అసెంబ్లీ వద్ద ప్రతిపక్షాల ర్యాలీ
ఐఏఎస్ అధికారి రవి ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేసిన కర్నాటక ప్రతిపక్షాలు గురువారం అసెంబ్లీ వద్ద ర్యాలీ నిర్వహించాయి. ఇదే అంశంపై ఈ రోజు కూడా అసెంబ్లీ దద్దరిల్లింది. రవిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్న ప్రతిపక్షాలు ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం సీఐడీ దర్యాప్తు జరిపించాలనే భావిస్తోంది. ప్రభుత్వంతో విభేదిస్తున్న ఎమ్మెల్యేలు శాసనసభ వద్ద ర్యాలీ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా జేడీఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రవిది ఆత్మహత్య కాదని, ల్యాండ్ మాఫియాయే రవిని బలి తీసుకుందని వారు ఆరోపిస్తున్నారు.
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment