UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 17 June 2016

ఒక మెగావాట్‌ సోలార్‌ విద్యత్ కోసం సుమారు 5 ఎకరాల స్థలం కావాలి. 1,000 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తికి 167 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవసరం. అణువిద్యుత కోసం కోట్లు వెచ్చిస్తున్నా.. అణుధార్మికతపై సందేహాలు కోకొల్లలు. రెండు కిలోమీటర్ల పొడవు, ముప్పయ్‌ మీటర్ల వెడల్పు ఉన్న స్థలంలోనే రోజుకు యాభైవేల మెగావాట్ల విద్యుత ఉత్పత్తి చేసి చూపిస్తానంటున్నాడు మన తెలుగింటి శాస్త్రవేత్త డాక్టర్‌ చాగంటి శ్రీనివాస్‌ భాస్కర్‌. ఈ పవర్‌మ్యాన్‌ నూతన ఆవిష్కరణ విశేషాలను ‘నవ్య’తో ఇలా పంచుకున్నారు. 

ప్రకృతిని ఫణంగా పెట్టి శతాబ్దాలుగా మన అవసరాలను తీర్చుకుంటున్నాం. ఫలితంగా నేడు గ్లోబల్‌వార్మింగ్‌ను ఎదుర్కొంటున్నాం. మనిషి మనుగడకు విద్యుత అత్యంత అవసరం. డిమాండ్‌ మేరకు రకరకాల మార్గాల్లో విద్యుతను ఉత్పత్తి చేస్తున్నాం. థర్మల్‌ పవర్‌ కోసం భూమిని తొలిచి బొగ్గును వెలికి తీస్తున్నాం. వేడిని గ్రహించడంలో బొగ్గును మించిన పదార్థం లేదు. భూమిలో ఉన్న బొగ్గంతా వాడేస్తుంటే.. భూతాపం పెరగకుండా ఎలా ఉంటుంది. అణువిద్యుత్ పేరిట భూగోళాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతున్నాం. ఈ సమస్యలకు పరిష్కారం మా పవర్‌ జనరేటర్‌.

డాక్టర్‌ అయ్యాక ఇంజనీరింగ్‌ 
పాతికేళ్ల కిందట మెడిసిన్‌ పూర్తి చేశాను. డాక్టర్‌గా సెటిల్‌ అవుతున్న తరుణంలో నా మేన మరదలు బాలాతో వివాహమైంది. తను ఇంజనీరింగ్‌ చేసింది. ఏదైనా నూతన ఆవిష్కరణ చేయాలని, అది ప్రజలందరికీ మేలు చేయాలని ఎప్పుడూ అంటుండేది. ఒకరోజు పోర్టబుల్‌ పవర్‌ జనరేటర్‌ గురించి చెప్పింది. డాక్టర్‌ చదివిన నాకు మొదట ఆమె చెప్పింది అర్థం కాలేదు. ‘డిమాండ్‌ సప్లయ్‌ ఈ రెండింటికీ మధ్య భారీ వ్యత్యాసం ఎక్కడైనా ఉందంటే అది విద్యుతలోనే. ఈ యంత్రంతో ఆ లోటును భర్తీ చేయవచ్చు. నీకు తోడుగా నేనుంటాను.. నా కోసం దీన్ని తయారు చేయగలవా..?’ అని అడిగింది. నాకూ కొత్తగా అనిపించింది. వెంటనే ఓకే చెప్పేశాను. నా డాక్టర్‌ డిగ్రీని పక్కన పెట్టి మళ్లీ స్టూడెంట్‌గా మారి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివాను. నా భార్య సహకారంతో పవర్‌ జనరేషన్‌కు సంబంధించిన అన్ని విషయాలపై పట్టు సాధించాను. ఇంజనీరింగ్‌ పూర్తవ్వగానే పవర్‌ జనరేటర్‌ తయారీకి ఇద్దరం శ్రీకారం చుట్టాం.
ఎనిమిదేళ్ల కృషి 
మేము తయారు చేసే పరికరం సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని ముందుగానే నిశ్చయించుకున్నాం. రకరకాల జనరేటర్లు తీసుకొచ్చి అవి ఎలా పని చేస్తున్నాయి? ఏం చేస్తే ఇంతకన్నా మెరుగ్గా పనిచేస్తాయో పరిశీలించాం. ఎనిమిదేళ్ల కృషి తర్వాత మొదటి ఫలితం వచ్చింది. అదే మా పోర్టబుల్‌ పవర్‌ జనరేటర్‌. దీని కోసం ఓ మోటర్‌ పంప్‌ను డిజైన్‌ చేశాం. తక్కువ విద్యుత్తో ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే 5హెచ్‌పీ సామర్థ్యాన్ని 1హెచ్‌పీలోనే అందించాం. మరోవైపు తక్కువ వ్యవధిలో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్‌ జనరేటర్‌ను తయారు చేశాం. ఈ రెండింటినీ కలిపి విజయవంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయగలిగాం. ఇందులో జనరేటర్‌కు అనుసంధానం చేసిన టర్బయిన్‌పైకి పంప్‌ సాయంతో నీటిని పంపిస్తాం. నీటి ప్రెషర్‌కు టర్బయిన్‌ వేగంగా తిరుగుతుంది. టర్బయిన్‌ ఒకసారి తిరిగితే జనరేటర్‌ పదిసార్లు రొటేట్‌ అయ్యేలా డిజైన్‌ చేశాం. దీనివల్ల మామూలు జనరేటర్‌లో కన్నా ఎక్కువ విద్యుత ఉత్పత్తి అవుతుంది.

