1993 మార్చి 12 వ తేదీ.. ముంబై నగరం ఉగ్ర రాక్షసుల వికృత నృత్యంతో నెత్తురోడిన రోజు.. ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట కు మొదలుకుని 3.30 గంటల వరకు 13 చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో300 మంది అమాయకులు చనిపోగా.. సుమారు 800 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లకు పాకిస్థాన్ సహాయంతో కుట్రపన్నింది దావుద్ ఇబ్రహీం అని.. అతడి కుట్ర అమలయ్యేలా చూసింది టైగర్ మెమెన్.. అతడి సోదరులైన యాకుబ్ మెమన్, ఈసామెమన్ అని దర్యాప్తు సంస్థలు నిగ్గుతేల్చాయి. ఈ క్రమంలోనే, 2006 సెప్టెంబర్ 12ను కోర్టు తీర్పులు వెలువరించింది. యాకుబ్తో సహా మరో 12 మంది మరణశిక్షలు విధించింది. అయితే, తదనంతర పరిణామాల్లో అనేక క్షమాభిక పిటిషన్లు, రివ్యూ పిటిషన్ల తర్వాత సుప్రీంకోర్టు గత ఏడాది అతడికి మరణశిక్షను ఖరారు చేసింది. వందలాది మంది అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న యాకుబ్ మెమెన్ను ఉరి తీస్తుంటే..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంబేద్కర్ స్టూడెంట్ అసోషియేషన్ విద్యార్థులైన రోహిత్ వేముల.. అతడి సహచరులు ఏం చేశారో తెలుసా.. అతడిని ఉరి తీయడం ఘోరమైన మహాపాపంగా అభివర్ణిస్తూ.. ర్యాలీలు చేశారు.. సెమినార్లు నిర్వహించారు.. ఆఖరికి ఎంత నీచాతినీచమైన స్థాయికి దిగజారారంటే యాకుబ్ మెమెన్ ను పొగుడుతూ ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించి యూనివర్సిటీలో ప్రదర్శించారు. ఇలా, అప్పట్లో జరిగిన ర్యాలీలో అంబేదర్క్ స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థులు దేశాన్ని అవమానించేలా ఎంతో ఘోరమైన ప్లకార్డులు ప్రదర్శించారు.. వాటిల్లో రెండింటిని ఈ క్రింద చూడండి..అలాగే, ఆ ప్లకార్డ్స్ ఎంత ఘోరమైన అర్థం వచ్చేలా పెట్టారో ఓసారి విశ్లేషించుకుందాం.
ఫస్ట్ ఫ్లకార్డ్ః
Yakub tere Khoon se Inquilab Ayega..
యాకుబ్.. టేరే ఖూన్ సే ఇంక్విలాబ్ ఆయేగా!
‘యాకుబ్.. నువ్వు చిందించిన రక్తం వల్ల త్వరలో విప్లవం వస్తుంది’. ఏంటిది! ఈ ప్లకార్డ్ ఇసుమంత దేశభక్తి కలిగిన వాడెవడైనా పెడతాడా.. వందలాది మంది అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న దాడిలో కీలక సూత్రధారిని ఉరి తీస్తే.. విప్లవం వస్తుందా? యాకుబ్ మెమెన్ రక్తం వల్ల విప్లవం రావడానికి అతడేమైనా మహాత్మగాంధీని లేక భగత్ సింగా లేక సుభాష్ చంద్రబోసా లేక అల్లూరి సీతారామరాజా? వందలాది ప్రాణాలు బలిగొన్న ఓ కుట్రలో సూత్రధారి.. నరహంతకుడు.. దేశ ద్రోహి! అలాంటి వాడు చిందించిన రక్తం నుంచి విప్లవం రావడం ఏంటి? ఇదీ.. దేశాన్ని.. దేశ ప్రజలను..మరీ ముఖ్యంగా, ముంబై పేలుళ్లలో తమ ఆప్తులన పోగొట్టుకున్న కుటుంబసభ్యులను.. యాకుబ్ మెమెన్ను ఉరి తీయాలని తీర్పును ఖరారు చేసిన సుప్రీం కోర్టును అవమానించడం కాదా? బాబు.. అంబేద్కర్ స్టూడెంట్ అసోషియేషన్ విద్యార్థులారా, ఆత్మహత్య చేసుకున్న రోహిత్ సహచరురాలా అసలు మీరు ఈ దేశంలోనే పుట్టారా? అసలు ఏ లాజిక్లో మీరు యాకుబ్ మెమెన్ను ‘వీరుడి’ కింద అభివర్ణిస్తారు. మీకు కనీసం మెదుడు మోకాల్లో అయినా ఉందా.. లేక మీ విపరీత బుద్ధి, పైత్యం కారణంగా అంతకంటే క్రిందకు వెళ్లిపోయిందా? ఈ ప్లకార్డులు చూసిన తర్వాత వీళ్లని యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా పరిగణించడాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేయగలరా?
