భారతీయ సంగీతంలో ’త్యాగరాజస్వామి’ పేరు ప్రపంచ ప్రసిద్ధి. ముఖ్యంగా తెలుగు భాషలోనే సంగీతాత్మ ఉందని ఋజువు చేసిన ఈ మహానుభావుని తెలుగువారందరూ గురుస్థానంలో ఆరాధించవలసినది.
చిత్రమేమంటే సంగీత, సాహితీభావ సంపద విశ్వజనీనం కనుకనే అన్యభాషలవారు సైతం ఆరాధించే ఔన్నత్యం తెలుగువెలుగైన త్యాగయ్యకు దక్కింది. వీరి సంగీతాన్ని ప్రపంచ వేదికలపై విన్నాక, పాశ్చాత్యులు ఈ కీర్తనలలోని తెలుగు భాషా మాధుర్యానికి పరవశులై "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని కీర్తించారు.
నేటికీ ప్రతి యేటా త్యాగరాజ వర్థంతి ’ఆరాధన’గా ప్రపంచపు సంగీత ప్రియులకు మహోత్సవంగా, పలువైపుల నుండి వచ్చే సంగీతకారులతో, శ్రోతలతో తిరువాయూరు క్షేత్రంలో నిర్వహింపబడుతోంది. వేలాది వివిధ భాషా సంగీతకారుల నోట ఏకకంఠంగా, తెలుగు పంచ రత్న కృతులు మరో అమృత కావేరిగా ఆ వేళ ప్రతిధ్వనించడం తెలుగు గుండె ఉప్పొంగే మధురఘట్టం. నాదబ్రహ్మోత్సవం.
సంగీత శాస్త్రపు మర్మాలను కీర్తనలలో ఒదిగించి, పొదిగించిన ఏకైక వాగ్గేయకారుడు త్యాగయ్య. సంగీతాన్ని మోక్షవిద్యగా, యోగశాస్త్రంగా అధ్యయనం చేసి, నిరూపించి, ఆ ఫలాన్ని పొంది, ఇతరులకు పొందించిన మహాయోగి.
సంగీత సాహిత్యాలను సుసంపన్నం చేసిన త్యాగయ్య లేత లేత పలుకులతో, లోతైన వేదాంత రహస్యాలను పలవింపజేసిన నాదబ్రహ్మ.
1767-1847 మధ్యకాలంలో జీవించిన వీరు సంగీతానికీ, భక్తి మార్గానికి శాశ్వతోపకారాన్ని చేశారు.
"సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా!"
"అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు"
"మనసు స్వాధీనమైన ఆ ఘనునికి మరి మంత్ర తంత్రులేల?"
...ఇలా లెక్కలేనన్ని కీర్తనలు, త్యాగరాు సాహితికి ఉపనిషత్తుల స్థానాన్నిచ్చాయి. రామభక్తి సామ్రాజ్యాన్ని కృతుల్లో ప్రతిష్టించిన త్యాగయ్య వాటిద్వారా మరో రామాయణాన్నే అందించారు.
’ఎందరో మహానుభావులు" "సమయానికి తగుమాటలాడెనే", "సొగసు చూడ తరమా", తెరతీయగరాదా", "ఎంతవారలైనా కాంతదాసులే" - ఇలా లెక్కలేనన్ని త్యాగయ్య పలుకులు తెలుగువారి నోట నానుడులయ్యాయి.
రాగ భావ ప్రపంచానికి రాజుగానే కాక, నిరాడంబర సాత్త్విక యోగజీవనానికి ఆదర్శంగా శోభిల్లిన అద్భుత వ్యక్తిత్వం త్యాగయ్య వైభవం.
తన నామం త్యాగయ్య అయినా, చివరి దశలో రామాజ్ఞవలన సన్యసించిన కారణంగా, ఆరాధనకు యోగ్యులై "త్యాగరాజస్వామి" అని గౌరవింపబడుతున్నారు. సంగీతకారులకు ఎంత ముఖ్యమో, భక్తులకు వేదాంతులకు అంతే ఆరాధ్యులు ఈ నాదయతి.
