Everybody worship Saraswathi as Chaduvula talli. Then who is Savitribhai Phule ?
"మీలో కోటీశ్వరుడు ఎవరు" కార్యక్రమంలో ఒక ఇంజనీరింగ్ చదివి ఎం.ఎస్. కోసం అమెరికా కు వెళుతున్న ఒక యువతి ' బాబా సాహేబ్ ' ఎవరు అన్న ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిందన్న విషయంపై చర్చ జరుగుతోంది.. చదువుకున్న యువతే సమాధానం చెప్పలేకపోయిందంటే సామాన్యులు ఎలా సమాధానం చెప్పగలరు? పైగా ఆమె తల్లిదండ్రులిద్దరూ టీచర్లుగా పనిచేస్తున్నారు. ఇన్నేళ్ళ సర్వీసులో వారు తమ కూతురికి బాబా సాహేబ్ ఎవరో చెప్పలేదు...
నిజమైన హీరోల చరిత్రలను దాచిపెట్టి డూబియస్ వ్యక్తులను గొప్పనాయకులుగా, స్వాతంత్రసమర యోధులుగా చిత్రీకరించడం పరిపాటి అయిపోయింది. గణేష్ పండుగలను నిర్వహించి మతపరమైన భావాలను వెదచల్లిన తిలక్ గొప్ప నాయకుడైపోయాడు. అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వంటి నిజ మైన దేశభక్తుల చరిత్రలను మరుగున పరచడం కాంగ్రెస్ కే కాదు, సో కాల్డ్ మేధావులకు మామూలైపోయింది. డూబియస్ వ్యక్తులకు పాట్యాంశాలలో పేజీలు పేజీలు కేటాయించి పిల్లలను, చరిత్ర ను వక్రీకరిస్తున్నారు. ప్రతీ నగరంలో ముఖ్యమైన వీధులకు గాంధీ నెహ్రూల పేర్లు, ప్రభుత్వ ఖర్చుతో గాంధీ జయంతులు జరిపినప్పుడు ఆయానాయకుల పేర్లు ప్రజల నోళ్ళలో నానుతుంటాయి. కనీసం జనవరి 26 న ఐనా అంబేద్కర్ ఫోటోలను ప్రదర్శిస్తే అంబేద్కర్ ఎవరో ప్రజలకు తెలుస్తుంది. అందాకా డూబియస్ నాయకులే స్వాతంత్రసమరయోధులుగా చలామణి అవుతుంటారు..సిగ్గు.సిగ్గు..
No comments:
Post a Comment