శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి ప్రారంభమైన #పీవీ_సింధు విజయోత్సవ ర్యాలీ
రియో ఒలింపిక్స్లో భారత్కు రజతపతకం తెచ్చిపెట్టిన షట్లర్ పి.వి.సింధు, కోచ్ గోపీచంద్ సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రులు, అధికారులు సింధుకు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, తదితరులు సింధుకు పుష్పగుచ్ఛం అందజేసి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయోత్సవ ర్యాలీ ప్రారంభమైంది.
No comments:
Post a Comment