దుబాయ్ లో భారత్ మాతాకీ జై నినాదంతో ప్రసంగం ప్రారంభించారు మోడీ..
ఉగ్రవాదంపై నిర్ణయాత్మక పోరాటం జరపాల్సిన సమయం వచ్చిందని దుబాయ్ వేదికగా పిలుపునిచ్చారు భారత ప్రధాని నరేంద్రమోడీ. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో ఉంటారా లేక వాటికి వ్యతిరేకంగా ఉంటారా అన్నది నిర్ణయించుకోవాలని చెప్పారు. పరోక్షంగా పాకిస్థాన్ కు చురకలంటించారు. 50వేల మందికిపైగా భారతీయులతో కిక్కిరిసిపోయిన దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు మోడీ.
దుబాయ్ లో ప్రధాని నరేంద్ర మోడీ మెగా షో గ్రాండ్ సక్సెస్ అయింది. అక్కడి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారతీయ ప్రజా సమూహాన్ని ఉద్దేశించి ఆయన చేసిన ప్రంసంగాన్ని వినేందుకు జనం క్యూ కట్టారు. దాదాపు 50వేల మంది తరలిరావడంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. స్థలం చాలకపోవడంతో ఇంకా వేలాది మంది బయటి నుంచే ఆయన ప్రసంగాన్ని విన్నారు. నినాదాలు, హర్షాతిరేకాలతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
భారత్ మాతాకీ జై నినాదంతో ప్రసంగం ప్రారంభించారు మోడీ. 50వేల మంది పాల్గొన్న ఈ సభ మినీ భారత్ లా కనిపిస్తోందంటూ ఉత్తేజంగా మాట్లాడారు. దాదాపు 70 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో.. ఉగ్రవాదం , యూఏఈ అందిస్తున్న సహకారం , పొరుగు దేశాలతో భారత్ సంబంధాలతో పాటు దేశంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. యూఏఈలో లీగల్ కేసుల విషయంలో భారతీయులకు సాయం చేసేందుకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు….
No comments:
Post a Comment