ఇష్టారాజ్యంగా రైతుల భూములు లాక్కుంటారా?
Sakshi | Updated: July 23, 2016 01:41 (IST)
ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- అధికారం ఉందని భూములు లాక్కుంటామంటే కుదరదు
- ఆరు దశాబ్దాల తక్కావి రుణాల కేసులో సర్కారు అప్పీల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్ : అధికారం ఉందని చెప్పి ప్రభుత్వం రైతుల నుంచి ఇష్టారాజ్యంగా భూములు లాక్కుంటామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. తక్కావి రుణాలను తిరిగి చెల్లించలేదంటూ మెదక్ జిల్లాలోని వెలిమల గ్రామానికి కొందరు రైతుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని తప్పుపట్టింది. ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, తదితరులు దాఖలు చేసిన అప్పీల్ను కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆరు దశాబ్దాల నాటి రుణం
వెలిమల గ్రామానికి చెందిన కొందరు రైతులు 1956-59 మధ్య ప్రభుత్వం నుంచి తక్కావి రుణాలు తీసుకున్నారు. అయితే వాటిని తిరిగి చెల్లించలేకపోవడంతో అప్పటి తహసీల్దార్ వారి భూములను స్వాధీనం చేసుకున్నారు. ఏడాదిలోపు రుణాలను వడ్డీతో సహా చెల్లిస్తేనే భూములను స్వాధీనం చేస్తామని రైతులకు నోటీసులు ఇచ్చారు. దీంతో రైతులు రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించేశారు. అయినప్పటికీ ఆ భూములను రైతులకు స్వాధీనం చేయకుండా వారికే లీజుకిచ్చారు. తాజాగా ఆ భూములను వేలం వేసేందుకు అధికారులు సిద్ధం కావడంతో రైతులు కోర్టును ఆశ్రయిం చారు. విచారణ జరిపిన కోర్టు భూములను వారికి రీ అసైన్ చేసే విషయంలో వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.
అధికారులు స్పందించకపోవడంతో వారు మరోసారి హైకోర్టును ఆశ్రయించగా రైతులకు అనుకూలంగా ఫిబ్రవరిలో తీర్పువచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టగా రైతుల తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. రుణాలను పిటిషనర్ల పూర్వీకులు ఎప్పుడో చెల్లించేసినా అధికారులు ఆ భూములను రైతులకు రీ అసైన్ చేయకుండా వారికే లీజుకిచ్చి తరువాత వేలానికి సిద్ధమయ్యారన్నారు. అయితే రైతులు రుణాలు చెల్లించకపోవడంతోనే వారి భూములను స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. కానీ ఈ వాదనలతో ధర్మాసనం విభేదించింది.
- అధికారం ఉందని భూములు లాక్కుంటామంటే కుదరదు
- ఆరు దశాబ్దాల తక్కావి రుణాల కేసులో సర్కారు అప్పీల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్ : అధికారం ఉందని చెప్పి ప్రభుత్వం రైతుల నుంచి ఇష్టారాజ్యంగా భూములు లాక్కుంటామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. తక్కావి రుణాలను తిరిగి చెల్లించలేదంటూ మెదక్ జిల్లాలోని వెలిమల గ్రామానికి కొందరు రైతుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని తప్పుపట్టింది. ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, తదితరులు దాఖలు చేసిన అప్పీల్ను కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆరు దశాబ్దాల నాటి రుణం
వెలిమల గ్రామానికి చెందిన కొందరు రైతులు 1956-59 మధ్య ప్రభుత్వం నుంచి తక్కావి రుణాలు తీసుకున్నారు. అయితే వాటిని తిరిగి చెల్లించలేకపోవడంతో అప్పటి తహసీల్దార్ వారి భూములను స్వాధీనం చేసుకున్నారు. ఏడాదిలోపు రుణాలను వడ్డీతో సహా చెల్లిస్తేనే భూములను స్వాధీనం చేస్తామని రైతులకు నోటీసులు ఇచ్చారు. దీంతో రైతులు రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించేశారు. అయినప్పటికీ ఆ భూములను రైతులకు స్వాధీనం చేయకుండా వారికే లీజుకిచ్చారు. తాజాగా ఆ భూములను వేలం వేసేందుకు అధికారులు సిద్ధం కావడంతో రైతులు కోర్టును ఆశ్రయిం చారు. విచారణ జరిపిన కోర్టు భూములను వారికి రీ అసైన్ చేసే విషయంలో వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.
అధికారులు స్పందించకపోవడంతో వారు మరోసారి హైకోర్టును ఆశ్రయించగా రైతులకు అనుకూలంగా ఫిబ్రవరిలో తీర్పువచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టగా రైతుల తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. రుణాలను పిటిషనర్ల పూర్వీకులు ఎప్పుడో చెల్లించేసినా అధికారులు ఆ భూములను రైతులకు రీ అసైన్ చేయకుండా వారికే లీజుకిచ్చి తరువాత వేలానికి సిద్ధమయ్యారన్నారు. అయితే రైతులు రుణాలు చెల్లించకపోవడంతోనే వారి భూములను స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. కానీ ఈ వాదనలతో ధర్మాసనం విభేదించింది.
No comments:
Post a Comment