
(ఎవరో ఫేస్బుక్ లో పెట్టిన మాటలు )
పంచడమే తప్ప పొందడం కోసం చూడని వారు
అందించడం తప్ప ఒకరు అందించాలి అని చూడని వారు
ఉపయోగపడటమే గాని ఉపయోగించుకోవడం తెలియని వారు
తమకే తామే లోటుగా (ఏమి లేనట్లుగా) సమాజానికి కూడా గొప్పగా భావించాల్సి ఉండగా, తేలికగా కనపడతారు.
ఏది ఏమైనా బౌతికం గా కనపడటమే, బౌతికం గా కలిగి ఉండటమే
పరమార్ధం మనిషిని మనసు ప్రకారం చూడకపోవడమే దీనికి కారణం,
మనసు పెట్టి చూస్తె ఏమనిషి ఒంటరి వాడు కాదు, తనికి తాను భారం అవడం, లేదా సమాజానికి భారం అవడం ఉండదు, మనిషి సంఘ జీవి మంచి, చెడులు నిత్యం ఇతరులతో పంచుకొంటాడు , అతని గోప్పతనాన్ని అర్ధం చేసుకోకుండా స్వార్ధం తో, మనిషి తనకి తాను భారం అవుతాడు లేదా సమాజానికి భారం అని భావిస్తారు. ఏ మనిషి అయినా విధి భగవంతుని అధీనం లో ఉన్నాడు, కొందరు భగవంతుని గొప్పతనానికి దగ్గరగా ఉంటారు, ఏ ఒక్కడో భగవత్ స్తితిని పొందుతాడు, అటువంటి వ్యక్తి తారస పడినప్పుడు జాగ్రత్తగా అర్ధం చేసుకొని ఉపయోగించుకోవాలి, అప్పుడే కాలం, ధర్మం కొత్తతనం సంతరించుకొంటుంది. విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా సూటిగా వాస్తవం లోకి రండి, మనిషి మీద అధిపత్యం కంటే, సంస్కారంతో గ్రహించి తెలుసుకోవడం ఉత్తమం అని గ్రహించండి.
మహారాజ వారు
No comments:
Post a Comment