Bramhasri Samavedam Shanmukha Sarma
రామాయణ గాథ – అనురాగాల సుధ
అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నప్పుడూ, మన సుఖ సంతోషాలకు అన్నీ అమరినప్పుడూ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి నిజమైన ఆత్మీయతానురాగాలు ఉన్నాయా? లేదా?అని తెలిసేది కష్ట సమయాల్లోనే! క్లిష్టపరిస్థితుల్లోనే!
దశరథమహారాజు కైకేయి మాట ప్రకారం శ్రీరాముణ్ణి అరణ్యాలకు పంపించిన తరువాత రాజ్యాదికారాలను అనుభవించవచ్చు. కానీ దశరథుడు శ్రీరాముని ఎడబాటును భరించలేక మనోవేదనతో మరణించాడు. శ్రీరాముడు తండ్రిని ఎదిరించి అడవులకు వెళ్ళకుండా అయోధ్యను పరిపాలిస్తూ, కీర్తి ప్రతిష్ఠలతో జీవించవచ్చు. కానీ తండ్రికి ‘అసత్యవాది’ అన్నమాట రాకూడదని అరణ్యవాసానికి అంగీకరించాడు. సీతమ్మ తన భర్త అరణ్యవాసం ముగించుకొని వచ్చేంత వరకు అంతఃపుర సుఖాలను అనుభవిస్తూ, ఎంతమంది బంధు బలగమున్నా సతికి పతియే ఆలంబనమని సీతమ్మ శ్రీరాముణ్ణి అనుసరించింది. అన్నా వదినలు అరణ్య వాసానికి వెళితే లక్ష్మణుడు తల్లిదండ్రులను సేవిస్తూ అయోధ్యలోనే ఉండిపోవచ్చు. కానీ కష్టాల్లో ఉన్న అన్నావదినల వెన్నంటి ఉండడమే ధర్మమని తలచి సీతారాముల వెంట పయనమయ్యాడు. భరతుడు పట్టాభిషిక్తుడై రాజభోగాలతో జీవితాన్ని గడపవచ్చు. కానీ తపోమయ జీవితాన్ని గడుపుతూ అన్నయ్య రాకకోసం పధ్నాలుగేళ్ళు నిరీక్షించి రాజ్యాధికారాలను శ్రీరామునికి అప్పగించాడు.
దశరథుడు, రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు – ఇలా కుటుంబ సభ్యులంతా సుఖంగా జీవించడానికి అవకాశాలు, సదుపాయాలున్నా, వాటిని అనుభవించకుండా ఒకరి సుఖం కోసం మరొకరు పరితపించారు. కారణం పరస్పర ఆత్మీయతానురాగాలే.
“ఆత్మీయతానురాగాలు, ప్రేమాప్యాయతలు కరువైనప్పుడు అంతఃపురవాసమైనా అరణ్యవాసమే అవుతుంది. ఆత్మీయత మనస్సులో నిండుగా ఉన్నప్పుడు అరణ్యవాసమైనా అంతఃపుర వాసమవుతుంది” అని నిరూపించి, మానవ సత్సంబంధాలకు మార్గదర్శకంగా నిలిచింది రామాయణ గాథ. నేడు చాలామంది తమ ఇళ్ళకు ‘శాంతినివాసం’ అనీ, ‘శ్రీరామ నిలయం’ అనీ పేర్లు పెట్టుకుంటున్నారు కానీ శాంతి నివాసంలోకి ప్రవేశించగానే అంతటా అశాంతే. అలాగే శ్రీరామ నిలయంలో రావణ కుంభకర్నూలు తారసపడడం మనకు తరచూ ఎదురయ్యే అనుభవం. నిజమైన శ్రీరామ నిలయాలు, శాంతి నివాసాలు విలసిల్లాలంటే సుఖ సంతోషాల్లో చూపించే ఆత్మీయతాభిమానాలను కష్ట సమయాల్లోనూ చూపించగలిగినప్పుడే సాధ్యం.
అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నప్పుడూ, మన సుఖ సంతోషాలకు అన్నీ అమరినప్పుడూ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి నిజమైన ఆత్మీయతానురాగాలు ఉన్నాయా? లేదా?అని తెలిసేది కష్ట సమయాల్లోనే! క్లిష్టపరిస్థితుల్లోనే!
దశరథమహారాజు కైకేయి మాట ప్రకారం శ్రీరాముణ్ణి అరణ్యాలకు పంపించిన తరువాత రాజ్యాదికారాలను అనుభవించవచ్చు. కానీ దశరథుడు శ్రీరాముని ఎడబాటును భరించలేక మనోవేదనతో మరణించాడు. శ్రీరాముడు తండ్రిని ఎదిరించి అడవులకు వెళ్ళకుండా అయోధ్యను పరిపాలిస్తూ, కీర్తి ప్రతిష్ఠలతో జీవించవచ్చు. కానీ తండ్రికి ‘అసత్యవాది’ అన్నమాట రాకూడదని అరణ్యవాసానికి అంగీకరించాడు. సీతమ్మ తన భర్త అరణ్యవాసం ముగించుకొని వచ్చేంత వరకు అంతఃపుర సుఖాలను అనుభవిస్తూ, ఎంతమంది బంధు బలగమున్నా సతికి పతియే ఆలంబనమని సీతమ్మ శ్రీరాముణ్ణి అనుసరించింది. అన్నా వదినలు అరణ్య వాసానికి వెళితే లక్ష్మణుడు తల్లిదండ్రులను సేవిస్తూ అయోధ్యలోనే ఉండిపోవచ్చు. కానీ కష్టాల్లో ఉన్న అన్నావదినల వెన్నంటి ఉండడమే ధర్మమని తలచి సీతారాముల వెంట పయనమయ్యాడు. భరతుడు పట్టాభిషిక్తుడై రాజభోగాలతో జీవితాన్ని గడపవచ్చు. కానీ తపోమయ జీవితాన్ని గడుపుతూ అన్నయ్య రాకకోసం పధ్నాలుగేళ్ళు నిరీక్షించి రాజ్యాధికారాలను శ్రీరామునికి అప్పగించాడు.
దశరథుడు, రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు – ఇలా కుటుంబ సభ్యులంతా సుఖంగా జీవించడానికి అవకాశాలు, సదుపాయాలున్నా, వాటిని అనుభవించకుండా ఒకరి సుఖం కోసం మరొకరు పరితపించారు. కారణం పరస్పర ఆత్మీయతానురాగాలే.
“ఆత్మీయతానురాగాలు, ప్రేమాప్యాయతలు కరువైనప్పుడు అంతఃపురవాసమైనా అరణ్యవాసమే అవుతుంది. ఆత్మీయత మనస్సులో నిండుగా ఉన్నప్పుడు అరణ్యవాసమైనా అంతఃపుర వాసమవుతుంది” అని నిరూపించి, మానవ సత్సంబంధాలకు మార్గదర్శకంగా నిలిచింది రామాయణ గాథ. నేడు చాలామంది తమ ఇళ్ళకు ‘శాంతినివాసం’ అనీ, ‘శ్రీరామ నిలయం’ అనీ పేర్లు పెట్టుకుంటున్నారు కానీ శాంతి నివాసంలోకి ప్రవేశించగానే అంతటా అశాంతే. అలాగే శ్రీరామ నిలయంలో రావణ కుంభకర్నూలు తారసపడడం మనకు తరచూ ఎదురయ్యే అనుభవం. నిజమైన శ్రీరామ నిలయాలు, శాంతి నివాసాలు విలసిల్లాలంటే సుఖ సంతోషాల్లో చూపించే ఆత్మీయతాభిమానాలను కష్ట సమయాల్లోనూ చూపించగలిగినప్పుడే సాధ్యం.
No comments:
Post a Comment