BJP Andhra Pradesh - భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ withRavindra Raju and 7 others.
ఇప్పటిదాకా పద్మ అవార్డులంటే రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వారో.. సినీ రంగంలో సేవలందించిన వారికి ప్రకటించడమో.. సామాజిక సేవలో ముందున్న వారు అందుకోవడమో మాత్రమే చూశాం. కానీ, తొలిసారిగా ఓ రైతు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్నారు. ఖర్చు లేని ప్రకృతి సేద్యంపై ప్రచారం చేసిన సుభాష్ పాలేకర్కు ఆ అవార్డును ఇచ్చారు. మహారాష్ట్రలోని కరువు ప్రాంతమైన విదర్భలోని బెలోరా ప్రాంతంలో ఆయన జన్మించారు. వ్యవసాయశాస్త్ర పట్టభద్రుడైన ఆయన.. పర్యావరణ, వ్యవసాయ నిపుణులతో కలిసి పనిచేశారు. ప్రకృతి సేద్యంపై దేశవ్యాప్తంగా వర్క్షా్పలు, సెమినార్లు నిర్వహించారు. కాగా, అవార్డుకు ఎంపికైన పాలేకర్ను కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు గారు అభినందించారు. ఓ రైతుకు ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. సుభాష్ పాలేకర్ గారి గురించి దిగువ ఉన్న వికీపీడియా లింక్ లో చదవండి.
No comments:
Post a Comment