రోజుకో మహాభారత శ్లోకం చదవండి .... ... మీ స్నేహ సంధ్య
వచ్చినవాడు ఫల్గునుడు , అవశ్యము గెల్తుమనంగ రాదు , రా
లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే ?
హెచ్చేగుంగుందగున్ దొడరుతెల్ల విధంబుల కోర్చు టట్లుగా
కిచ్చ దలంచి యొక్కమెయి నిత్తరి బొందగు చేతయున్ దగున్
వచ్చినవాడు ఫల్గునుడు , అవశ్యము గెల్తుమనంగ రాదు , రా
లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే ?
హెచ్చేగుంగుందగున్ దొడరుతెల్ల విధంబుల కోర్చు టట్లుగా
కిచ్చ దలంచి యొక్కమెయి నిత్తరి బొందగు చేతయున్ దగున్
మహాభారత విరాట పర్వం లోనిదీ పద్యం . ఉత్తర గోగ్రహణాన్ని నిలువరించడానికి గాండీవాన్ని పూరిస్తూ , అర్జునుడు , కౌరవ సేనకు అడ్డంపడ్డాడు . కురుపితామహుడైన భీష్ముడు ఆ సందర్భంలో దుర్యోధనునితో చెప్పిన పద్యమిది .
” వచ్చిన వాడు అర్జునుడు . యుధ్ధంచేస్తే మనమే గెలుస్తామని వక్కాణించి చెప్పలేము . యుధ్ధంలో రెండుపక్షాలూ గెలవలేవు కదా . జయాపజయాలకు మనం సిధ్ధంగా ఉండాలి . దేనికైనా ఓర్చుకోవాలి . ఈ సమయంలో సంధి చేసుకోవడం కూడా సరియైనదే” .
అనుభవంతో పండిపోయిన వారి ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి . అర్జునుడితో యుధ్ధం అంత సులభం కాదనే భావన వ్యక్తం చేసాడు . యుధ్ధంలో జయాపజయాలు దైవధీనాలని జ్ఞాపకం చేసాడు . ఒకవేళ ఓడిపోతే కలిగే అవమానం భరించరానిది కనుక సంధి చేసుకోవడంలో తప్పులేదని సూచించాడు . ఇంత యుక్తి యుక్తంగా చెప్పినా సుయోధనుడు వినలేదు . కయ్యానికే కాలు దువ్వాడు . అందుకే అవమానాల పాలయ్యాడు .
” తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు , దవిలి మృగతృష్ణ లో నీరు తాగ వచ్చు , తిరిగి కుందేటి కొమ్ము సాధింప , వచ్చు చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు ” అన్న భర్తృహరి పద్యం ఈ సందర్భంలో జ్ఞాపకం రాకమానదు .
పెద్దల మాటలు లెక్కచేయకుండా కష్టాల పాలవుతున్న మూర్ఖులను ఈరోజున కూడా మనం చూస్తున్నాం గదా ! పెద్దల మాటలు చద్ది మూటలని ఊరకే అన్నారా ? పెద్దల మాటలు విని తరించాలని మన పిల్లలకు కథా రూపకంగా , ఉదాహరణలతో సహా , మధురమైన మాటలతో హృదయానికి హత్తుకునేలాగా చెప్పాలి .
పెద్దల మాటలు లెక్కచేయకుండా కష్టాల పాలవుతున్న మూర్ఖులను ఈరోజున కూడా మనం చూస్తున్నాం గదా ! పెద్దల మాటలు చద్ది మూటలని ఊరకే అన్నారా ? పెద్దల మాటలు విని తరించాలని మన పిల్లలకు కథా రూపకంగా , ఉదాహరణలతో సహా , మధురమైన మాటలతో హృదయానికి హత్తుకునేలాగా చెప్పాలి .
--------------------------------------------
మీరు మాపై నేరుగా రచనలు చేపట్టండి, మీ స్నేహుతులను సన్నిహితులను బ్లాగ్ లు ద్వారా మమ్ములను ద్వారా జరిగిన పరిణామం ప్రస్తావిస్తూ వ్రాయని అని తమరికి సూచిస్తున్నాము, ఇది మా ధర్మ పరిపాలననకు చేయూత గా ఉంటుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః
ఇట్లు
ధర్మస్వరూపులు మహారాజావారు
No comments:
Post a Comment