పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి వచ్చే విద్యాసంవత్సరం లోగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలలు ప్రారంభించేలోపే కొత్త ఉపాధ్యాయులు సిద్ధంగా ఉంటారని చెప్పారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరిగాక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఖాళీలు, విద్యార్థుల సంఖ్య వివరాలు తెలిశాయన్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఖాళీలను డీఎస్సీల ద్వారా భర్తీ చేయడం సాధ్యం కాదన్నారు. అందుకోసం కొన్ని నెలలు పడుతుందని, ఈ లోగా విద్యార్థులు నష్టపోకుండా ఉపాధ్యాయ ఖాళీలను తక్షణమే విద్యావాలంటీర్లతో భర్తీ చేస్తున్నామన్నారు. ఈ పక్రియను సెప్టెంబర్లోగా పూర్తి చేస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలోగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా కడియం శ్రీహరి వివరించారు.
రాష్ట్ర సచివాలయంలో ఆయన సోమవారం డీఈఈసెట్-2015 పరీక్ష ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 268 డీఎడ్ కాలేజీలలో ప్రవేశాల కోసం సెప్టెంబర్ మొదటివారంలో కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో 182 ఆదర్శ పాఠశాలలు పని చేస్తుండగా బాలికల సౌకర్యం కోసం 100 హాస్టళ్ల భవన నిర్మాణం పూర్తి చేశామన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో బాలికల హాస్టళ్లకు సంబంధించి చాలా భవనాలను ప్రారంభించామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మొత్తం హాస్టళ్లలో 10,000 మంది విద్యార్థినులకు వసతి సదుపాయం లభిస్తుందన్నారు. వాటిలో సెప్టెంబర్ నుంచి ప్రవేశాలు మొదలు పెడతామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యా వాలంటీర్ల నియామకానికి సీఎం కేసీఆర్ అనుమతి తెలిపారని చెప్పారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. విద్యా వాలంటీర్ల నియామక అధికారాలు వారికే ఇచ్చామని, దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు.
విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) అమలులో భాగంగా ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం రిజర్వేషన్లపై డిప్యూటీ సీఎం కడియం స్పందించారు. ఆర్టీఈ అమలుకు అయ్యే ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠ పరిచి, ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి విద్యార్థులకు మేలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం కడియం వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ చిరంజీవులు, ఆ శాఖ అడిషనల్ డైరెక్టర్ గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఈఈసెట్-2015 టాపర్లు వీరే..
డీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన డీఈఈసెట్-2015 పరీక్ష (తెలుగు మీడియం) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బల్లె సుమన 84 మార్కులు సాధించి టాప్లో నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బొడ్డు సుమలత 70 మార్కులు సాధించి ద్వితీయస్థానం సంపాదించింది. టాప్ మార్కులు సాధించిన వారి వివరాలు.
తెలుగు మీడియం విద్యార్థులు:
విద్యార్థి పేరు మార్కులు జిల్లా
బల్లెసుమన 84 మహబూబ్నగర్
బొడ్డు సుమలత 70 ఆదిలాబాద్
గంగల్ల జాషువ 69 కరీంనగర్
మునిదేవి పల్లి మౌనిక 67 మెదక్
మారుపల్లి నవీన్కుమార్ 67 కరీంనగర్
ఉర్దూ మీడియం విద్యార్థులు:
మారుపల్లి నవీన్కుమార్ 67 కరీంనగర్
అస్రామహీన్ 63 నిజామాబాద్
జకీయా బేగం 58 హైదరాబాద్
రెహనా తంజీలాషా 58 నిజామాబాద్
సౌమ్యా బేగం 57 మహబూబ్నగర్
సమీనా బేగం 57 మహబూబ్నగర్
డీఈఈసెట్లో 68.53 శాతం ఉత్తీర్ణత
డీఎడ్ కాలేజీలలో ప్రవేశాల కోసం ఈ నెల 9న నిర్వహించిన డీఈఈసెట్-2015 ప్రవేశ పరీక్ష ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం విడుదల చేశారు. ఇందులో తెలుగు మీడియం విద్యార్థులు 68.53 శాతం అర్హత సాధించారు. ఊర్దూ మీడియంలో 43.01 శాతం విద్యార్థులు అర్హత సాధించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలు http:// tsdeecet.cgg.gov.in/ అనే వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. డీఈఈసెట్ కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి 1,11,413 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,05,385 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. కాగా 71,317 మంది అభ్యర్థులు అర్హత సాధించారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రభుత్వ డైట్ కాలేజీలు, 216 నాన్ మైనారిటీ కాలేజీలు, 42 మైనారిటీ కాలేజీలు కొనసాగుతున్నాయన్నారు. వీటిలో మొత్తం 14,500 సీట్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని భర్తీకి సెప్టెంబర్ మొదటి వారంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. అందుకు సంబందించి వెంటనే విద్యా శాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు:
పాఠశాల విద్యా శాఖ సేకరించిన వివరాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని పది జిల్లాల్లో 7,983 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అందుకు సంబంధించి జిల్లాల వారీగా సేకరించిన అధికారిక లెక్కల వివరాలు ఇలా ఉన్నాయి.
