జన్థన్ ఖాతాల్లోకి రెండ్రోజుల్లో రూ.2 లక్షల కోట్లు..!
12-11-2016 20:51:32
ముంబై: జోరో బ్యాలెన్స్తో ప్రారంభించిన 'జన్ధన్' అకౌంట్లలోకి భారీగా సొమ్ములు వచ్చి చేరుతున్నాయి. పెద్ద నోట్లు రద్దు చేసిన రెండ్రోజుల్లోనే రూ.2 లక్షల కోట్లు ఈ ఖాతాల్లోకి వచ్చి చేరడంతో ప్రభుత్వం దృష్టిపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. జన్థన్ ఖాతాల్లో ఆకస్మికంగా డబ్బులు వచ్చిపడుతున్నట్టు కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇంతవరకూ డబ్బులు జమచేయని ఆ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చిపడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయని ఉన్నారు. డిపాజిట్లలో అవకతవకలు జరిగాయా అనేది సంబంధిత శాఖలు నిశితంగా పరిశీలిస్తాయని ఆయన చెప్పారు. అక్రమ లావాదేవీలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే లెక్కల్లో చూపించకుండా తప్పించుకునేందుకు రూ.500, రూ.1000 నోట్లను బులియన్ మార్కెట్లోకి తరలించే వారి కార్యకలాపాలపై ..లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నిఘా వేసినట్టు తెలిపారు.
T
No comments:
Post a Comment