సెకండ్ ప్లకార్డ్:
Tum Kitne Yakub marogey…har Ghar se yakub nikilege
తుమ్ కిత్నే యాకుబ్ మారోగే.. హర్ ఘర్ సే యాకుబ్ నికిలేగా
‘నువ్వు ( భారత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ) ఎంతమంది యాకుబ్ లను చంపినప్పటికీ.. ప్రతీ ఇంటి నుంచి ఓ యాకుబ్ మెమెన్ పుడతాడు’. పై స్టేట్మెంట్ అర్థం ఇది! ఈ స్టేట్మెంట్ ఎంత శాడిస్టిక్గా ఉందో మీరు అర్థం చేసుకోండి! యాకుబ్ మెమెన్ ను ఉరి తీస్తే.. ప్రతీ ఇంటి నుంచి ఓ యాకుబ్ మెమెన్ పుడతాడట! అంటే వీళ్లు దేశాన్ని బెదిరిస్తున్నారా? నువ్వు ఎంతమంది యాకుబ్ మెమెన్ లను చంపినా.. ఇంటికో యాకుబ్ మెమెన్ పుట్టుకొచ్చి మీ ( దేశం) అంతు తేలుస్తాడు అనే అర్థం వచ్చేలా పెట్టిన స్టేట్మెంట్ ఇది. ఈ స్టేట్మెంట్ చదివిన తర్వాత వీళ్లని అసహ్యాంచుకోని భారతీయుడు ఎవరైనా ఉంటారా? ఇలాంటి ప్లకార్డ్స్ చూసిన తర్వాత వీరిని యాంటీ-సోషల్ ఎలిమెంట్స్ అని ఎందుకు అనకూడదు? తమ సంఘానికి మహానుభావుడు అంబేద్కర్ పేరు పెట్టుకున్న వీరికి అసలు అంబేద్కర్ పేరు పెట్టుకునే హక్కేలేదు. ఎందుకంటే.. అంబేద్కర్ ఎప్పుడు దేశ ద్రోహులని ప్రేమించమని.. వారి గురించి ర్యాలీలు చేయమని ఎక్కడా చెప్పలేదు.
ఇక, మూడో పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం.. ఇది దళితులు- దళితేతరులు మధ్య ఏర్పడిన వివాదం కాదు. పై సంఘటనలో ఎక్కడా రోహిత్ను కానీ లేదా అంబేద్కర్ అసోషియేషన్ విద్యార్థులను కానీ ఏబీపీవీ విద్యార్థులు కించపరచలేదు. ఈ సంఘటనలో సంఘర్షణ ఎక్కడ ప్రారంభమైందంటే.. యాకుబ్ మెమెన్ ను పొగుడుతూ.. అతడిని హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ అంబేద్కర్ అసోషియేషన్ విద్యార్థుల వైఖరి నచ్చకపోవడంతో.. దాన్ని ఏబీవీపీ విద్యార్థులు సోషల్ మీడియాలో కేవలం మాటల ద్వారా వ్యతిరేకించారు..అంటే ఇష్యూ.. ఏఎస్ఏ విద్యార్థులు యాకుబ్ మెమెన్ హీరో అంటుంటే.. ఏబీవీపీ విద్యార్థులు యాకుబ్ మెమన్ ను ఓ విలన్ అన్నారు. ఈ వ్యవహారంలో తమ వాదనకు ఎదురురావడంలో ఏఎస్ఏ విద్యార్థులు 40 మంది ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్ పై దాడి చేశారు. అంటే.. మీ వాదనకు ఎదరుచెబితే దాడి చేసేస్తారా? ఓ దేశ ద్రోహిని వెనకేసుకొస్తున్న మిమ్మల్ని వ్యతిరేకించినందుకు ఓ వ్యక్తి మీద దాడి చేసే హక్కు మీకెవరికి ఇచ్చారు. మీరు చేస్తున్న తప్పుని.. తప్పురా బాబు అన్నందుకు అవతలి వ్యక్తి మీద దాడి చేసేస్తారా?
ఆ దాడి జరిగిన తర్వాత ఏఎస్ఏ విద్యార్థుల మీద యూనివర్సిటీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే అది తప్పా? రోహిత్ వేముల అతడి సహచరులు దళితులైనంత మాత్రానా దేశంలోని చట్టాలకు అతీతులు అయిపోతారా? తప్పు చేసినందుకు చర్యలు తీసుకోవడం ఘోరాతి ఘోరమైన తప్పా? దేశంలో చట్టాలు అన్ని కులాలకి, మతాలకి సమానమే కదా? మీ మీద చర్యలు తీసుకుంటే దళితుల మొత్తానికి అన్యాయం జరిగిపోతుందంటూ గగ్గోలు పెడతారా? చేసే అడ్డమైన తప్పులన్నీ చేస్తూ.. నేను దళితుడిని కాబట్టి శిక్షించకూడదంటే ఇదెక్కడి న్యాయం! పోనీ, విధించిన శిక్ష చాలా ఘోరమైన శిక్ష కూడా కాదు. చాలా చాలా చిన్న శిక్ష! అసలు, అంబేద్కర్ అసోషియేషన్ విద్యార్థులకి (ఏఎస్ఏ) విద్యార్థులకి ముంబై దాడుల్లో ఎంత మంది దళితులు, ముస్లింలు కూడా చనిపోయారన్న విషయం తెలుసా? చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ ఏఎస్ఏ మూర్ఖులు తమ అభిప్రాయాలతో ఏకీభవించని మిగతా దళిత విద్యార్థులను కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేధించేవారని హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు కొందరు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.