రంగారెడ్డి 1,408
ఆదిలాబాద్ 1,244
నిజామాబాద్ 480
కరీంనగర్ 337
వరంగల్ 314
మెదక్ 1,104
నల్లగొండ 362
ఖమ్మం 674
మహబూబ్నగర్ 1,646
హైదరాబాద్ 414
Source: Namasthe Telangana.
రాష్ట్ర సచివాలయంలో ఆయన సోమవారం డీఈఈసెట్-2015 పరీక్ష ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 268 డీఎడ్ కాలేజీలలో ప్రవేశాల కోసం సెప్టెంబర్ మొదటివారంలో కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో 182 ఆదర్శ పాఠశాలలు పని చేస్తుండగా బాలికల సౌకర్యం కోసం 100 హాస్టళ్ల భవన నిర్మాణం పూర్తి చేశామన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో బాలికల హాస్టళ్లకు సంబంధించి చాలా భవనాలను ప్రారంభించామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మొత్తం హాస్టళ్లలో 10,000 మంది విద్యార్థినులకు వసతి సదుపాయం లభిస్తుందన్నారు. వాటిలో సెప్టెంబర్ నుంచి ప్రవేశాలు మొదలు పెడతామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యా వాలంటీర్ల నియామకానికి సీఎం కేసీఆర్ అనుమతి తెలిపారని చెప్పారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. విద్యా వాలంటీర్ల నియామక అధికారాలు వారికే ఇచ్చామని, దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు.
విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) అమలులో భాగంగా ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం రిజర్వేషన్లపై డిప్యూటీ సీఎం కడియం స్పందించారు. ఆర్టీఈ అమలుకు అయ్యే ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠ పరిచి, ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి విద్యార్థులకు మేలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం కడియం వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ చిరంజీవులు, ఆ శాఖ అడిషనల్ డైరెక్టర్ గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఈఈసెట్-2015 టాపర్లు వీరే..
డీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన డీఈఈసెట్-2015 పరీక్ష (తెలుగు మీడియం) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బల్లె సుమన 84 మార్కులు సాధించి టాప్లో నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బొడ్డు సుమలత 70 మార్కులు సాధించి ద్వితీయస్థానం సంపాదించింది. టాప్ మార్కులు సాధించిన వారి వివరాలు.
తెలుగు మీడియం విద్యార్థులు:
విద్యార్థి పేరు మార్కులు జిల్లా
బల్లెసుమన 84 మహబూబ్నగర్
బొడ్డు సుమలత 70 ఆదిలాబాద్
గంగల్ల జాషువ 69 కరీంనగర్
మునిదేవి పల్లి మౌనిక 67 మెదక్
మారుపల్లి నవీన్కుమార్ 67 కరీంనగర్
ఉర్దూ మీడియం విద్యార్థులు:
మారుపల్లి నవీన్కుమార్ 67 కరీంనగర్
అస్రామహీన్ 63 నిజామాబాద్
జకీయా బేగం 58 హైదరాబాద్
రెహనా తంజీలాషా 58 నిజామాబాద్
సౌమ్యా బేగం 57 మహబూబ్నగర్
సమీనా బేగం 57 మహబూబ్నగర్
డీఈఈసెట్లో 68.53 శాతం ఉత్తీర్ణత
డీఎడ్ కాలేజీలలో ప్రవేశాల కోసం ఈ నెల 9న నిర్వహించిన డీఈఈసెట్-2015 ప్రవేశ పరీక్ష ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం విడుదల చేశారు. ఇందులో తెలుగు మీడియం విద్యార్థులు 68.53 శాతం అర్హత సాధించారు. ఊర్దూ మీడియంలో 43.01 శాతం విద్యార్థులు అర్హత సాధించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలు http://
జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు:
పాఠశాల విద్యా శాఖ సేకరించిన వివరాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని పది జిల్లాల్లో 7,983 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అందుకు సంబంధించి జిల్లాల వారీగా సేకరించిన అధికారిక లెక్కల వివరాలు ఇలా ఉన్నాయి.
రంగారెడ్డి 1,408
ఆదిలాబాద్ 1,244
నిజామాబాద్ 480
కరీంనగర్ 337
వరంగల్ 314
మెదక్ 1,104
నల్లగొండ 362
ఖమ్మం 674
మహబూబ్నగర్ 1,646
హైదరాబాద్ 414
Source: Namasthe Telangana.
No comments:
Post a Comment