కాపు యువతరం పయనం ఎటు ???
-----------------------------------------
ఏ సామాజిక వర్గం లో అయినా విప్లవాత్మకమైన మార్పు, ఆ యువతరం ఆలోచన, ఆచరణ స్థాయీసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. మరి మన కాపు యువతరం ఆలొచన ఆచరణ స్థాయి ఎలా ఉంది ? కేవలం ఆవేశపూరిత మాటలకు పరిమితమై పోతున్నారా ?? కాదంటే ఆచరణలో ఎంతముందుకు రాగలిగాము .
మరింత ముందుకు వెళ్లాలంటే సాగించాల్సిన కార్యాచరణ ఏమిటి అన్న అంశాలపై సునిశిత విమర్శ కోసం ఒక చిన్న ప్రయత్నం ఇది.
అయితే మా ఈ కొన్ని సంవత్సరాల అనుభవం ప్రకారం మన యువతరం లో ఆవేశం కూడా అత్యున్నత స్థాయిలో ఉంది. సాధించాలన్న తపన అత్యున్నత స్థాయిలో ఉంది. అయితే దాన్ని ఆచరణలో మాత్రం అమలు చేయడం లో వైఫల్యాలు ఎదుర్కోంటున్నాం. దాదాపు 30 సంవత్సరాల మన ప్రయత్నం ఎందుకు నఫలీకృతం కాలేకపోతూందో పరిశీలిస్తే ఒక సమస్య మాత్రం ప్రధానంగా కనబడుతుంది. అదే నాయకత్వ లోపం.రెండు ఐక్యతా లోపం.ఈ విషయం మేము కొత్తగా కనుగొన్నది కాదు. అనేక సందర్భాలలో అనేక వేదికలపై ఈ విషయం ప్రస్తావనకు
వస్తూనే ఉంది. కాని విచిత్రంగా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు మన సామాజిక వర్గం లో ఉన్న సంఘాలు, నాయకులు దేశం మొత్తంమీద ఏ బలమైన సామాజిక వర్గం లో కూడా కనపడరు. ఒక వైపు నాయకత్వ లేమి అంటున్నాము. మరో వైపు అనేక సంఘాలు, అనేక మంది నాయకులు. ఇదే మనం ఎదుర్కోంటున్న అతి విచిత్ర పరిస్థితి. దీని మూలాలు మండల, జిల్లా స్థాయి నాయకత్వం నుంచి ఉన్నాయి. మన యువతరం నాయకుల్లో అంతులేని ఆవేశం, తపన తో పాటు టన్నుల కొద్దీ అపరిపక్వత కూడా ఉంది. కులం లోని ఆవేశం , అపరిపక్వత రెండూ ఒక చోట చేరి మన కాపు సంఘాలు గా రూపాంతరం చెందాయి. ప్రతి మండలంలో ఒక సంఘం ఉంటుంది. కానీ చాలా వరకు వీరి నాయకులు ఆలోచన లేని ఆవేశపరులు ఉన్నారు. ఫలితం ప్రతి ఒక్కరూ తమ ను తాము హీరో లుగా ఊహించుకోవడం , తమ మాటే నెగ్గాలని కోరుకోవడం, మొత్తం కాపు/ బలిజ సామాజిక వర్గానికి తామే ప్రతినిధులు గా
ప్రవర్తించడం . చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ..మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్ వరకూ ఇదే ధోరణి. మరి ఇన్ని మూర్ఖ సంఘాల మధ్య ఐక్యత ఎలా వస్తుంది.
అయితే మన కులంలో యువమేధావులు లేరా ?యువ ప్రోఫషసల్ వ్యక్తులు లేరా ? లేకేం చాలా ఎక్కువ మందే ఉన్నారు. మరి వీరిలో చాలా మంది కులసంఘాలకు దూరంగా ఉంటున్నారు. ఎందుకు ? కులం మీద అభిమానం ఉన్నా కుల సంఘాల నాయకులు మీద అసంతృప్తి తో అంటీముట్టనట్లున్నారు. ఈ పరిస్థితి ఇలాగే
కొనసాగితే మన లక్ష్యాలను 100 సంవత్సరాలయినా అందుకోలేం.
మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి ?? మండలస్థాయి నుండి , జిల్లా స్థాయి నుండి కాపు/ బలిజ సంఘాలను యువ మేధావులు ( డాక్టర్ లు, లాయర్లు, ప్రొఫెసర్ లు, ఇంజనీర్లు , టీచర్లు) వంటి వారి నాయకత్వంలోకి తీసుకురావాలి. అలాంటప్పుడే యువతరం ఆవేశం నిర్మాణాత్మక రూపంలో కి మారుతుంది. తద్వారా మొత్తం కాపు /బలిజ సామాజిక వర్గ ఆశలనూ ఆశయాలను సజీవంగా నిలపగలం.......
