ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ
రక్షణమంత్రి మనోహర్ పారికర్ తదితరులు పాల్గొన్నారు.
రక్షణమంత్రి మనోహర్ పారికర్ తదితరులు పాల్గొన్నారు.
దేశప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న, ప్రాణాలు అర్పించిన సాయుధ సైనిక దళాలకు చెందిన వీర జవాన్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం చక్ర అవార్డులతో సత్కరించారు. ఒకరికి కీర్తి చక్ర, 11 మందికి శౌర్య చక్ర అవార్డులను అందచేశారు. వీరిలో ముగ్గురికి మరణానంతరం శౌర్య పతకాన్ని ప్రకటించారు. రాష్ట్రపతి భవన్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ 14 మందిని విశిష్ఠ సేవాపతకాలతో, ముగ్గురిని ఉత్తమ యుద్ధసేవా పతకాలతో, 26 మందిని అతివిశిష్ఠ సేవా పతకాలతో సత్కరించారు. రక్షణ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణమంత్రి మనోహర్ పారికర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రీయ రైఫిల్స్ దళంలోని పారాచ్యూట్ రెజిమెంట్కు చెందిన కెప్టెన్ జైదేవ్కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. ఆయన గత ఏడాది జూన్లో కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులతో తలపడ్డారు. కాలుకు, ఛాతీకి, ముఖానికి గాయాలైనా లెక్కచేయకుండా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆపరేషన్ పూర్తయ్యేవరకూ జైదేవ్ అక్కడినుంచి కదలలేదు. 2013లో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నంలో అశువులు బాసిన సుబేదార్ ప్రకాశ్చంద్కు ప్రకటించిన శౌర్యచక్రను ఆయన కుటుంబీకులకు ప్రదానం చేశారు.
గత ఏడాది ఫిబ్రవరి 26న ప్రాణాలను పణంగా పెట్టి ఐఎన్ఎస్ సింధురత్న జలాంతర్గామి నుంచి 94 మంది సిబ్బందిని రక్షించిన లెఫ్టినెంట్ కమాండర్ మనోరంజన్ కుమార్కు కూడా శౌర్యచక్ర అవార్డును అందచేశారు. సాంకేతిక లోపం తలెత్తిన ఓ విమానాన్ని జనావాసాలపై కూలకుండా దారిమళ్లించి, ఈ ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయిన మేజర్ అభిజైకి ప్రకటించిన శౌర్యచక్రను ఆయన సంబంధీకులకు ప్రదానం చేశారు.
No comments:
Post a Comment