బాగుపడాలంటే మనం మేల్కోవాలి
. సంకల్పం ఉంటే సాధించలేనిదంటూ లేదు
వరంగల్: ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, సాధించుకున్న రాష్ర్టాన్ని అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. ఇవాళ జిల్లాలోని మేడిపల్లిలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆయన పాల్గొని పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ మన ఊరు బాగుపడాలంటే మనమంతా మేలుకోవాలని కోరారు. ఎవరో పక్క ఊరువాళ్లు వచ్చి మన ఊరును బాగు చేయరని తెలిపారు.
మేడిపల్లిలో నాలుగు వేల మంది ఉన్నారని వాళ్ల ఎనిమిది వేల చేతులు కలిస్తే గ్రామంలో చెత్త ఉంటుందా? అని ప్రశ్నించారు. పరిశుభ్రంగా జీవించాలని మనం ఎందుకు అనుకోవడంలేదన్నారు. మన పల్లెను మనమే శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం రావాలన్నారు. సంకల్పం ఉంటే సాధించలేనిదంటూ లేదన్నారు. అందరు కలిసి ఉత్సాహంగా గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలని కోరారు.
No comments:
Post a Comment