిచ్చి యుద్ధం చేసే సంస్కృతి మనది. కానీ ఇప్పుడు మనకు యుద్ధం చేయడం చేతకాక పోయినా ఎదుటోడి చేతిలో ఆయుధాన్ని లాక్కొని మరీ గెలవాలనుకోవడం ఎంత వరకు సమంజసమో నాయకుల విజ్ఞతకు వదిలేద్దాం. ఇందులో ప్రతిపక్ష నాయకుడ్ని అమాంతం పొగడాలన్నది ఉద్ధేశ్యం కాదు. ప్రతిపక్ష నేత బలహీనతలే తమ పార్టీకి బలంగా మార్చుకోవడం కంటే ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకొని పారదర్శకతతో కూడిన పరిపాలన అందించ గల్గితే హర్షించవచ్చు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది, అభివృద్ధి జపానికి పరిమితమైంది, ఇంకో సంవత్సరంలో ఎన్నికలకు కావల్సిన తాయిలాలు సంపాదించుకొనే పనిలో పడాలి ఇన్ని సమస్యల నడుమ ఆంధ్రప్రదేశ్ వెనుకబడి పోవడం జీర్ణించుకోలేని విషయం. పత్రికల్లో పతాక శీర్షికల్లో చెబుతున్న అభివృద్ధి క్షేత్ర స్థాయిలో లేదనే వాదన జనల్లో వుందని గ్రహించ గల్గితే బాగుంటుందేమో!! - సూరం మల్లికార్జున శర్మ
No comments:
Post a Comment