UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 18 November 2016

ఆనాడే అర్థక్రాంతి ప్రతిపాదన
నల్లధనాన్ని రూపుమాపడానికి వినూత్న యోచన
రూ.500, 1000 నోట్లను రద్దు చేయాలి
దిగుమతి, కస్టమ్స్‌ మినహా దేశంలో పన్నులన్నింటినీ రద్దు చేయాలి
నగదు లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరిగేలా చూడాలి
విప్లవాత్మక ప్రతిపాదన చేసిన అనిల్‌ బోకిల్‌
2012లోనే ‘అర్థక్రాంతి’పై సదస్సు నిర్వహించిన ‘ఈనాడు’
నల్లధనం, అవినీతి.. ఈ రెండూ దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పులా పరిణమించాయి. ప్రజలకు అనేక సమస్యలను సృష్టిస్తున్నాయి. అభివృద్ధిని అడ్డుకుంటూ దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. మరోవైపు ప్రభుత్వాలు జనం నెత్తిన పన్నుల భారాన్ని మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో చీకటి నుంచి వెలుగులోకి నడిపించే ఆయుధంగా వచ్చిన ప్రతిపాదనే ‘అర్థక్రాంతి’. ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు నల్లధనం, అవినీతి భూతాలను సమర్థంగా ఎదుర్కొనే ఆశయంతో మహారాష్ట్రకు చెందిన అనిల్‌ బోకిల్‌ ఈ ప్రతిపాదన చేశారు. రూ. 500, 1000 నోట్లను రద్దు చేయాలని మొదటిగా ప్రతిపాదించింది ఆయనే. దేశంలో ప్రస్తుత పన్నుల వ్యవస్థ స్థానంలో బ్యాంకు లావాదేవీల పన్నును ప్రవేశపెట్టాలని సూచించారు. దీనివల్ల ప్రజలపై పన్ను భారం తగ్గడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చనే సూత్రాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. సాహసోపేతమైన ఈ ప్రతిపాదనలోని పరమార్థాన్ని, దాని వల్ల దేశానికి చేకూరే ప్రయోజనాన్ని గుర్తించిన ‘ఈనాడు’ నాలుగేళ్ల కిందటే దేశంలోని ప్రముఖులతో ఈ అంశంపై చర్చావేదిక నిర్వహించింది. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు నేతృత్వంలో డిసెంబరు 2, 2012లో రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘అర్థక్రాంతి’ సదస్సు జరిగింది. నాటి సదస్సులో పాల్గొన్న నిపుణులు విలువైన అభిప్రాయాలు వెల్లడించారు.
కొందరి చేతుల్లోనే డబ్బు: అనిల్‌ బోకిల్‌
దేశంలో 80 శాతం జనాభా అట్టడుగు వర్గాలకు చెందిన వారే. ప్రస్తుత పన్నుల వ్యవస్థలో లొసుగుల వల్ల వీరెంతగానో నష్టపోతున్నారు. పన్నుల విధానాల్లో లోపాల వల్ల నల్లధనం విచ్చలవిడిగా పోగుపడుతోంది. దీంతో వాస్తవ ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దదిగా సమాంతర ఆర్థిక వ్యవస్థ పరిఢవిల్లుతోంది. దేశంలోని రాజకీయ పార్టీలకు ఈ వ్యవస్థ నుంచే నిధులు అందుతున్నాయి. నగదు మార్పిడి సాధనంగా కాకుండా వస్తువుగా మారి కొందరి చేతుల్లో కేంద్రీకృతమైపోయింది. పేదల చేతికి డబ్బు అందడం లేదు.
*రూ.50 నోటు కంటే పెద్దది మనకు అవసరం లేదు.
*మనదేశంలో బ్యాంకుల వద్ద ఉన్న సొమ్ము కంటే చెలామణిలో ఉన్న సొమ్ము ఎక్కువగా ఉంది.
*ఈ పరిస్థితి మారాలంటే బ్యాంకుల ద్వారానే నగదు లావాదేవీలు జరిగేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.
*కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 60 శాతం పరోక్ష పన్నుల ద్వారానే వస్తోంది.
*దేశంలో ఉన్నంత అధిక వడ్డీరేట్లు ఏ దేశంలోనూ లేవు.
అర్థక్రాంతి ప్రతిపాదనలు..
*రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలి. ఈ నోట్లతో పేదలకు పని లేదు. కేవలం నల్లధనం పోగేసుకునేవారికే ఇవి ఉపయోగపడుతున్నాయి.
