1. అసలు దొంగలు ఎవరన్నా లైన్ల లో ఉంటారా? వారికి బ్యాంక్ అకౌంట్ లు , డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులుంటాయి. దాని లో కావల్సినంత ధనం ఉంటుంది. అది వారికి 4-5 ఏండ్లు తిని కూర్చున్నా సరి పోతుంది.
.
2. అసలైన దొంగలకు బ్యాంకుల దగ్గర ఏమి పని? వారి నల్ల డబ్బు ని వారి బెనామీలు, ఇతర కాంట్రాక్టు లేబర్ ల వద్దకి తరలించడానికి వారి ఆలోచనలకు ఇప్పుడు పదను పెడుతున్నారు.
.
3. ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థ లో ఎక్కడైనా లోపాలున్నాయా అని శోధిస్తున్నారు, నల్ల డబ్బు గల వారు... తెలిసిన వారి వద్ద 5-10 లక్షల వరకు వేయించడానికి ప్రయత్నిస్తున్నారు. వీరికి బ్యాంకుల వద్ద ఏమి పని? ఉన్న డబ్బుని చెక్ ల ద్వారా వాడుకుంటున్నారు.
.
4. పెద్ద పెద్ద దొంగలు ఇంకా ఏమైనా సందు దొరుకుందా అని చూస్తున్నారు... మీడియా అధిపతులను మభ్య పెట్టి ఉప్పుకు 300 అని, పప్పు కి 500 అని, ప్రజలు చస్తున్నారని దొంగ వార్తలు చెప్పిస్తున్నారు. ఇది చూసి మోదీ తన నిర్ణయాన్ని వెనక్కి తెస్సుకుంటాడని అన్ని రకాల అబద్దపు, మోసపు వత్తిడిలు ఉన్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారు..
.
కాబట్టి, అసలు దొంగలు బ్యాంకుల వద్ద బయట అగుపడరు... మోదీ 50 రోజులు సమయం ఇచ్చింది మన లాంటి సాధారణ పౌరుల కొరకు, మన డబ్బులు 5 లక్షల వరకు వేసుకున్నా పెద్ద సమస్య ఉండదు. సమస్య అంతా ఆ దేశ ద్రోహపు నల్ల దొంగలకే అసలు సమస్య..
No comments:
Post a Comment