రక్తపోటుకు మందారమే మందు...?
పూలంటే సుగంధానికో, సౌందర్యానికో అనుకుంటాం కానీ కొన్నిపూలు, గొప్ప ఔషధాలుగా కూడా పనిచేస్తాయి. మందార పూలతో తయారు చేసిన టీ అధిక రక్తపోటును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
అమెరికాలోని హ్యూమన్ న్యూట్రి షన్ రీసెర్చ్ సెంటర్ వారు 30 నుంచి 70 ఏళ్ల వయస్కుల మీద చేసిన ఈ అధ్యయనంలో సిస్టాలిక్, డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్లు గణనీయంగా తగ్గాయి. ఈ అధ్యయనంలో అధిక రక్తపోటు సమస్య ఉన్న వారిని రెండు బృందాలుగా తీసుకున్నారు. వారిలో ఒక బృందానికి 6 వారాల
పాటు రోజుకు మూడు కప్పుల చొప్పున మందారపు టీ ఇచ్చారు. రెండవ గ్రూపు వారికి అదే మోతాదులో ప్లేసిబో అంటే కృత్రిమ మందారపు ద్రవాన్ని ఇచ్చారు. అయితే మందారపు టీ తీసుకున్న వారిలో రక్తపోటు తగ్గడాన్ని వారు గుర్తించారు. విశే షించి, సాధారణ రక్తపోటు కన్నా, అత్యధిక రక్తపోటును తగ్గించడంలో ఈ మందారపు టీ పాత్ర చాలా బలంగా ఉంటోంది. ఏమైనా దేన్నో అందంగా అలంకరించడానికి ఉద్దేశించే మందార పూలల్లో ఇంతటి ఔషధ విలువలు ఉన్నట్లు బయటపడటం మానవాళికి ఒక గొప్ప సాంత్వననిచ్చే వార్తే.
షేర్ చేయండి....
No comments:
Post a Comment