నెల్లూరు: జిఎస్ ఎల్ వి-డి6 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట నుంచి సరిగ్గా ఇవాళా సాయంత్రం 4 గంటల 52 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ డి6 నింగిలోకి దూసుకెళ్లింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ క్రయోజనిక్ రాకెట్ 2వేల117 కిలోల బరువు ఉంది. ఇందులో ఒక వెయ్యి 132 కిలోల ఇంధనం, 985 కిలోల ఉపగ్రహం ఉంది. అంతేకాకుండా ఇందులో 10 ట్రాన్స్పాండర్లు ఏర్పాటు చేశారు. దీనికి సుమారు 250 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇది 12 ఏళ్ల పాటు పని చేస్తుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వారికి మహారాజ వారి శుభాకాంక్షలు
No comments:
Post a Comment