-బంజారాలకు సర్కారు ప్రాధాన్యం
-గిరిజనాభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారు: మంత్రి చందూలాల్
-విద్యావంతులు పేద విద్యార్థులనుదత్తత తీసుకోవాలని సూచన
-గిరిజనాభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారు: మంత్రి చందూలాల్
-విద్యావంతులు పేద విద్యార్థులనుదత్తత తీసుకోవాలని సూచన
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం బంజారాలకు ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక శాఖా మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. గిరిజనుల్లో ఎంతో మంది విద్యావంతులు, మేధావులుగా ఎదిగారని, ఎంత ఎదిగినా జాతికి ఏం చేశారన్నది ముఖ్యమని అన్నారు. ఆర్థికపరంగా పురోభివృద్ధి సాధించిన గిరిజన విద్యావంతులు చదువుకొనలేకపోతున్న పేద విద్యార్థులను దత్తత తీసుకోవాలని కోరారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్యభవన్లో నిర్వహించిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే, సంఘ్ అధ్యక్షుడు టీ కిషన్సింగ్ అధ్యక్షత వహించిన సభలో మంత్రి చందూలాల్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో గిరిజనాభివృద్ధికి పాటుపడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని గుర్తుచేశారు. ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రైబల్ ఎకౌంట్ కింద రూ.రెండువేల కోట్లు కేటాయించారని, తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించడంతోపాటు గిరిజన జనాభా దామాషా ప్రకారం 9.08 శాతం రిజర్వేషన్లు సైతం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. సీఎం నాయకత్వంలో బంగారు తెలంగాణలో గిరిజనులు భాగస్వాములు కావాలని కోరారు. మానుకోట ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ గత పాలకులు ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నదన్నారు.
సంక్షేమ హాస్టళ్లలో కనీ వినీ ఎరుగని రీతిలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని, గిరిజనుల విదేశీ విద్యకు సైతం రూ.10లక్షల నుంచి రూ.25లక్షలకు నిధుల పెంపునకు కృషి జరుగుతున్నదని తెలిపారు. కర్మాగారం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం రూ.25లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేసేందుకు ముందుకు వస్తున్నదన్నారు. తండాల్లో అత్యంత ప్రమాణాలతో రోడ్లు వేయించారని, ప్రతి జిల్లా కేంద్రంలో గిరిజన భవనం, ప్రతి తండాలో సామాజిక భవన నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. సమావేశంలో నూతనంగా ఎన్నికైన సంఘం అధ్యక్షుడు టీ కిషన్సింగ్, మాజీ అధ్యక్షుడు జగన్నాథరావు, హస్తినాపురం కార్పొరేటర్ రమా పద్మానాయక్లను శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తేజావత్ రామచంద్రు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షులు రాజు నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షుడు అమర్సింగ్ తిలావత్, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మాజీ మంత్రులు రవీంద్రనాయక్, పీ జగన్నాయక్, మాజీ చీఫ్ విప్ భారతి రాగ్యానాయక్, మాజీ పంచాయతీ సమితి అధ్యక్షుడు లచ్చీరాం నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ లక్ష్మణ్ నాయక్, ఇన్కంట్యాక్స్ జాయింట్ కమిషనర్ పీర్యానాయక్, ఎస్ఈ మోహన్సింగ్, ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్, ప్రొఫెసర్ రమణానాయక్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment