UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 23 August 2016

కొత్త జిల్లాలు వరమా...........భారమా ?
కమ్యునికేషన్ వ్యవస్థ విస్తృతంగా లేని కాలంలో , రవాణా సౌకర్యాలు అరకొరగా ఉన్న కాలంలో 50 కి.మీ., 100 కి.మీ దూర ప్రయాణం సుదూర ప్రయాణంగా అగుపించేది. ఇప్పుడా పరిస్తితి లేదు. పేపర్ లెస్ ఆఫీసుల కొరకు ప్రయత్నిస్తున్న ఈ శతాబ్దంలో, 4 జీ వేగంతో పరిగెత్తుతున్న ఈ యుగంలో దూర ప్రయాణం సుపరిపాలనకు ప్రతిబందకం ఎంతమాత్రం కాదు. ఇదంతా ఎందుకంటే కేవలం దురాన్ని ఆదారం చేసుకొని కొత్త జిల్లాలు పుట్టుకోస్తున్నయనే వార్త ప్రచారానికి వచ్చింది. ఎన్నో మండలాలు, గ్రామాలు రాష్ట్ర రాజదానికి సుదూరంగా ఉన్నాయన్నది వాస్తవం, వారికొరకు కొత్త రాజదానికి సృస్టించలెం కదా. ప్రభుత్వ కార్యాలయాలు ఎంత దూరంలో ఉన్నాయన్నది పాత మాట, ప్రభుత్వ సేవలు ఎంత అందుబాటులో ఉన్నాయన్నది నేటి మాట.
74, 75 రాజ్యాగ సవరణ పుణ్యమాని స్థానిక సంస్టలకు అధికారాలు బదలాయింపు జరిగి పరిపాలన జిల్లా స్థాయినుండి చాలావరకు మండల, రెవిన్యూ డివిజన్ స్థాయికి వచ్చేసింది. ఈ పరిపాలన ( ఇ గవర్నెన్స్) ద్వారా చాలా విషయాలకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరమే రావడం లేదు. ఇ గవర్నెన్స్, డిజిటల్ ఇండియా ఉద్దేశ్యం కూడా అదే కదా. 14 వ ఆర్ధిక సంఘం నేరుగా గ్రామ పంచాయితీలకే నిధులు విడుదల చేస్తూ పంచాయితీల స్వయం పాలనకు మార్గం సుగమం చేసింది ఇలాంటి తరుణంలో రోడ్డు, కమ్యునికేషన్ సౌకర్యాలు, ఇంటర్నెట్ తదితర సాంకేతిక సౌకర్యాల పై శ్రద్ద చూపితే జిల్లా కేంద్రం 100 కి.మీ. దూరం లో ఉన్నా సామాన్య ప్రజలకు అసౌకర్యంగా ఉండదు. ఆన్ లైన్ టెండర్లు, ఆన్ లైన్ పరీక్షలు, ఆన్ లైన్ ఇంటర్వ్యు లు , ఆన్ లైన్ దరఖాస్తులు ఇలా అన్ని రంగాల్లో ఇంటర్నెట్ ప్రవేశించి పరిపాలన సులబతరం చేసింది. సామాన్యులు ప్రభుత్వ సేవల నిమిత్తం జిల్లా కేంద్రాలకు వెల్లాల్సినల్సిన సగటు కాలం గత 20 సంవత్సరాలతో పోలిస్తే చాలా తగ్గిపోయింది. వికేంద్రీకరణ , స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు,ఇ పరిపాలన, ఇతర ఆన్ లైన్ సేవలు జిల్లా కేంద్రాలతో సామాన్యుల ప్రత్యక్ష అనుబందాన్ని తగ్గించివేశాయి. వాస్తవానికి ఈనాడు ప్రజలు కొత్త జిల్లాలకంటే కూడా అధికారులు స్థానికంగా ఉండే విదంగా ఏర్పాట్లను కోరుతున్నారు. మండల స్థాయిలో విద్యా, వైద్య తదితర మౌళిక సదుపాయాలు కల్పించగలిగితే వివిధ ప్రభుత్వ అధికారులను స్థానికంగా ఉండే విదంగా ఒత్తిడి చేయగలం. మౌళిక వసతులను మండల స్థాయిలో మెరుగు పరచకుండా కొత్తగా ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేసినా వాటిద్వారా కొత్తగా ఒనగూరే ప్రయోజనం శూన్యమని చెప్పవచ్చు.