తర్వాత పన్నెండేళ్లు.. 
ఎనిమిదేళ్లు అహోరాత్రులు కష్టపడితే తొలి విజయం అందుకోగలిగాం. అయితే దీన్ని మరింత స్మార్ట్‌గా తీర్చిదిద్దడానికి తర్వాత పన్నెండేళ్లు పట్టింది. ఒక్కో సమస్యను అధిగమిస్తూ ప్రస్తుతం నూటికి నూరుశాతం సమర్థవంతంగా పనిచేసే జనరేటర్‌ను తయారు చేశాం. పేటెంట్‌ కూడా సాధించాం. ఈ ప్రయత్నంలో మా ఆస్తులన్నీ కరిగిపోయాయి. అప్పులు పేరుకుపోయాయు. నా భార్య ఆరోగ్యం బాగా దెబ్బతింది. బ్రెస్ట్‌ కేన్సర్‌ బారినపడింది. డాక్టర్ని కావడంతో నేనే వైద్యం అందించాను. కొన్నాళ్లకు తన ఆరోగ్యం కుదుటపడింది.
రెండు రూపాయలకే యూనిట్‌ 
ఈ ప్రొడక్ట్‌ మొదలుపెట్టిన రోజునే విజయం సాధిస్తామనే నమ్మకం మాకుండేది. అనుకున్నట్టే దీనికి ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. కేవలం గృహ అవసరాలకే కాదు.. దీని సాయంతో ఇండియాను పవర్‌ఫుల్‌ దేశంగా నిలబెట్టవచ్చు. అందుకోసం క్యాస్‌కేడింగ్‌ పద్ధతిని పాటిస్తున్నాం. దీని ద్వారా వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చు. ఈ విధానంలో జనరేటర్లను ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేసి ఒక్కరోజులో యాభైవేల మెగావాట్ల విద్యుతను ఉత్పత్తి చేయవచ్చు. అంటే ఒక్కరోజులో ఐదు కోట్ల యూనిట్ల కరెంట్‌ పుడుతుంది. అది కూడా కేవలం రెండు రూపాయలకు యూనిట్‌ చొప్పున లభిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వాలు ఆరు రూపాయలకు యూనిట్‌ చొప్పున విద్యుత కొనుగోలు చేస్తున్నాయి. ఈ లెక్కన విద్యుత్ కోసం వెచ్చిస్తున్న మొత్తం 66 శాతం తగ్గిపోతుంది.

తొలిప్లాంట్‌కు సన్నాహాలు.. 
మా పవర్‌ జనరేటర్‌ పనితీరు గురించి పలు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాను. ప్లానింగ్‌ కమిషన్‌కు కూడా మా యంత్రం పనితీరును ప్రయోగాత్మకంగా వివరించాను. వారి నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఒక ప్రాజెక్ట్‌ చేయబోతున్నాం. రెండువేల మెగావాట్ల ప్లాంట్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేవలం రెండు కిలోమీటర్ల పొడవు, ముప్పయ్‌ మీటర్ల వెడల్పు ఉన్న పారాబోలా కెనాల్‌లో ఈ జనరేటర్లను ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తి చేయనున్నాం. అందుకు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఏడువేల కోట్ల రూపాయల పెట్టుబడితో గంటకు ఇరవై లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నాం. 
ప్రభుత్వం సహకారం లభిస్తే మా పవర్‌ జనరేటర్స్‌తో అద్భుతాలు సృష్టించవచ్చు. విద్యుత్ లోటు లేని దేశంగా భారతను నిలబెట్టవచ్చు. థర్మల్‌, న్యూక్లియర్‌ పద్ధతుల్లో పవర్‌ జనరేషన్‌కు స్వస్తి పలికి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. రైతులకు ఇరవైనాలుగు గంటల ఉచిత విద్యుత్ అందిచవచ్చు. అంతేకాదు.. పేదలందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వవచ్చు. పరిశ్రమలకు తక్కువ ధరకే పవర్‌ సప్లయ్‌ చేయవచ్చు. పవర్‌ హాలిడే అన్న ప్రసక్తే ఉండదు. ఆర్థికంగా ఊహించని ఫలితాలు పొందవచ్చు. 

కరెంట్‌ సమస్య లేకుండా.. 
నాలుగు రోజులు ఈ యంత్రం పనిచేస్తే నెలకు సరిపడా వంద యూనిట్ల విద్యుత లభిస్తుంది. ఏడాదిలో తొమ్మిది వేల యూనిట్ల విద్యుత ఇంట్లోనే తయారవుతుంది. బ్యాటరీ సాయంతో ఈ పవర్‌ను స్టోర్‌ చేసుకుని వాడుకోవచ్చు. దీన్ని ఏర్పాటు చేసుకోవడానికి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. పాతికేళ్ల వరకు కరెంట్‌ బిల్లు సమస్యే ఉండదు.
త్రిగుళ్ల నాగరాజు

No comments:

Post a Comment