భగవాన్ రమణ మహర్షి సన్నిధిలో దాదాపు పది సంవత్సరాలు గడిపి భగవానుని కరుణకు పాత్రురాలైన భక్తురాలు సూరి నాగమ్మ గారు. వారి లేఖలలో ప్రస్తావించిన ఒక ఆసక్తికర సంఘటన ఇది.ఒకప్పుడు భగవాన్ రమణులకు కాళ్ళు నెప్పులు అధికంగా వుండటం వల్ల తైలం రుద్ది కాళ్ళు వత్తే వారు సేవకులు. మిగతా చొరవ గల భక్తులంతా అర గంట చొప్పున వంతులు పడి కాళ్ళు వత్తడం ప్రారంభించారు. ఆ విధంగా గురుసేవ చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల అభిప్రాయం. కానీ సర్వ జీవ సమభావం గల రమణులకు ఇది ఇష్టం లేదు. అలా అని వద్దు అని కఠినంగా చెప్పటం వారి పద్ధతి కాదు. అందు వల్ల ఛలోక్తిగా “మీరంతా కాస్త ఆగండి. నేను కూడా కాసేపు కాళ్ళు వత్తుతాను. ఆ పుణ్యం నాకు కూడా రావద్దూ?” అంటూ వారి చేతులు తొలగించి తామే కాళ్ళు వత్తుకోవడం ప్రారంభించారు. దీంతో అందరూ ఆశ్చర్య పోయి విచిత్రంగా చూడటం మొదలు పెట్టారు.
తనకూ గురుపాదసేవా భాగ్యం కల్పించమని కోరిన ఒక భక్తునితో “అత్మావై గురుః” అన్నారు. ఆత్మ సేవ చేసుకుంటే గురు సేవ చేసినట్లే అని భావం. “ఇక నైనా ఆత్మ సేవ చేసుకోండి. మాట్లాడకుండా ఊరికే వుంటే అంతే చాలు” అన్నారు. సరిగా విచారిస్తే ఇంతకన్నా ఉపదేశం ఏముంది?
No comments:
Post a Comment