-----------------------------------------
ఏ సామాజిక వర్గం లో అయినా విప్లవాత్మకమైన మార్పు, ఆ యువతరం ఆలోచన, ఆచరణ స్థాయీసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. మరి మన కాపు యువతరం ఆలొచన ఆచరణ స్థాయి ఎలా ఉంది ? కేవలం ఆవేశపూరిత మాటలకు పరిమితమై పోతున్నారా ?? కాదంటే ఆచరణలో ఎంతముందుకు రాగలిగాము .
మరింత ముందుకు వెళ్లాలంటే సాగించాల్సిన కార్యాచరణ ఏమిటి అన్న అంశాలపై సునిశిత విమర్శ కోసం ఒక చిన్న ప్రయత్నం ఇది.
అయితే మా ఈ కొన్ని సంవత్సరాల అనుభవం ప్రకారం మన యువతరం లో ఆవేశం కూడా అత్యున్నత స్థాయిలో ఉంది. సాధించాలన్న తపన అత్యున్నత స్థాయిలో ఉంది. అయితే దాన్ని ఆచరణలో మాత్రం అమలు చేయడం లో వైఫల్యాలు ఎదుర్కోంటున్నాం. దాదాపు 30 సంవత్సరాల మన ప్రయత్నం ఎందుకు నఫలీకృతం కాలేకపోతూందో పరిశీలిస్తే ఒక సమస్య మాత్రం ప్రధానంగా కనబడుతుంది. అదే నాయకత్వ లోపం.రెండు ఐక్యతా లోపం.ఈ విషయం మేము కొత్తగా కనుగొన్నది కాదు. అనేక సందర్భాలలో అనేక వేదికలపై ఈ విషయం ప్రస్తావనకు
వస్తూనే ఉంది. కాని విచిత్రంగా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు మన సామాజిక వర్గం లో ఉన్న సంఘాలు, నాయకులు దేశం మొత్తంమీద ఏ బలమైన సామాజిక వర్గం లో కూడా కనపడరు. ఒక వైపు నాయకత్వ లేమి అంటున్నాము. మరో వైపు అనేక సంఘాలు, అనేక మంది నాయకులు. ఇదే మనం ఎదుర్కోంటున్న అతి విచిత్ర పరిస్థితి. దీని మూలాలు మండల, జిల్లా స్థాయి నాయకత్వం నుంచి ఉన్నాయి. మన యువతరం నాయకుల్లో అంతులేని ఆవేశం, తపన తో పాటు టన్నుల కొద్దీ అపరిపక్వత కూడా ఉంది. కులం లోని ఆవేశం , అపరిపక్వత రెండూ ఒక చోట చేరి మన కాపు సంఘాలు గా రూపాంతరం చెందాయి. ప్రతి మండలంలో ఒక సంఘం ఉంటుంది. కానీ చాలా వరకు వీరి నాయకులు ఆలోచన లేని ఆవేశపరులు ఉన్నారు. ఫలితం ప్రతి ఒక్కరూ తమ ను తాము హీరో లుగా ఊహించుకోవడం , తమ మాటే నెగ్గాలని కోరుకోవడం, మొత్తం కాపు/ బలిజ సామాజిక వర్గానికి తామే ప్రతినిధులు గా
ప్రవర్తించడం . చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ..మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్ వరకూ ఇదే ధోరణి. మరి ఇన్ని మూర్ఖ సంఘాల మధ్య ఐక్యత ఎలా వస్తుంది.
అయితే మన కులంలో యువమేధావులు లేరా ?యువ ప్రోఫషసల్ వ్యక్తులు లేరా ? లేకేం చాలా ఎక్కువ మందే ఉన్నారు. మరి వీరిలో చాలా మంది కులసంఘాలకు దూరంగా ఉంటున్నారు. ఎందుకు ? కులం మీద అభిమానం ఉన్నా కుల సంఘాల నాయకులు మీద అసంతృప్తి తో అంటీముట్టనట్లున్నారు. ఈ పరిస్థితి ఇలాగే
కొనసాగితే మన లక్ష్యాలను 100 సంవత్సరాలయినా అందుకోలేం.
మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి ?? మండలస్థాయి నుండి , జిల్లా స్థాయి నుండి కాపు/ బలిజ సంఘాలను యువ మేధావులు ( డాక్టర్ లు, లాయర్లు, ప్రొఫెసర్ లు, ఇంజనీర్లు , టీచర్లు) వంటి వారి నాయకత్వంలోకి తీసుకురావాలి. అలాంటప్పుడే యువతరం ఆవేశం నిర్మాణాత్మక రూపంలో కి మారుతుంది. తద్వారా మొత్తం కాపు /బలిజ సామాజిక వర్గ ఆశలనూ ఆశయాలను సజీవంగా నిలపగలం.......