త్యాగయ్య గురించి పేర్కొంటూ "మానవుడు కాదు దేవుండు మనకు నిజము" అని చెళ్ళపిళ్ళ వారు కీర్తించారు.
"త్యాగరాజమహర్షి ఆత్మలో రసభావముల ఐక్యమరసిన తెలుగుభాష" అని వీరిద్వారా మన భాషను ప్రస్తుతించారు కవిసామ్రాటి విశ్వనాథ.
"త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు నిత్యమై నిఖిలమై నిలచియుండి..." "మాతెలుగుతల్లికి మల్లెపూదండ"లయ్యాయి.
"నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా?" అని కీర్తించిన త్యాగయ్య, కోరి దరిద్రాన్ని వరించారు. తనవిద్యను వాత్సల్యంగా ఎందరో శిష్యులని పోషించి బధించి సుస్థిరంగా నిలిపారు.
త్యాగయ్య నెలకొల్పిన గురుశిష్య సంప్రదాయం ఋషిపరంపరకు ప్రతీక.
నిష్కపటమైన భక్తి, శుద్ధ సాత్త్విక మనః ప్రవృత్తి, తపోమయ జీవనం ఈ నాదయోగి బ్రతుకుతీరు. పటిష్టమైన పాండితీ భరిత సంగీతంతో పాటు సామాన్యులు సైతం పాడుకోగలిగే సంకీర్తనలను చిన్న చిన్న మాటలతో సమకూర్చారు.
సంగీతం నిర్మల భక్తితో, ద్రాక్షరసం వంటి సౌలభ్య మాధుర్యంతో, స్వరశుద్ధంగా ఉండాలని నిర్దశించి లక్ష్య లక్షణాలను తన రచనలలో నిక్షిప్తం చేశారు.
సంగీత, సాహిత్య, వేదాంత శాస్త్రాల సారం త్యాగరాజకృతి వైభోగం.
సంస్కృతిపై అభిమానం కలవారు, అందునా తెలుగువారు కృతజ్ఞతతో స్మరించుకోదగిన ఆ మహాత్మునకు - ఈ ఆరాధన సందర్భంగా హృదయాంజలి.
చిత్రమేమంటే సంగీత, సాహితీభావ సంపద విశ్వజనీనం కనుకనే అన్యభాషలవారు సైతం ఆరాధించే ఔన్నత్యం తెలుగువెలుగైన త్యాగయ్యకు దక్కింది. వీరి సంగీతాన్ని ప్రపంచ వేదికలపై విన్నాక, పాశ్చాత్యులు ఈ కీర్తనలలోని తెలుగు భాషా మాధుర్యానికి పరవశులై "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని కీర్తించారు.
నేటికీ ప్రతి యేటా త్యాగరాజ వర్థంతి ’ఆరాధన’గా ప్రపంచపు సంగీత ప్రియులకు మహోత్సవంగా, పలువైపుల నుండి వచ్చే సంగీతకారులతో, శ్రోతలతో తిరువాయూరు క్షేత్రంలో నిర్వహింపబడుతోంది. వేలాది వివిధ భాషా సంగీతకారుల నోట ఏకకంఠంగా, తెలుగు పంచ రత్న కృతులు మరో అమృత కావేరిగా ఆ వేళ ప్రతిధ్వనించడం తెలుగు గుండె ఉప్పొంగే మధురఘట్టం. నాదబ్రహ్మోత్సవం.
సంగీత శాస్త్రపు మర్మాలను కీర్తనలలో ఒదిగించి, పొదిగించిన ఏకైక వాగ్గేయకారుడు త్యాగయ్య. సంగీతాన్ని మోక్షవిద్యగా, యోగశాస్త్రంగా అధ్యయనం చేసి, నిరూపించి, ఆ ఫలాన్ని పొంది, ఇతరులకు పొందించిన మహాయోగి.
సంగీత సాహిత్యాలను సుసంపన్నం చేసిన త్యాగయ్య లేత లేత పలుకులతో, లోతైన వేదాంత రహస్యాలను పలవింపజేసిన నాదబ్రహ్మ.
