ఎస్ బి ఐ రుణాల రద్దు అసలు కధ ఇది
Share
Tweet
ఎస్ బి ఐ బడా బాబులకి 7000 కోట్లు ఋణం రద్దు చేసింది అన్న వార్త ఒక్క సారి గా దేశ వ్యాప్తంగా కలకలం రేపింది …కేంద్రం పెద్ద నోట్ల పై తీసుకున్న నిర్ణయం తో ప్రజలు ఇబ్బంది పడుతుండగా ఈ నిర్ణయాన్ని బూతద్దం లో పెట్టి చూపించటం దేశం లో విపరీత ధోరణులకు దారి తీస్తుంది …మీడియా వారు ప్రతి వార్తని సంచలనం చేయటం వల్లనే ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నాయి అని ఆర్ధికవేత్తల అభిప్రాయం
Share
Tweet
ఎస్ బి ఐ బడా బాబులకి 7000 కోట్లు ఋణం రద్దు చేసింది అన్న వార్త ఒక్క సారి గా దేశ వ్యాప్తంగా కలకలం రేపింది …కేంద్రం పెద్ద నోట్ల పై తీసుకున్న నిర్ణయం తో ప్రజలు ఇబ్బంది పడుతుండగా ఈ నిర్ణయాన్ని బూతద్దం లో పెట్టి చూపించటం దేశం లో విపరీత ధోరణులకు దారి తీస్తుంది …మీడియా వారు ప్రతి వార్తని సంచలనం చేయటం వల్లనే ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నాయి అని ఆర్ధికవేత్తల అభిప్రాయం
సాధారణంగా పెద్ద కంపెనీలలో రుణగ్రస్తుల (debtors) విలువలో కనీసం 5 శాతం రాని బాకీల (bad debts) కొరకు సంశయాత్మక బాకీల నిధి (provision for bad debts) అని ఏర్పాటుచేసి లాభనష్టాల ఖాతాలో (Profit and loss account) ఖర్చుగా చూపించి ఆస్థిఅప్పుల పట్టీలో రుణగ్రస్తుల విలువ నుండి తీసివేసి చూపిస్తారు. నిజంగా ఏమైనా రానిబాకీలు ఎదురైనప్పుడు ఆ విలువను రుణగ్రస్తుల విలువలోనూ, ఈ నిధి నుండీ తగ్గించివేస్తారు. దీనిని రానిబాకీలరద్దు (bad debts written off) అంటారు. ఇక SBI లాంటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి అయితే ఉండే నిబంధనలు అన్నీ ఇన్నీ కావు. ప్రజల సొమ్ము షేర్ల రూపంలో అందులో పెట్టుబడిగా ఉంటుంది కాబట్టి వాళ్లు చూపించే ప్రతి అంకెకూ, సంఖ్యకూ ఖచ్చితత్వం ఉండాలి. వసూలు అవుతాయో కావో తెలియని రుణగ్రస్తుల(బ్యాంకు కాబట్టి అడ్వాన్స్ అంటారు) విలువ తగ్గించకుండా అలాగే ఎక్కువకాలం చూపించకూడదు.
2016 మార్చ్ నాటికి SBI అడ్వాన్స్ ల విలువ 14,63,700 కోట్ల రూపాయలు. దీనిలో 5% అంటే 73,185 కోట్లు. ఇప్పుడు రద్దు చేసిన అడ్వాన్స్ ల విలువ సుమారు 7200 కోట్లు. అందులో విజయ్ మాల్యా తీసుకున్న అప్పుల వాటా సుమారు 1200 కోట్లు. అంటే అది ఎంత శాతమో లెక్కించండి. మీకు లక్ష రూపాయలు రావలసి ఉండి అందులో ఒక రెండు వేల రూపాయలు రావేమో అంటే మీరు ఎలా ఆలోచిస్తారు అలానే ఆలోచించండి. మీరు అవి వదులుకోరు. కానీ వాటిని ఆస్థి కింద పరిగణించుకోకుండా మానసికంగా సంసిద్ధులై ఉండాలి
అంత మాత్రాన రావాల్సిన బాకీలనులూ వదులుకున్నట్లు కాదు. తమ షేర్ హోల్డర్స్ కు తెలియచేసేందుకు మాత్రమే. ఇక యధాప్రకారం వసూలు ప్రక్రియ కొనసాగిస్తుంది. ఈ మధ్య కాలంలో బ్యాంకుల నిరర్ధక ఆస్తులను (Non performing assets -NPA) లను తగ్గించేందుకు బలం చేకూర్చబడిన SARFAESI Act, మరియు ఇతర చట్టాలను కూడా ఉపయోగించి తాకట్టు పెట్టుకున్న ఆస్తులను వేలం వేసి ఆ బాకీలను వసూలు చేసుకుంటుంది. కానీ మన మీడియా దీనినే విజయ్ మాల్యా అప్పుల రద్దు అని ప్రచారం చేస్తోంది.
అంత మాత్రాన రావాల్సిన బాకీలనులూ వదులుకున్నట్లు కాదు. తమ షేర్ హోల్డర్స్ కు తెలియచేసేందుకు మాత్రమే. ఇక యధాప్రకారం వసూలు ప్రక్రియ కొనసాగిస్తుంది. ఈ మధ్య కాలంలో బ్యాంకుల నిరర్ధక ఆస్తులను (Non performing assets -NPA) లను తగ్గించేందుకు బలం చేకూర్చబడిన SARFAESI Act, మరియు ఇతర చట్టాలను కూడా ఉపయోగించి తాకట్టు పెట్టుకున్న ఆస్తులను వేలం వేసి ఆ బాకీలను వసూలు చేసుకుంటుంది. కానీ మన మీడియా దీనినే విజయ్ మాల్యా అప్పుల రద్దు అని ప్రచారం చేస్తోంది.
అసలే నోట్ల రద్దు కారణంగా ఇబ్బంది పడుతున్న కొంతమందిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందాం అనుకుంటున్న వివిధ రాజకీయ పార్టీలు దీనికి వంత పడుతున్నాయి. వీళ్ళు మారరు. మనమన్నాఆలోచిద్దాం . ఇందులో విజయ్ మాల్యాకు వత్తాసు పలకడంగానీ మోడీకి భజన చేయటంగానీ లేదు. వాస్తవాలు తెలియని ప్రజలలో విద్వేషాలు పెరగకూడదనే ప్రయత్నమే.
-కిషోర్ తోటకూర (ఛార్టర్డ్ అకౌంటెంట్ )
No comments:
Post a Comment