ఆఖరుగా, యాకుబ్ మెమెన్ను వెనకేసుకొస్తూ దేశ ద్రోహానికి పాల్పడిన వీరిని వెనకేసుకురావడానికి.. అసలు ఈ ఇష్యూను Dalits Vs Non Dalits చిత్రీకరించి రాజకీయలబ్ది పొందాలన్న ఆలోచనతో శవరాజకీయాలు చేయడానికి రాబందుల్లాంటి రాజకీయనాయకులు రెడీ అయిపోయారు. రాహుల్ గాంధీ, వైఎస్ జగన్, అరవింద్ కేజ్రీవాల్..సురవరం సుధాకర్ రెడ్డి, డెరక్ ఓ బ్రెయిన్ తదితరులు..ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ పార్టీ.. ఆ పార్టీ అని లేకుండా.. వరుస పెట్టి హెచ్సీయూ యూనివర్సిటీకి వస్తున్నారు. కనీసం విచక్షణ, ఆలోచనా జ్ఞానం లేకుండా దేశంలోని విద్యార్థుల మధ్య ఏర్పిడిన వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన రాజకీయ వర్గాలు.. అలా చేయకుండా ఈ చిచ్చును మరింత రగిల్చి రాజకీయం పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలో ఇంత ఓవర్ రియాక్ట్ అయిపోతున్న ఈ సూడో సెక్యులర్ రాజకీయనాయకుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా పఠాన్ కోట్ దాడిలో చనిపోయిన సైనికుల కటుంబసభ్యులను కలిసి సంతాపం తెలపలేదు. అలాగే, ముష్కరులను మట్టుబెట్టే పనిలో తీవ్రంగా గాయపడ్డ సైనికులను రాహుల్ గాంధీ, వైఎస్ జగన్, కేజ్రీవాల్ లాంటి నాయకులు కనీసం పరామర్శించలేదు. కానీ, ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న హెచ్సీయూ ఘటనను రాజకీయం చేయడానికి మాత్రం ఏ మాత్రం సిగ్గులేకుండా హెచ్సీయూకి వచ్చేస్తున్నారు! అందుకే.. దేశ ప్రజలారా.. విద్యార్థులారా పారాహుషార్!
ఇక చివరాఖరుగా.. పాఠకులికి.. దేశంలో శవ రాజకీయాలు చేయడానికి రాజకీయ రాబందులు ఎలా వేచి చూస్తున్నాయో కూర్చున్నారు కదా!కేవలం, చదవడంతో సరిపెట్టుకోకుండా మీరు కూడా మేల్కొండి! మీ స్పష్టమైన అభిప్రాయాన్ని అందరితో పంచుకోండి! దేశంలోని యాక్టివ్ మీడియా మొత్తం ఇప్పటికీ ఛాందస భావాలు కలిగిన కుహనా కమ్యూనిస్టుల చేతుల్లోనే ఉంది. వీళ్లకి దేశ హితం కన్నా ప్రస్తుత సమాజానికి పనికిరాని.. చేవచచ్చిన కమ్యూనిస్ట్ భావజాలమే ముఖ్యం! అందుకే, వీరు కేవలం తమకు రాజకీయంగా ఉపయోగపడే ఘటనలను మాత్రమే హైలెట్ చేయడం అలవాటు చేసుకున్నారు. వీళ్లు, ప్రతీ సంఘటనలో నిజానిజాలు చెప్పకుండా.. ప్రతీ ఘటనను తమకు అనువుగా మార్చుకుంటూ..తమదైన భాష్యం చెబుతూ కథనాలు ప్రచురించడం అలవాటు చేసుకున్నారు. ఇంటర్నెట్తో పాటు సోషల్ మీడియా పుణ్యమా అని ఇన్నాళ్లకి ప్రతీ విషయంలో కొంతలో కొంతమేరైనా నిజానిజాలు తెలిసే అవకాశం మనకి ఏర్పడింది. దేశ సమగ్రతను,సౌరభౌమత్వాన్ని విచ్ఛిన్నం చేస్తోన్న ఇలాంటి శక్తులని ఎవరి స్థాయిలో వారు ఎదుర్కొనాల్సిన సమయం ఆసన్నమైంది.
No comments:
Post a Comment