1767-1847 మధ్యకాలంలో జీవించిన వీరు సంగీతానికీ, భక్తి మార్గానికి శాశ్వతోపకారాన్ని చేశారు.
"సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా!"
"అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు"
"మనసు స్వాధీనమైన ఆ ఘనునికి మరి మంత్ర తంత్రులేల?"
...ఇలా లెక్కలేనన్ని కీర్తనలు, త్యాగరాు సాహితికి ఉపనిషత్తుల స్థానాన్నిచ్చాయి. రామభక్తి సామ్రాజ్యాన్ని కృతుల్లో ప్రతిష్టించిన త్యాగయ్య వాటిద్వారా మరో రామాయణాన్నే అందించారు.
’ఎందరో మహానుభావులు" "సమయానికి తగుమాటలాడెనే", "సొగసు చూడ తరమా", తెరతీయగరాదా", "ఎంతవారలైనా కాంతదాసులే" - ఇలా లెక్కలేనన్ని త్యాగయ్య పలుకులు తెలుగువారి నోట నానుడులయ్యాయి.
రాగ భావ ప్రపంచానికి రాజుగానే కాక, నిరాడంబర సాత్త్విక యోగజీవనానికి ఆదర్శంగా శోభిల్లిన అద్భుత వ్యక్తిత్వం త్యాగయ్య వైభవం.
తన నామం త్యాగయ్య అయినా, చివరి దశలో రామాజ్ఞవలన సన్యసించిన కారణంగా, ఆరాధనకు యోగ్యులై "త్యాగరాజస్వామి" అని గౌరవింపబడుతున్నారు. సంగీతకారులకు ఎంత ముఖ్యమో, భక్తులకు వేదాంతులకు అంతే ఆరాధ్యులు ఈ నాదయతి.
త్యాగయ్య గురించి పేర్కొంటూ "మానవుడు కాదు దేవుండు మనకు నిజము" అని చెళ్ళపిళ్ళ వారు కీర్తించారు.
"త్యాగరాజమహర్షి ఆత్మలో రసభావముల ఐక్యమరసిన తెలుగుభాష" అని వీరిద్వారా మన భాషను ప్రస్తుతించారు కవిసామ్రాటి విశ్వనాథ.
"త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు నిత్యమై నిఖిలమై నిలచియుండి..." "మాతెలుగుతల్లికి మల్లెపూదండ"లయ్యాయి.
"నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా?" అని కీర్తించిన త్యాగయ్య, కోరి దరిద్రాన్ని వరించారు. తనవిద్యను వాత్సల్యంగా ఎందరో శిష్యులని పోషించి బధించి సుస్థిరంగా నిలిపారు.
త్యాగయ్య నెలకొల్పిన గురుశిష్య సంప్రదాయం ఋషిపరంపరకు ప్రతీక.
నిష్కపటమైన భక్తి, శుద్ధ సాత్త్విక మనః ప్రవృత్తి, తపోమయ జీవనం ఈ నాదయోగి బ్రతుకుతీరు. పటిష్టమైన పాండితీ భరిత సంగీతంతో పాటు సామాన్యులు సైతం పాడుకోగలిగే సంకీర్తనలను చిన్న చిన్న మాటలతో సమకూర్చారు.
సంగీతం నిర్మల భక్తితో, ద్రాక్షరసం వంటి సౌలభ్య మాధుర్యంతో, స్వరశుద్ధంగా ఉండాలని నిర్దశించి లక్ష్య లక్షణాలను తన రచనలలో నిక్షిప్తం చేశారు.
సంగీత, సాహిత్య, వేదాంత శాస్త్రాల సారం త్యాగరాజకృతి వైభోగం.
సంస్కృతిపై అభిమానం కలవారు, అందునా తెలుగువారు కృతజ్ఞతతో స్మరించుకోదగిన ఆ మహాత్మునకు - ఈ ఆరాధన సందర్భంగా హృదయాంజలి.
No comments:
Post a Comment