ప్రతిపాదిత 25 జిల్లాలు తెలంగాణ వరమయినా కాకున్నా అది ఖచ్చితంగా ప్రభుత్వానికి భారమే అవుతాయి, అంతిమంగా ఆ భారం మోయాల్సింది ప్రజలే కదా. కొత్త అధికారులు, భవనాలు, రవాణా, నివాస తదితర వసతులు పెనుభారమే. నాణానికి ఇంకోవైపు చుస్తే ఒక ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్., అధికారి కనీసం 40 -50 లక్షల ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందిచ గలరు, అదేవిదంగా గ్రూప్ I అధికారులు కూడా సేవలందించ గలరు. చిన్న జిల్లాల వలన వారి సేవలు పుర్తిస్తాయిలో వినియోగంలోకి రావు. జిల్లాల పెంపును పాతవి కలుపుకొని 15 -17 కు పరిమితం చేసి, ఇప్పుడున్న రవాణా వ్యవస్తను , కమ్యునికేషన్ వ్యవస్థలను పటిష్ఠం చేస్తే ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది. 10 కి. మీ. పరిధిలో మండల కేంద్రం, 50 కి. మీ. పరిధిలో రెవెన్యూ కేంద్రం, 100 కి. మీ. పరిధిలో జిల్లా కేంద్రం ప్రాతిపాదికన విభజన చేపడితే 15-17 జిల్లాలతో తెలంగాగా అంతర్గత పరిపాలనకు అనుకూలంగా మారుతుంది, అదే సమయంలో ప్రభుత్వం మీద అదనపు భారమూ ఉండదు.
మండల స్థాయిలో గ్రామాలను కూర్పు చేస్తూ, మండల వ్యవస్తను పటిష్టం చేసి తరువాత రెవెన్యూ డివిజన్లను పునర్వ్యవస్తీకరించి చివరగా కొత్త జిల్లాల మీద దృష్టి కేంద్రీకరిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక్క మండలాన్నో , కొన్ని గ్రామాలనో దృష్టిలో ఉంచుకుని జిల్లాలను విభజించడం సుదీర్ఘ కాలంలో ప్రయోజన శున్యంగానే మిగిలిపోతుంది. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం అంటే బౌతికంగా ప్రజల దగ్గరకు ప్రభుత్వ కార్యాలయాలు తరలి వెళ్ళటం కాదు, ప్రజలకు అందుబాటులో ప్రభుత్వాఫీసులు ఉండటం అని అర్తం, అది ఇ గవర్నెన్స్ ద్వారా కావచ్చు , ఎక్స్ ప్రెస్ రోడ్ల వలన కావొచ్చు , ఇంటర్ నెట్ , టెలీ కమ్యునికేషన్ లాటి వ్యవస్తల ద్వారా కూడా కావోచ్చు . నట్టింట్లో కూర్చును ఉద్యోగం, వ్యాపారం, షాపింగులు చేస్తున్న “ఈ” కాలం లో ప్రభుత్వ యంత్రాంగం ప్రజల ముంగిట్లోనే తిష్ట వేయాలనుకోవటం ప్రజా దానాన్ని వృదా చేయటమే అవుతుంది.
నీటి వనరులు, ఖనిజ వనరుల లభ్యత, వాతావరణ, బౌగోళిక పరిస్తితులు, సాంస్కృతిక సంబందాలు, రవాణా,ఆర్ధికంగా బలమైన నగరాలు, శాంతి భద్రతలు అన్నిటినీ బేరీజు వేసుకొని వాస్తవ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలే తప్ప భావేద్వేగాలతో, “ దూరా” లోచనతో మాత్రమే విభజిస్తే భవిష్యత్తులో పేద జిల్లాలు, ధనిక జిల్లాలు ఏర్పడే ప్రమాదమున్నది, జల వనరుల కోసం, ఖనిజ వనరులపై ఆదిపత్యం కోసం ఉద్యమాలు ఏర్పడే అవకాశం ఉన్నది. శాంతి భద్రతలు కూడా కత్తిమీద సాము లా మారవచ్చు. ఆదిలాబాదు, హైదరాబాదు లాంటి జిల్లాలు మినహాయిస్తే ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన ఆత్యయిక పరిస్తితి మిగతా తెలంగాణ జిల్లాల్లో లేదనే చెప్పవచ్చు.

