శ్రీనగర్ నిట్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. యూనివర్సిటీలో లోకల్, నాన్ లోకల్ విద్యార్ధుల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అక్కడి విద్యార్ధులే కాదు.. విద్యార్ధినులు కూడా నీచమైన బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. చెప్పిన మాట వినకపోతే ‘మిమ్మల్ని రేప్ చేయిస్తాం’ అంటూ లోకల్ విద్యార్ధినులు .. నాన్ లోకల్ విద్యార్ధినులపై బెదిరింపులకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది.
టీ20 వరల్డ్ కప్ లో వెస్టెండీస్ చేతిలో భారత్ ఓడిపోవడం, కొందరు విద్యార్ధులు దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం ఎన్ఐటీలో చిచ్చు రేపింది. దీనిపై స్ధానికేతర విద్యార్ధులు అడ్డుచెప్పటంతో వివాదానికి దారితీసింది. లోకల్ విద్యార్ధులు నాన్ లోకల్ విద్యార్ధులపై దాడి చేశారు. దీంతో స్ధానికేతర విద్యార్ధులు రోడ్డెక్కారు. తరగతులకు వెళ్లకుండా నిరసనలు తెలుపుతున్నారు. యూనివర్సిటీని మరో ప్రాంతానికి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో స్ధానికేతర విద్యార్ధినులకు తీవ్ర బెదిరింపులు ఎదురౌతున్నాయట. వెంటనే తరగతులకు రాకుంటే స్ధానికులతో అత్యాచారం చేయిస్తామని సహ విద్యార్ధినిలు తమను బెదిరిస్తున్నారని ఎన్ఐటీలో చదువుకుంటున్న ఇతర రాష్ట్రాల విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. తమలో అభద్రతా భావం పెరిగిపోయిందని చెబుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని హెచ్చరిస్తున్నారు. అయితే ఈనెల 11 నుంచి పరీక్షలు యథావిథిగా జరుగుతాయని, వీటికి హాజరు కానివారు తరువాత పరీక్షలు రాయవచ్చని అధికారులు చెబుతున్నారు. క్యాంపస్ లో గత శుక్రవారం జరిగిన ఘర్షణలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు దాఖలు చేశారు. వీటిలో ఎవరి పేరును కూడా నమోదు చేయనట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment