కాపు ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం వేధింపులు!
********************************************
ఉన్నతాధికారులు ఎవరైనా తమకు అనుకూలంగా నడుచుకోక పోయినా లేక ఉద్యోగంలో నిక్కచ్చిగా వ్యవహరించినా లేక కాపు వాడైతే కాపు కుల ద్వేషంతో వారిపై ఏసీబీ దాడులు చేయించి వేధించడం పరిపాటిగా మారుతుంది. ఆ కోవలో ప్రస్తుతం వి. ఆదిశేషు అనే ఎక్సైజ్ అసిస్టెంట్ కమీషనర్ పై ఏసీబీ వారు దాడి చేశారు. నిన్న మీడియాలో వచ్చిన కధనాల ప్రకారం 7కోట్ల విలువైన ఆస్తులు దొరికాయట. వాటి మార్కెట్ విలువ 70కోట్ల పైగా వుంటుందని మీడియాలో ప్రచారం కావించారు.
ఉన్నతాధికారులు ఎవరైనా తమకు అనుకూలంగా నడుచుకోక పోయినా లేక ఉద్యోగంలో నిక్కచ్చిగా వ్యవహరించినా లేక కాపు వాడైతే కాపు కుల ద్వేషంతో వారిపై ఏసీబీ దాడులు చేయించి వేధించడం పరిపాటిగా మారుతుంది. ఆ కోవలో ప్రస్తుతం వి. ఆదిశేషు అనే ఎక్సైజ్ అసిస్టెంట్ కమీషనర్ పై ఏసీబీ వారు దాడి చేశారు. నిన్న మీడియాలో వచ్చిన కధనాల ప్రకారం 7కోట్ల విలువైన ఆస్తులు దొరికాయట. వాటి మార్కెట్ విలువ 70కోట్ల పైగా వుంటుందని మీడియాలో ప్రచారం కావించారు.
కొద్ది నెలల క్రితం చంద్రబాబు తన ఆస్తుల వివరాలు ప్రకటించి నప్పుడు మీడియాలో అవి తప్పుడు లెక్కలని పెద్ద దుమారమే రేగింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కలుగజేసు కొని ఒక వివరణ ఇచ్చారు. ఆస్తులు విలువ కట్టేప్పుడు కొన్నప్పటి రేటు కట్టాలి గానీ మార్కెట్ రేటు కట్టకూడదు అని. మరి ఈకాపు అధికారి ఆస్తులకు ఈకమ్మ మీడియా మార్కెట్ రేటు కట్టి ఎలా ప్రచారం కావిస్తుంది. మీకులానికో చట్టం వేరే కులానికి వేరొక చట్టమా?
ఏసీబీ దాడులు చేసినంత మాత్రాన ఆదిశేషు గారు నేరస్తుడై పోడు. అది కోర్ట్ లో తేలాల్సి వుంటుంది. పచ్చ మీడియా కులానికి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి 200 కోట్లు మారిషస్ బ్యాంకుకి ఎగనామం పెట్టాడు. ఇంకా కేంద్ర మంత్రి గానే చలామణి అవుతున్నాడు. రాయపాటి సాంబశివరావు అనే నర్సారావు పేట ఎంపీ 1000 కోట్ల రూపాయలు బ్యాంకులకు బకాయి ఎగ్గొట్టాడు. అయినా ఎంపీగా కొనసాగు తున్నాడు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న కావూరి సాంబశివరావు అనే మాజీ ఎంపీ 1000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగేసి దర్జాగా తిరుగుతున్నాడు. మరో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అయితే ఏకంగా 36000 కోట్ల రూపాయలు బకాయిలకు బ్యాంకులకు చేతులెత్తేసి వున్నాడు. ఇంత గొప్ప గొప్ప ఆర్థిక నేరస్తుల్ని వదిలేసి ఆదిశేషు లాంటి ఉద్యోగస్తుల్ని నేరస్తులుగా ప్రచారం కావించడం ఆధిపత్య వర్గాల చేతిలో వున్న మీడియా కుట్రపూరిత ప్రచారంగానే భావించాల్సి వస్తుంది.
తెలుగు దేశం పార్టీ తమ వర్గానికి చెందిన ఎంతటి నేరస్తులనైనా కాపాడు తుంది. దానికి నిన్నమొన్న కాల్ మనీ వ్యవహారమే ఉదాహరణ. కానీ కాపులెవరైనా ఏదేని సమస్యలో ఇరుక్కుంటే వారిని అధ: పాతాళానికి తొక్కేస్తుంది. కాపులందరికీ అవగతమైనవే! చంద్రబాబు అతడి ప్రభుత్వం కాపువ్యతిరేక వైఖరి వీడక పోతే భవిష్యత్ లో ఈప్రభుత్వం తగిన మూల్యాన్ని చెల్లించాల్సి వుంటుంది.
No comments:
Post a Comment