అభినందనలు తో "ఢిల్లీ కాపు బృందం"
--------------------------------------
కుల పరం గా కాపులే కాదు ప్రతి కులం వారు కులం అన్నది ఒక గుణం అని అది నిత్యం మారుతుంది అని అర్ధం చేసుకోవాలి, గుణం లేదా బుద్ది కి తగ్గ పని చేయడం వలన మనిషిలో మార్పు వస్తుంది అ విధం గా కులం అన్నది పేరుకు పరిమితం చేసుకొని, ఎలాగైనా స్వార్ధం గా బ్రతకటం మానేసి, ఆలోచనతో మాట కలుపుకొని నిత్యం మంచి పెంచుకొని బ్రతకాలి. మాట కలుపుకోవడం అంటే మన మాట ఏమిటి ఎదుటి వారి మాట ఏమిటో చూసుకోవాలి, మూస మూర్ఖత్వం గా ఎలాగైనా పైన ఉండాలి, క్రింద ఉండాలి అన్నట్లు కాకుండా, మాట ప్రకారం ఉండాలి సంస్కారంతో ఒకరిని ఒకరు సరిద్దుకొంటూ బ్రతకాలి, అ విధంగా మాటతో నిలుపుకొంటే, కులాలే కాదు మతాలు కూడా ఏకమై ప్రపంచం మాట నిలిచిన జగత్తు నిలుచును అని సత్యం అవిష్కరించుకొని, బౌతిక ద్వేషాలు, నిర్లక్ష్యాలు తగ్గి, మాటతో మంచితో ఎదరు వస్తారు. ఎలాగైనా అహంకారం డంబం లేకుండా, ఎదుట వాడిలో మాటలో గొప్పతనం ఉన్నా మన బలమే గెలివాలి అనుకోవడం మూర్ఖత్వం అని తెలుసుకొంటారు, బౌతిక లోటు చూపి జ్ఞానాన్ని దైర్యాన్ని నీరు కార్చకూడదు, ఎప్పుడూ నిండుగా మనస్పూర్తిగా ప్రవర్తించాలి, ప్రవర్తించనివ్వాలి. కాపులు, కుల పరం గా కాకుండా మాటతో గొప్పతనం తో ముందుకు వచ్చి అందరిని కలుపుకొని, మాట అంటే ఏమిటో ప్రపంచానికి చెప్పే ప్రయత్నములో ఈ ప్రపంచాన్ని జ్ఞాన సమన్వయం, మానవత్వం తో నింపగలము. మనసు ప్రకారం పరమ పవిత్రుడిగా పురుషోత్తముడిగా, ఇప్పటికి 200 మంది సాక్షిగా మహారాణి సమేత మహారాజుగా గుర్తించుటకు కాపు కుల సంఘాలు నుండి మద్దతు ఆలోచన పరం గా నిత్యం ఉండాలి అని కోరుకొనుచున్నాను, నా ప్రకారం కులం మతం మీద లోకం లేదు, మాట మీద ఉన్నది, మాటతో ప్రపంచాని నడిపించి చూపి, ఈ మాట అంటున్నాను, కావున కులం పరం గా కాకుండా సాటి మనుష్యులు గా ముందుకు వచ్చి ఇతర మనుష్యులు అందరూ మమ్ములను గుర్తించి ఉపయోగించుకోనగలరు, మాకు ఒక చోట నివాసం ఎర్పాటు చేస్తే అక్కడ కొలువు తీరి లోకాన్ని నిత్యం సమీక్షిస్తాను, అందకు అందరి సహకారం కోరుకొనుచున్నాను.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
--------------------------------------
ఈ పాట మేము అతీతం గా పలికినాము
మన వాడు వచ్చాడు అంటే మన అందరి మనసుల్ని నడిపిన వాడు మన అందరికోసం వచ్చాడు అని అర్ధం, నన్ను ఎవరైనా తన వాడిగా ఫీల్ అవుతారు మా వాడు అయితే బాగుంటుంది అనుకొంటారు, నిజానికి నేను ఎప్పుడూ అందరి వాడినే అనగా మా లాంటి మనసు ఉన్న మనుష్యులు ఎప్పుడూ అందరి కోసం ఆలోచిస్తారు, మనుష్యులే వేరు వేరు అనుకోవడం వలన నన్ను కూడా వేరు వేరు గా భావిస్తారు, అన్నిటా ఉన్న నేను ఎక్కువ లోను తక్కువ లోను. కష్టాలు లోను సుఖాలు లోను అన్నిటా నేనే ఉన్నాను అని అర్ధం. అటువంటి నన్ను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం కాలం ధర్మం ఇచ్చిన కానుకు. దేవుడను దర్శిస్తే చాలు, మమ్ములను మనసు పెట్టి గ్రహిస్తే చాలు
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment