UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 24 August 2016

- ప్రజా ధనానికి అధికారులు ధర్మకర్తల్లా పనిచేయాలి - 26న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

స్విస్‌ ఛాలెంజ్‌ ఎందుకు? ప్రజా రాజధానికి రహస్యమెందుకు? హైకోర్టు ప్రశ్న
- ప్రజా ధనానికి అధికారులు ధర్మకర్తల్లా పనిచేయాలి
- 26న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అభివృద్ధి పనుల కోసం స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతి ఎందుకు అమలు చేస్తున్నారంటూ మంగళవారం హైదరాబాద్‌ హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు పలు అనుమానాల్ని లేవనెత్తింది. ప్రజలతో ముడిపడిన రాజధాని నిర్మాణం కోసం చేసే పనుల్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ప్రశ్నించారు. టెండర్‌పై తదుపరి చర్యల్ని నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్‌ అభ్యర్థనపై ఈ నెల 26వ తేదీన తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. అమరావతి నిర్మాణ టెండర్‌ విధానంలో పారదర్శకత లేనందున దానిని రద్దు చేయాలని, దేశంలో పలు ప్రతిష్టాత్మక కంపెనీలున్నా విదేశీ కంపెనీలకు ప్రయోజనం చేకూరేలా ఏపి సర్కార్‌ పత్రాల్ని రహస్యంగా ఉంచుతోందని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య హౌసింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బి.మల్లికార్జునరావు దాఖలు చేసిన కేసు విచారణ సమయంలో హైకోర్టు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
రహస్యంగా అమలు చేసే స్విస్‌ ఛాలెంజ్‌ విధానం ఎందుకని జడ్జి ప్రశ్నించారు. రహస్యంగా వివరాలు ఉంచే ఈ పద్ధతి కంటే సీల్డ్‌ టెండర్‌ విధానమే మేలనే భావన ఏర్పడుతోందని, చెబుతున్న దానికి ఆచరణ భిన్నంగా ఉరందని, ఈ విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యంలా ఉందంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అనుమానాల్ని నివృత్తి చేయకుండా పత్రాల్ని ఇవ్వకుండా ఉంచడాన్ని బట్టే అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజాధనంతో ముడిపడిన విషయంలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని, అధికారులు కేవలం ధర్మకర్తలు (ట్రస్టీలు) మాదిరిగా ప్రజాపనులు చేయాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ప్రజాధనంతో పనులు చేస్తున్నామని అధికారులు గుర్తెరగాలని, ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని, రాజధాని పనులేమీ ప్రైవేటు ఆస్తులు కావని వ్యాఖ్యానించారు. ఆదాయ వివరాలు మినహా మిగిలిన సమాచారమంతా బహిర్గతం చేశామన్న ఏపి ప్రభుత్వ వాదనపై న్యాయమూర్తి స్పందిస్తూ.. కీలక సమాచారం దాచేస్తే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల రాజధాని నిర్మాణ విషయంలో అన్నింటినీ పారదర్శకంగా ఉంచాలన్నారు. ప్రభుత్వ కంపెనీకి 42 శాతం లాభం వస్తుందో లేదోగానీ నష్టాన్నే మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.
విదేశీ కంపెనీల లబ్ధి కోసమే..
ఏపి ప్రభుత్వం పారదర్శకతకు పాతరేసి, మొత్తం సమచారాన్ని రహస్యంగా ఉంచుతోందని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి వాదన సమయంలో ఆరోపించారు. విదేశీ కంపెనీలకు మేలు చేయాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న స్విస్‌ ఛాలెంజ్‌ టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలి. అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్‌కు చెందిన అసెండాస్‌-సెంబ్‌కార్ప్‌ సంస్థల కాన్సార్టియం స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలో ఇచ్చిన ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ సిఆర్‌డిఎ జులై 18న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. టెండర్ల ప్రతిపాదనల సమర్పణకు తుది గడువు సెప్టెంబర్‌ 1వ తేదీ వరకే ఇచ్చారు. టెండర్‌ నిబంధనల్లో భారతదేశం బయట నిర్మాణ రంగంలో అనుభవం ఉండాలన్న షరతును బట్టి విదేశీ కంపెనీల పట్ల పక్షపాతం కనబడుతోంది. దేశంలో నిర్మాణం చేసిన అనుభవాన్ని లెక్కలోకి తీసుకోకపోవడమే ప్రభుత్వ పక్షపాతం తెలుస్తోంది. బిడ్డర్లు బిడ్‌ ప్రాసెసింగ్‌ ఫీజుగా రూ.25 లక్షలు, బిడ్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.6.35 కోట్లు చెల్లించాలి. ఇంత భారీ ప్రాజెక్టుకు గడువు నెలన్నర రోజులే ఇవ్వడం కూడా అన్యాయమే. అదే సింగపూర్‌ కన్సార్జియానికి ప్రతిపాదనల సమర్పణకే దాదాపు పది నెలల గడువు ఇచ్చారు. ఈ నెల 8వ తేదీన బిడ్‌ సమావేశం జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌లో పిటిషనర్‌తోపాటు పలువురు డెవలపర్ల సందేహాల్ని ఇప్పటి వరకు ఏపి నివృత్తి చేయలేదు. అనుమానాలు నివృత్తి కాకుండా బిడ్డర్లు బిడ్‌లు దాఖలు చేయడానికి సాహసం చేయలేకపోతున్నారు. అందుకే పిటిషనర్‌ బిడ్‌ దాఖలు చేయలేకపోయారు. రహస్యంగా ఉంచిన పత్రాలన్నింటినీ బహిర్గతం చేయకపోవడం, అనుమానాల్ని నివృత్తి చేయకపోవడాన్ని బట్టి ప్రభుత్వం విదేశీ కంపెనీ మోజులో ఉందని స్పష్టం అవుతోంది... అని వాదించారు. టెండర్‌ గడువు పెంచాలి. విదేశీ కంపెనీల మోజులో ఉన్న ప్రభుత్వ చర్య తప్పని వెల్లడించాలి. దేశీయ కంపెనీల అనుభవాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సింగపూర్‌ కన్సార్టియానికి అనుకూలంగా చేయాలన్న ప్రభుత్వ విధానం తప్పని వెల్లడించాలి... అని ప్రకాష్‌రెడ్డి వాదించారు.
పక్షపాతం లేదు.. పారదర్శకంగా పనులు
దీనిపై ఏపి ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ, సమాచారాన్ని రహస్యంగా ఉంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని వాదించారు. వివరాలు రహస్యంగా ఉంచవచ్చునని గతంలో తీర్పులు కూడా ఉన్నాయని చెప్పారు.

No comments:

Post a Comment