సారాపై సమరశంఖం
సారా వ్యతిరేక పోరాట జేఏసీ
సారాపై సమరశంఖంపై పూరించాలని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. గ్రామజ్యోతి కార్యక్రమ వేదికలపై…ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సారా వ్యతిరేక పోరాట జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, శ్రావణ్తో పాటు ఇతర నేతల హాజరయ్యారు. తెలంగాణ సారా వ్యతిరేక పోరాట జేఏసీలో అన్ని ప్రజాసంఘాలు, పార్టీలను భాగస్వాములను చేస్తామని నేతలు స్పష్టం చేశారు. గ్రామీణ కుటుంబ వ్యవస్థను దెబ్బతీసే విధంగా..ప్రభుత్వం చీప్ లిక్కర్ను తీసుకొస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు గ్రామీణ వాతవారణాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
No comments:
Post a Comment