*అమెరికాలోనూ 1969లో అప్పటి నిక్సన్‌ ప్రభుత్వం 100 డాలర్ల కంటే పైన ఉన్న నోట్లను రద్దు చేసింది. చాలా సమస్యలకు అది పరిష్కారం చూపింది.
*దిగుమతి, కస్టమ్స్‌ పన్నులను మినహాయించి దేశంలో అమల్లో ఉన్న అన్ని రకాల పన్నులను రద్దు చేయాలి.
*వాటి స్థానంలో అన్ని లావాదేవీలు బ్యాంకు ద్వారా జరిగేలా చూడాలి. రూ.2000 కంటే పైన నగదు లావాదేవీలను నిరుత్సాహపర్చాలి.
*నగదు స్వీకర్త నుంచి 2 శాతం బ్యాంకు లావాదేవీ పన్ను(బీటీటీ) వసూలు చేస్తే చాలు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కంటే ఎంతో ఎక్కువ మొత్తం సమకూరుతుంది.
*అర్థక్రాంతి అమలుతో అవినీతికి అడ్డుకట్ట పడుతుంది.
*పన్నుల వ్యవస్థ బలహీనత, దొంగనోట్ల సమస్యలుండవు.
*ప్రజలపై పన్నుల భారం తొలగిపోతుంది.
*తక్కువ వడ్డీకి రుణాలు అందుతాయి.
ఇదో అద్భుత యోచన
‘‘అర్థక్రాంతి ఒక అద్భుత ఆలోచన. ఇది అమలైతే అవినీతి తగ్గిపోతుంది. దేశంలో ఆదాయపు పన్నులోని 80 శాతం రాబడి కేవలం 8 నగరాల నుంచే వస్తోంది. 85 శాతం మందికి చెందాల్సిన సంపద 12 శాతం మంది చేతుల్లోకి వెళుతోంది. దేశంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి. వీటిని సరిచేయడానికి ఇదో సాహసోపేతమైన ఆలోచన. అర్థక్రాంతి అమలులో వచ్చే లోపాలను అధిగమించడానికి ప్రభుత్వంలోని ఆర్థిక నిపుణులు చర్చించాలి. మనదేశంలో ప్రధాన మంత్రి చాలా శక్తిమంతుడిగా ఉండాలి. సంకీర్ణ ప్రభుత్వాల్లో ప్రధానులు బలహీనపడ్డారు’’’
- జస్టిస్‌ వెంకటాచలయ్య, మాజీ సీజేఐ
‘‘అర్థక్రాంతి వంటి సరికొత్త కార్యక్రమాల అమలుకు ముందు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ రంగం బాగా విస్తరించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్‌ రంగంపై విస్తృత అవగాహన కల్పించాలి’’
- నాబార్డు మాజీ సీఎండీ రంజనా కుమార్‌
‘‘నగదు లావాదేవీలను బ్యాంకింగ్‌ పరిధిలోకి తీసుకురావాలనేది ఆచరణాత్మక, అవసరమైన ప్రతిపాదన. అవినీతిని అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం రావాలి. మంచి పాలకులను ఎన్నుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది’’
- ఎన్‌.కె.రావు, ఆస్కి డైరెక్టర్‌ (2012లో)
‘‘దేశంలో ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి వ్యక్తి ఆదాయం ఒక స్థాయి కంటే తక్కువ కాకుండా చర్యలు తీసుకోవాలి. అర్థక్రాంతి ఆలోచన ఆసక్తికరంగా ఉంది’’
- పీఎం భార్గవ, సీసీఎంబీ మాజీ సంచాలకుడు
జనమే నడుం కట్టాలి
‘‘అవినీతి, నల్లధనం తనువులు కలిసిన జంట రాక్షసులు. ఒకదాన్ని కొడితే రెండోది దానికదే చస్తుంది. మన చట్టాలు, చట్టసభ సభ్యులు ఈ పనిచేయలేకపోయారు. పేదరిక నిర్మూలన పథకాలు ఇతర ఆర్భాటపు పథకాలపై దేశం భారీ ఎత్తున నిధులు ఖర్చుచేస్తోంది. ఆశపోతు, లంచగొండి నాయకులు, అధికారులు అందులో సింహభాగాన్ని లంచాలు మేస్తూ పథకాల, ప్రాజెక్టుల మౌలిక లక్ష్యాలను దెబ్బతీస్తున్నారు. ఇలా అక్రమంగా సంపాదించిన మొత్తం సమాంతర ఆర్థిక వ్యవస్థగా వర్థిల్లుతోంది. మహోన్నతమైన మన దేశాన్ని కాపాడుకునేందుకు ఇక ప్రజలే నడుం కట్టాలి. అర్థక్రాంతి విప్లవాత్మక మార్పు తేగల ప్రతిపాదన. నల్లధనాన్ని సమూలంగా తుడిచిపెట్టగల శక్తి దీనికి ఉంది’’
- రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు
-ఈనాడు ప్రత్యేక విభాగం

No comments:

Post a Comment