మనిషి ఏ దశలో సత్యాన్ని గుర్తిస్తాడనే అంశంపై స్వామి పరిపూర్ణానంద తన ప్రవచనంలో ఏం చెప్పారంటే?
ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని దశలు ఉంటాయి. ఒక్కొక్క దశలో ఒక్కొక్కదాని మీద ఆ వ్యక్తికి సత్యత్వం మారుతూ ఉంటుంది. అసలు ఓ వ్యక్తికి యదార్థం ఎప్పుడు ఆవిష్కృతమవుతుంది అనే అంశంపై పూజ్యశ్రీ పరిపూర్ణానంద తన ప్రవచనంలో వివరించారు.
బాల్యంలో ప్రపంచం యొక్క యదార్థమైన స్థితి గతులు తెలియవు.. బాల్యంలో ప్రాపంచికమైన పోకడలు లేదా తన గురించినటువంటి జ్ఞానం రెండింటి పట్ల అవగాహన పొందే అవకాశం ఉండదు. అన్నం పెడితే తినడం.. ఆటవస్తువులు ఇస్తే ఆడుకోవడం.. ఇలా బాల్యం హాయిగా గడిచిపోతుంది. వికాసమే లేని బాల్యంలో సత్యాన్ని గుర్తించాలనే ఆలోచనే రాదు.
యవ్వనానికి వచ్చేటప్పటికి వ్యక్తి తన గురించి .. ప్రపంచం గురించి గుర్తిస్తాడు. తన భౌతికమైన ఆకృతిని చూసి ప్రపంచంలో ఇంకొక అందాన్ని గుర్తించాలని.. లేదంటే తన శక్తి సామర్థ్యాలని ప్రదర్శించాలని ఆశిస్తాడు. అంటే తనను అందరూ గుర్తించాలనే ఆరాటం యవ్వనంలో కనిపిస్తుంది. తన శరీరమే సత్యం అనుకుంటాడు ఈ దశలో వ్యక్తి.
వివాహమై 45 ఏళ్లు వచ్చేసరికి వ్యక్తి వికాసంలో ఇంకో పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రపంచంలో ఉండే వాస్తవికతలు బయటపడతాయి. తన భార్య, పిల్లలు, వారిని కాపాడాలి.. పోషించాలి.. ఇది ఒక సత్యంగా భాసిస్తుంది. కష్టాన్ని సుఖాన్ని యదార్థంగా చూడగలిగేశక్తి ఈ దశలో ఉంటుంది.
ఇలా ఒక వ్యక్తికి ఒక్కొక్క దశలో ఒక్కొక్కదాని మీద సత్యత్వంమారుతూ మారుతూ వస్తూ ఉంటుంది. ఏదో ఒక వస్తువును కోల్పోవడం వల్లో.. గాయపడటం వల్లో.. ఆలోచనో.. అవగాహనో అప్పుడే మనిషికి యదార్థం ఆవిష్కృతమవుతుందని స్వామి పరిపూర్ణానంద తన ప్రవచనంలో వివరించారు.
No comments:
Post a Comment