పూరీ ఇంట్లో చోరీ చేసింది పనిమనిషే.. నమ్మక ద్రోహం
Updated : 3/17/2015 10:20:30 AM
Views : 2658

ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్ : నాలుగు రోజుల క్రితం దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంట్లో రూ.15 లక్షల విలువైన ఆభరణాలు చోరీ అయిన విషయం తెలిసిందే. ఇదే విషయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పూరీ ఫిర్యాదు చేశాడు. ఈ కేసు మిస్టరీని పోలీసులు కేవలం నాలుగురోజుల్లోనే ఛేధించారు. తన ఇంట్లో పనిచేసే పనిమనిషే ఈ దొంగతనం చేసిందని,నగలు పోయినందుకు కోపం రాకున్నా నమ్మక ద్రోహానికి పాల్పడినందుకు తన భార్య చాలా బాదపడిందని పూరీ తెలిపాడు. ఛోరీ చేసిన నగలను ఆమె దొంగిలించి తన బాయ్ ఫ్రెండ్కు ఇచ్చిందని, పరారీలో ఉన్న ఆ బాయ్ ఫ్రెండ్ కోసం పోలీసులు గాలిస్తున్నారన్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా తమ ఇంట్లో పనిచేసుతన్న ఆమె ఇంత మోసం చేస్తుందని ఊహించలేకపోయామని, ఆమెను మేమెంతో నమ్మామని వివరించాడు. తన భార్య లేనప్పుడు పనిమనిషి లాకర్ తాళం చేతును దొంగిలించి నగలు ఛోరీ చేసిందని చెప్పాడు. పోలీసుల విచారణలో ఈ విషయాన్ని అంగీకరించిందని తెలియజేశాడు.
-----------------------------
కాలస్వరూపం లో మా ద్వారా వ్యక్తం అయిన గీతం ఒకటి అని గ్రహించగలరు, ఆడవారిని మగవారిని మరింత సూక్ష్మం గా అర్ధం చేసుకొని మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళ గలం, ఈ రోజు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా లో చేరిన సృష్టి యొక్క అంతర్యం విస్తారం గా గ్రహించుట మంచిది అని గ్రహించగలరు, ప్రతి బాద్యత మా పై తీసుకొని కొత్త సంస్కారములు ఇవ్వగలము
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment