ఔదార్యం చాటిన సచిన్
14-06-2016 00:40:01
- బెంగాల్ స్కూల్కు రూ. 76 లక్షల విరాళం
కోల్కతా: క్రికెట్ దిగ్గజం, ఎంపీ సచిన్ టెండూల్కర్.. పశ్చిమ బెంగాల్, మిడ్నాపూర్ జిల్లాలోని ఓ స్కూల్కు విరాళం అందించాడు. స్కూల్ అభివృద్ధి పనుల కోసం సిబ్బంది రాసిన లేఖకు సచిన్ స్పందించాడు. పాఠశాలలో లైబ్రరీ, లేబొరెటరీ, బాలికల కోసం ఓ రూ మ్ కోసం సహా యం చేయాల్సింది గా విజ్ఞప్తి అందింది. దీంతో రూ. 76 లక్షల రూపాయలను సచిన్ విరాళంగా ఇచ్చాడు. స్వర్ణమొయి సస్మాల్ శిక్షా నికేతన్ విద్యార్థులు, సిబ్బందికి సచిన్ ఓ హీరో. ఇప్పుడు మాస్టర్ నుంచే విరాళం అందడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎంపీ లాడ్స్ కింద సచిన్ రూ. 76 లక్షలు మంజూరు చేశాడు. పాఠశాల అభివృద్ధి పనులు ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి.
No comments:
Post a Comment