భక్తి గురించి శ్రీరామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పేవారు "చిన్నపిల్లవాడు దూరంగా ఉన్న తల్లి గురించి ఏడ్చినట్లుగా మనం కూడా అలా దేవుని గురించి విలపించగలమా? దేవుని వైపు ఒక్క అడుగు వేయండి, ఆయన పరుగున వచ్చి మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాడు" అంటారు పరమహంస. ఆయన కలకత్తాలోని కాళికాలయంలో నేలపై పడిదొర్లుతూ "అమ్మా, నాతో మాట్లాడమ్మా" అంటూ విలపించేవారు. అమ్మవారు ప్రతి రోజూ అయనతో మాట్లాడేది.
శ్రీరామకృష్ణ పరమహంస మరో సందర్భంలో "ధనవంతుడి ఇంట్లో పనిచేస్తున్న యువతి, ఆ ధనవంతుడి కుమారునికి అన్ని పనులూ చేస్తూ ఉన్నా, ఆమె ఆలోచనలు మాత్రం ఇంటి వద్ద ఉన్న తన కుమారుని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి", అదే విధంగా మనం ఏ పని చేస్తూఉన్నా భగవంతుడు గురించే ఆలోచించాలి, భగవంతుడి నామాన్నే జపించాలి, భగవంతుడి గురించే వినాలి, భగవంతుడినే చూడాలి" అంటారు.
శ్రీరామకృష్ణ పరమహంస మరో సందర్భంలో "ధనవంతుడి ఇంట్లో పనిచేస్తున్న యువతి, ఆ ధనవంతుడి కుమారునికి అన్ని పనులూ చేస్తూ ఉన్నా, ఆమె ఆలోచనలు మాత్రం ఇంటి వద్ద ఉన్న తన కుమారుని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి", అదే విధంగా మనం ఏ పని చేస్తూఉన్నా భగవంతుడు గురించే ఆలోచించాలి, భగవంతుడి నామాన్నే జపించాలి, భగవంతుడి గురించే వినాలి, భగవంతుడినే చూడాలి" అంటారు.
No comments:
Post a Comment