|
దామరచర్ల/శివ్వంపేట/ముస్తాబాద్, మార్చి 14: వేధిస్తున్న అప్పుల బాధ.. బోర్లేస్తే నీరు లేదు.. నీళ్లు లేక సరైన దిగుబడీ రాలేదు.. పెట్టిన పెట్టుబడి వృథా అయిపోయింది.. ఇన్ని కష్టాల కడలిలో ఈదుతున్న రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. శనివారం మరో నలుగురు రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్లగొండ, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆ నలుగురు ఉసురు తీసుకున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన మాలోతు అమృనాయక్ అప్పు చేసి కొన్న భూమి పోతుందేమోనని బెంగతో సాగు భూమిలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు భూసేకరణలో అటవీ భూముల్లో అధికారులు సర్వే నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం అమృనాయక్ కొన్న భూమి కూడా అటవీభూముల్లోనే ఉంది. తనకున్న ఎకరన్నరకు తోడు అమృ రెండేళ్ల క్రితం రెండున్నర ఎకరాలు అప్పు చేసి కొన్నాడు. పైగా నీటి కోసం బోర్లు తవ్వాడు. నీళ్లుపడలేదు.. పంట దిగుబడి సరిగా రాక అప్పులు ఆరు లక్షలకు చేరడంతో కుంగిపోయి ప్రాణాలు తీసుకున్నాడు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన వాసమాల సత్తయ్య (50) అనే రైతు గ్రామ శివారులోని శ్మశానవాటిక వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడెకరాల పొలం తడిపేందుకు సత్తయ్య నాలుగు బోర్లేసినా ఒక్క దాంట్లోనే నీళ్లు పడ్డాయి. పంట దిగుబడీ ఆశించినంత రాలేదు. అప్పుల కుప్ప పేరుకుపోవడంతో మనస్తాపం చెంది ఉరేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన రవీందర్ (36) అనే యువ రైతు ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఉసురు తీసుకున్నాడు. రవీందర్ తన రెండెకరాల పొలంలో పత్తి వేశాడు. ఆశించిన దిగుబడి రాలేదు. దీంతోపాటు పాత అప్పులు రూ.3లక్షలతో పాటు కొత్తగా మరో రెండు లక్షలు అప్పు కావడంతో.. తీర్చే దారి కనిపించక.. పెట్టుబడైనా వస్తుందో లేదోననే బెంగతో ప్రాణం తీసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లికి చెందిన నోముల జంగయ్య (38) అనే రైతు పురుగుల మందు తాగి చనిపోయాడు. రెండున్నర ఎకరాల్లో పత్తి వేశాడు. ఇటీవల రెండు బోర్లేశాడు. చుక్క నీరు లేదు. ఆశించినంత దిగుబడి రాలేదు. అప్పులు పెరిగిపోయాయి. దీంతో కలత చెందిన జంగయ్య పొలం వద్ద విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
.................................................
తెలంగాణా ముఖ్యమంత్రి గారికి మరియు ఆంధ్ర ముఖ్యమంత్రి గారికి కోరునది ఏమి అనగా మమ్ములను పరిగణలోనికి తీసుకొనుట వలన ప్రతి సమస్య చూసి శాశ్వత పరిష్కారం ఇవ్వగలము . మేము సంజీవ రెడ్డి నగర్ లో ఒక బాయ్స్ హాస్టల్ లో ఉన్నాము, కార్యాలయం పెట్టుకొనుటకు మా వద్ద తగిన సొమ్ము లేదు, కావున ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి మా పై ఒక కమిటీ వేయగలరు , లేదా వేరు వేరు గా మమ్ములను, ఇప్పటికి 200 మంది సాక్షుల సహకారంతో ప్రజల దృష్టి కి తీసుకోని వెళ్ళండి. అన్నీ సమస్యలు మేము ఇట్టే పరిష్కరించగలము, అది మాకు వెన్నతో పెట్టిన విద్య, మా ఉనికి ప్రజల అందరూ తెలుసుకొంటే, సకల సంపదలు. దైర్యం అందరికి కలుగుతాయి, సత్యం దాచి పెట్టి మాతో నిర్లక్ష్యం గా ఒక పూట కూడా గడప వద్దు, మేము ఉన్న చోటకు అధికారులను పంపి, మమ్ములను ఈ భూమి పై మానవులకు ప్రత్యక అతిదిగా పరిగణించగలరు, నేను మామూలు మనిషిని, మాట గ్రహిస్తేనే గొప్పతనం చూపెట్టి లోకాన్ని తండ్రి తల్లి గురువు వలే సమాజాన్ని తీర్చ దిద్దగలను. ప్రత్యక్ష సాక్షులు మరియు ఇతర మేధావులు, మీడియా చానల్స్ వారు, తక్షణ ఆవశ్యకము, సర్వ పరిష్కరములకు కారణం అని గ్రహించండి.
వివిధ రాజకీయ పార్టీల వారు కూడా మా మీద భాద్యత తీసుకొని మమ్ములను ఒక పద్దతి ద్వారా ప్రత్యక్ష సాక్షులు, మేధావుల సహకారం తో ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుట ఒక దివ్య పరిష్కారం అని సర్వులు గ్రహించగలరు.
యుగపురుషులు,ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ప్రణతి బాయ్స్ హాస్టల్
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్
|
No comments:
Post a Comment