ఏలిన వారు పరిపాలనా సౌలభ్యం కొరకు కొత్త జిల్లాలు అంటారేమో, పరిపాలనా సౌలభ్యం కొరకే అయితే జిల్లాల సంఖ్యను పెంచటానికి బదులు, ఇప్పుడున్న పోలీసు, రెవెన్యూ సబ్ డివిజన్ ల సంఖ్యను పెంచి, జిల్లా స్థాయిలో ఇద్దరు జాయింట్ కలెక్టర్లను ( పరిపాలన, అభివృద్ధి) నియమించి పరిపాలనను వేగవంతం చేయవచ్చు. రెవెన్యూ అధికారులకు చట్టాలకు సంబందించిన ప్రత్యెక శిక్షణ ఇప్పించి వారిలో వేగాన్ని పెంచి, తీర్పులలో, రికార్డులలో గందరగోళాన్ని తగ్గించవచ్చు. ప్రతీ పోలీస్ సబ్ డివిజన్ స్థాయిలో నేర పరిశోదనలో సహకరించే విదంగా ఒక ప్రత్యేక న్యాయవాదిని నియమించి పిర్యాదుల నమోదు, విచారణ, నేర నిరూపణ తదితర అంశాల్లో పోలీసుల్లో వేగాన్ని పెంచవచ్చు. మండల, డివిజన్ స్థాయిల్లో విద్య, వైద్య సౌకర్యాలు, నివాస వసతి ఏర్పాటు చేసి అధికారులు ఆయా కేంద్రాల్లో నివసించే విదంగా ఒత్తడి తేవొచ్చు. అధికారుల పని తీరుపై గ్రేడింగ్ లాంటివి అమలు చేయటం ద్వారా వారిలో వేగాన్ని పెంచవచ్చు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు, నిర్వహణకు హీన పక్షం సంవత్సరానికి జిల్లాకు 100 కోట్లయినా అవసరం, 10 జిల్లాల కొరకు 1000 కోట్లు ఖర్చు చేయటానికి బదులు ఆ ఖర్చు రోడ్లు, భవనాలు, కమ్యునికేషన్లు మొదలగు మౌళిక వసతుల కోసం వ్యయం చేస్తే ఉన్న జిల్లాలతో లేదా 14- 15 జిల్లాలతో సౌకర్యవంతమైన, సమర్థవంతమైన పరిపాలన అందించలేమా? చిన్న జిల్లాలతో పెద్ద నగరాలు ఏర్పడే అవకాశాలు కూడా మృగ్యం అవుతాయి. 10 లక్షలకు పైన జనాబా ఉన్న నగరాలు కూడా రాష్ట్రానికి ఎంతో అవసరం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వాణిజ్య సముదాయాలు, 5 స్టార్స్, 7 స్టార్స్ లాంటి సౌకర్యవంతమైన హోటల్లు, మల్టీ ప్లెక్స్, ఏమ్యుస్ మెంట్ పార్క్ లాంటి సౌకర్యాలు అందుబాటులోకి రావాలంటే అధిక జనాబా, ఆర్టిక పుష్టి కలిగిన మహా నగరాల ద్వారానే సాద్యం. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ టూరిస్టులను ఆకర్షించాలంటే, పెట్టుబడులు రావాలంటే, ప్రభుత్వేతర రంగాల ద్వారా ఉపాది ని పెంచాలన్నా పెద్ద నగరాలు అందుబాటులో ఉంది తీరాల్సిందే. చిన్న జిల్లాల ద్వారా నగర జనాబా 2 నుండి 5 లక్షలకు పరిమితం అయ్యే అవకాశం ఉన్నది, పెద్ద మొత్తంలో పెట్టుబడులను, అత్యాదునిక సాంకేతిక సౌకర్యాలను ఆ నగరాలు ఆకర్షించలేక పోవచ్చు.
బౌగోళిక స్వరూపం దృశ్యా తెలంగాణలో చాలా ప్రాంతాలు పక్క పక్కనే ఉన్నా, సరైన వంతెనలు, శాస్త్రీయమైన రోడ్డు సౌకర్యాలు లేక వాటిమధ్య కృత్రిమ దూరం పెరిగిపోయింది. ఎన్నో ప్రాంతాల మద్య ఏరియల్ డిస్టెన్స్ కు రోడ్డు రవాణా దూరానికి మద్య వ్యత్యాసం అసాదారణ స్థాయిలో ఉన్నది. శాస్త్రీయంగా ఆలోచిస్తే తెలంగాణ లో చాలా ప్రాంతాల మద్య దూరం తగ్గిపోతుంది. జిల్లాను యూనిట్ గా తీసుకుని గ్రామాలను మండలాలతో , మండలాలను వియోజకవర్గాలతో , నియోజకవర్గాలను జిల్లాలతో అనుసందానం చెస్తూ రోడ్లు నిర్మిస్తే 100 కి. మీ. దూరంలో ఉన్న జిల్లా కేంద్రాన్ని 90 నిముషాలలో చేరుకోగల ఏర్పాటు చేసుకోగలం.
రాజ్యాంగలో ఆర్టికల్ 170 కి సవరణ చేయకుండా ప్రస్తుతం ఉన్న నియోజక వర్గాల సంఖ్య పెంచటం సాద్యం కాదు, రాజ్యంగ సవరణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కత్తిమీద సామే అవుతుంది, ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆర్టికల్ 170 కి సవరణ చేయాలని పూనుకుంటే భారత దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా నియోజక వర్గాల పెంపుకు ఒత్తిడి వచ్చే అవకాశం ఉన్నది, అందువల్ల 2023 వరకు నియోజక వర్గాలు పెరగవనే చెప్పవచ్చు, అలాంటప్పుడు కొత్త జిల్లాల పేరుమీద ప్రస్తుత నియోజక వర్గాలను రెండు లేదా మూడు జిల్లాల్లో కలిపి, పరిపాలన అస్తవ్యస్తం చేయడమెందుకో ఎలినవారికే తెలియాలి.
సామాఖ్య రాజ్యంలో ( ఫెడరల్ ) రాష్ట్రాలు వీలున్నంత వరకు స్వతంత్ర పరిపాలన కొరకు ఆలోచించాలి, కేంద్ర నిదులమీద ఆదారపడే చిన్న జిల్లాల ఏర్పాటు సమాఖ్య స్పూర్తికి విరుద్దం, శాశ్వతంగా రాష్ట్రాలు కేంద్ర అదుపాజ్ఞలలో మిగిలిపోయే ప్రమాదమున్నది. భారత దేశం లోని జిల్లాల సగటు జనాభా తెలంగాణ జిల్లాల జనాభా కన్నా చాలా తక్కువ కనుక పెంచాలి అనే ఆలోచన కూడా సరికాదు, స్వయం సమృద్ది లేని చిన్న జిల్లాలు ఎప్పటికైనా భారమే, సమాఖ్య రాజ్యంలో గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు స్వయం పాలిత ప్రాంతాలుగా ఎదగాలి అప్పుడే బలమైన దేశాన్ని మనం చూడగలుగుతాం.

రాజ్యాంగం లోని ఆర్టికల్ 170 సవరణ చేయకుండా నియోజక వర్గాల పెంపు సాద్యం కాదు, ఇదే విషయం ఎలక్షన్ కమీషన్, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కూడా, అంటే 2023 సంవత్సరం వరకు నియోజక వర్గాల పెంపు జరిగే అవకాశమే లేదు, మరి అలాంటప్పుడు మండలాలను ప్రాతిపదికగా తీసికొని జిల్లాలను ఏర్పాటు చేయటం ఎంతవరకు సబబు? పరిపాలనా పరమైన చిక్కులు తలెత్తవా? ఒక నియోజక వర్గం వేరు వేరు జిల్లాలలో, ఒక రెవెన్యూ డివిజన్ వేరువేరు జిల్లాలలో ఉండటం వలన అన్ని వర్గాల వారికి అసౌకర్యం గానే ఉంటుంది, అధికారులు, నాయకులు తమ తమ వర్గాలకు, ప్రాంతాలకే ప్రాధాన్యత ఇచ్చి మిగతా ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. అందుకే మండలాలను ప్రాతిపాదికగా కాకుండా అసెంబ్లీ నియోజక వర్గాలను ప్రాతిపాదికగా తీసికొని నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది.
కేంద్రం నిదులిస్తుందనో , దూరం తగ్గుతుందనో, రాజకీయ నిరుద్యోగం పెరిగిందనో, వాస్తు, అదృష్ట సంఖ్య అనో మరేదో కారణాలతో కాకుండా వాస్తవ దృక్పథం తో ఆలోచిస్తే 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన తెలంగాణ ప్రగతికి అదనపు బలం ఎంతమాత్రం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. స్వంత రాష్ట్రం కోసం 45 సంవత్సరాలు ఎదురు చుసినోల్లం, పరిపాలన విభజనకు ఇంకొంత కాలం ఓపిక పట్టలేమా? శాస్త్రీయ సర్వే చేసి వాస్తవ దృక్పతం తో నిర్ణయాలు తీసుకోలేమా? పురిటి నొప్పులైనా తీరకుండానే తెలంగాణా తల్లికి అదనపు భారం అవసరమా?
( ఓ వాట్సప్ మిత్రుడి నుండి..)

No comments:

Post a Comment