అశాంతికి కారణం ఏంటి..?
ప్రపంచంలో తనని చలింపచేయని నిశ్చలమైన స్థితినే శాంతము అంటుంది శాస్త్రం. ఒక వ్యక్తికి శాంతం ఎలా కలుగుతుంది..? అనే అంశంపై పూజ్యశ్రీ పరిపూర్ణానంద తన ప్రవచనంలో వివరించారు. ఏదైనా ఒక వస్తువు చూసే వాళ్లని ఆకర్షిస్తుంది. ఏ వ్యక్తి అయితే ఆ వస్తువును చూసి కూడా నిశ్చలమైన స్థితిలో ఉంటాడో అదే 'శాంతం' అనే పదానికి నిర్వచనం.
త్యాగరాజ స్వామి వారు 'దాంతులకైనా.. వేదాంతులకైనా.. శాంతము లేక సౌఖ్యము లేదు' అన్నారు. అంటే ' భోగికైనా .. యోగికైనా శాంతము లేక సౌఖ్యము లేదు' అని చెప్పారాయన. అయితే శాంతం ఎవరిస్తారు? అంటే గురువు ఇస్తే అది ఇచ్చినంత సేపే ఉంటుంది.. దేవుడు ఇచ్చినంత సేపు ఉంటుంది.. శాంతిని ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు.
ఈలోకంలో అశాంతికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఒకాయన రమణ మహర్షి దగ్గరకి వెళ్లాడట.
'మహర్షీ.. నాకు శాంతి కావాలి'.. అని అడిగాడట..
'మహర్షి అతని వైపు తదేకంగా చూశారట..
మళ్లీ అతను 'మహర్షీ.. నాకు శాంతి కావాలని' అడిగాడట..
అప్పుడు మహర్షి 'సుమ్మాయిరప్పా' (ఊరికే ఉండు) అన్నారట.
వెంటనే అతనికి బాధ కలిగిందట..
మహర్షి గురించి బాగా తెలుసుకున్న ఇంకో ఆయన అతని దగ్గరకొచ్చి అందరూ వెళ్లిపోయాక మహర్షి దగ్గరకు తీసుకెళ్లాడట..
'మహర్షీ.. మీరు అన్నది ఇతనికి అర్ధం కాలేదు అనుకుంటా.. మళ్లీ అతనికి వివరించి చెప్పండి అని అడిగాడట.
మళ్లీ ఆ వ్యక్తి 'శాంతికి మార్గం ఏంటి? మహర్షీ ..'అని అడిగాడట..
మహర్షి మళ్లీ 'సుమ్మాయిరప్పా' అన్నాగా.. అన్నారట.
అంటే.. అర్థం కాలేదు అన్నాడట ఆ వ్యక్తి..
'ఊరికే ఉంటే శాంతి.. ఊర్లో ఉండేవి కెలుక్కుంటే అశాంతి' అన్నారట మహర్షి'
శాంతంగా ఉండాలంటే ఏమీ చేయనక్కర్లేదు.. అదే అశాంతికి ఏదో ఒకటి చేయాలి.. అంటే ప్రశాంతంగా ఉండటమే శాంతికి మార్గం అని మహర్షి సూచించారు. శాంతికి మార్గమేంటనే అంశంపై స్వామి పరిపూర్ణానంద తన ప్రవచనంలో వివరిస్తూ ఉదాహరణగా ఈ అంశాన్ని ప్రస్తావించారు
ప్రపంచంలో తనని చలింపచేయని నిశ్చలమైన స్థితినే శాంతము అంటుంది శాస్త్రం. ఒక వ్యక్తికి శాంతం ఎలా కలుగుతుంది..? అనే అంశంపై పూజ్యశ్రీ పరిపూర్ణానంద తన ప్రవచనంలో వివరించారు. ఏదైనా ఒక వస్తువు చూసే వాళ్లని ఆకర్షిస్తుంది. ఏ వ్యక్తి అయితే ఆ వస్తువును చూసి కూడా నిశ్చలమైన స్థితిలో ఉంటాడో అదే 'శాంతం' అనే పదానికి నిర్వచనం.
త్యాగరాజ స్వామి వారు 'దాంతులకైనా.. వేదాంతులకైనా.. శాంతము లేక సౌఖ్యము లేదు' అన్నారు. అంటే ' భోగికైనా .. యోగికైనా శాంతము లేక సౌఖ్యము లేదు' అని చెప్పారాయన. అయితే శాంతం ఎవరిస్తారు? అంటే గురువు ఇస్తే అది ఇచ్చినంత సేపే ఉంటుంది.. దేవుడు ఇచ్చినంత సేపు ఉంటుంది.. శాంతిని ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు.
ఈలోకంలో అశాంతికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఒకాయన రమణ మహర్షి దగ్గరకి వెళ్లాడట.
'మహర్షీ.. నాకు శాంతి కావాలి'.. అని అడిగాడట..
'మహర్షి అతని వైపు తదేకంగా చూశారట..
మళ్లీ అతను 'మహర్షీ.. నాకు శాంతి కావాలని' అడిగాడట..
అప్పుడు మహర్షి 'సుమ్మాయిరప్పా' (ఊరికే ఉండు) అన్నారట.
వెంటనే అతనికి బాధ కలిగిందట..
మహర్షి గురించి బాగా తెలుసుకున్న ఇంకో ఆయన అతని దగ్గరకొచ్చి అందరూ వెళ్లిపోయాక మహర్షి దగ్గరకు తీసుకెళ్లాడట..
'మహర్షీ.. మీరు అన్నది ఇతనికి అర్ధం కాలేదు అనుకుంటా.. మళ్లీ అతనికి వివరించి చెప్పండి అని అడిగాడట.
మళ్లీ ఆ వ్యక్తి 'శాంతికి మార్గం ఏంటి? మహర్షీ ..'అని అడిగాడట..
మహర్షి మళ్లీ 'సుమ్మాయిరప్పా' అన్నాగా.. అన్నారట.
అంటే.. అర్థం కాలేదు అన్నాడట ఆ వ్యక్తి..
'ఊరికే ఉంటే శాంతి.. ఊర్లో ఉండేవి కెలుక్కుంటే అశాంతి' అన్నారట మహర్షి'
శాంతంగా ఉండాలంటే ఏమీ చేయనక్కర్లేదు.. అదే అశాంతికి ఏదో ఒకటి చేయాలి.. అంటే ప్రశాంతంగా ఉండటమే శాంతికి మార్గం అని మహర్షి సూచించారు. శాంతికి మార్గమేంటనే అంశంపై స్వామి పరిపూర్ణానంద తన ప్రవచనంలో వివరిస్తూ ఉదాహరణగా ఈ అంశాన్ని ప్రస్తావించారు
No comments:
Post a Comment