బిస్కెట్లు వేస్తున్నారు.అందరిని కొనుగోలు చేస్తున్నారు.గత ఏడాది ఒక సాదారణ కానిస్టేబుల్
దగ్గర ఏడు కోట్లు అక్రమ సొమ్ము పోగుబడినట్టువార్తలు వచ్చాయి.మరి మిగతా అదికారుల పరిస్తితి ఎలా ఉంటుందో శులభంగా
చెప్పొచ్చు.ఏడుకొండలలో.. ...ఎర్ర చందనం కాపాడలేని ..దద్దమ్మలు దేవుడినిఎలా కాపాడుతారు?
తిరుమల కొండపై ఎర్ర చందనాన్నే కాపాడలేని మన రక్షణ వ్యవస్థ ఇక దేవుడిని ఎలా రక్షిస్తుంది.? పోలీసులు,అటవీ అధికారులు.. దేవుడిని రక్షించగల రా?...
అనే అనుమానాలు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు బలపడుతున్నాయి.ఎందుకం టే,ఏడు కొండల
మీద యధేచ్చగా బరితెగించిన దొంగలు ఎర్ర చందనం ను,అను దినం నరికేస్తున్నా,రక్షణ వ్యవస్థ
చేష్టలుడిగి చూస్తున్నది.తూ తూ మంత్రంగా కొందరిని అరెస్టులు చూపించి ఎంతో ఘన కార్యం చేసి
నట్టు పత్రికలలో టీవీ లలో ప్రచారం చేసుకుంటున్నారు.ఎర్ర చందనం
అడపా దడపా పట్టుకున్నదే గత ఏడాది పది లక్షల టన్నులువేలం వేశారు అంటే స్మగ్లర్లు నరికి సొమ్ము చేసు
కున్నది అంతకు వంద రెట్లు ఉండ వచ్చునని అధికారులు అంటున్నారు..అంతకు వంద రెట్లంటే లక్ష కోట్ల విలువైన
ఎర్ర చందనం స్మగ్లర్ల పాలిట కనక వర్షం కురిపంచి నట్టే...మొన్నటి ఎన్నికలలో ఎర్ర చందనం డబ్బు
రాజకీయ నాయకులకు వోట్ల వర్షం కురిపించిం డంటున్నారు.తిరుమల చుట్టుపక్కల చిత్తూరు
జిల్లాలో ఉన్న రక్షణ వ్యవస్థ కన్నా స్మగ్లరులు ఎంతో బలమైన వారుగా పరిస్తితులు స్పష్టం చేస్తూ
న్నాయి.ప్రభుత్వ రక్షణ వ్యవస్థ ఇక దేవుడిని,దేవాలయాన్ని,జిల్లా ప్రజలను ఎలా కాపాడ గలరనే
అనుమానం రోజు రోజుకు ప్రబలమై పోతున్నది.
No comments:
Post a Comment