వెలమ
తెలుగు వారి పౌరుషానికి, శౌర్యప్రతాపాలకు ప్రతీకలు వెలమ వంశములవారు. క్రీ. శ. 12వ శతాబ్దమునుండి వీరు ఆంధ్ర చరిత్రలో ప్రముఖ పాత్ర వహించారు. క్రీ. శ. 1257 నుండి ఒక శతాబ్ద కాలము రాచకొండ మరియు దేవరకొండ రాజధానులుగా తెలంగాణా ప్రాంతము పాలిచారు. అటు పిమ్మట బహమనీ సుల్తానులకు సామంతులుగా ఉన్నారు. విజయనగర సామ్రాజ్యములో సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులు పొందారు.
తెలుగు వారి పౌరుషానికి, శౌర్యప్రతాపాలకు ప్రతీకలు వెలమ వంశములవారు. క్రీ. శ. 12వ శతాబ్దమునుండి వీరు ఆంధ్ర చరిత్రలో ప్రముఖ పాత్ర వహించారు. క్రీ. శ. 1257 నుండి ఒక శతాబ్ద కాలము రాచకొండ మరియు దేవరకొండ రాజధానులుగా తెలంగాణా ప్రాంతము పాలిచారు. అటు పిమ్మట బహమనీ సుల్తానులకు సామంతులుగా ఉన్నారు. విజయనగర సామ్రాజ్యములో సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులు పొందారు.
చరిత్ర
ప్రముఖ సాంఘికవేత్త, చరిత్రకారుడు ఎడ్గార్ థర్ స్టన్ ప్రకారము వెలమ, కమ్మ కులములు ఒకే మూలమునుండి విడిపోయినవి. ఈ ఘటనపై తెలుగు సాంప్రదాయములో బహు కథనాలు ప్రచారములోఉన్నాయి కాని దేనికీ చారిత్రకాధారములు లేవు. ఈ రెంటి కులములలోని ఆచారవ్యవహారములు, గోత్రములు, ఇంటిపేర్లలో చాల సామీప్యత గలదు. వెలమ అను పదము మొదటిసారిగా నెల్లూరు మండలములో దొరికిన 16వ శతాబ్దమునాటి ఒక శాసనములో గలదు. చరిత్రకారుల అభిప్రాయము ప్రకారము 11వ శతాబ్దములో వెలనాటినుండి (గుంటూరు మండలములోని ఒక భాగము) ఓరుగల్లుకు వెడలిన యోధుల వంశముల వారు వెలమలయ్యారు. కాకతీయ చక్రవర్తి రుద్రుని కాలములో బడబానల భట్టు వెలమవారికి, కమ్మవారికి గోత్రములు నిర్ణయించాడు. దీనిని బట్టి వీరు పూర్వకాలములో బౌద్ధులు, జైనులు గా ఉండిఉండవచ్చును. వెలుగోటివారి వంశావళి, పద్మనాయక చరిత్ర వీరి చరిత్రకు కొంత ఆధారములు[1][2]. వ్యవసాయిక వృత్తిచేసుకొను కాపులు వెలమ, కమ్మవారిగా విడిపోయారు.
"....కాలచోదితమున కాకతీవరుగొల్చి కాపులెల్ల వెలమ, కమ్మలైరి"
కాకతీయుల పూర్వ కాలము
కాకతీయులకు పూర్వకాలములో రేచెర్ల వంశమునకు చెందిన వారు పలనాటి సీమలో కాలచూరి వంశమునకు చెందిన హైహయ రాజుల వద్ద సైనికులుగా, సేనాధిపతులుగా, మంత్రులుగా ఉన్నారు. మాచెర్లను పాలించిన అలుగు రాజు వద్ద దొడ్డ నాయుడు ఆతని కుమారుడు బ్రహ్మ నాయుడు మంత్రులుగా ఉన్నారు. దాయాదుల మధ్య జరిగిన పోరులో బ్రహ్మ నాయుడు మలిదేవరాజు పక్షమున పోరాడి ఓడిపోతాడు. బ్రహ్మనాయుని సాంఘిక సంస్కరణలు తెలుగువారికి సువిదితములే. ఎట్టి చారిత్రకాధారాలు లేకపోయిననూ పల్నాటి యుద్ధం తెలుగు సాహిత్య, సంప్రదాయములలో స్థిరముగా నిలిచిపోయిన వాస్తవ సంఘటన. పల్నాటి యుద్ధం కారణముగా పెక్కు రాజవంశాలు (తెలుగుచోళులు, హైహయులు, హోయసాలులు, కోట వంశస్థులు) బలహీనపడినవి. కాకతీయ సామ్రాజ్య విస్తరణకు ఈ పరిస్థితులు అనుకూలమయ్యాయి.
ప్రముఖ సాంఘికవేత్త, చరిత్రకారుడు ఎడ్గార్ థర్ స్టన్ ప్రకారము వెలమ, కమ్మ కులములు ఒకే మూలమునుండి విడిపోయినవి. ఈ ఘటనపై తెలుగు సాంప్రదాయములో బహు కథనాలు ప్రచారములోఉన్నాయి కాని దేనికీ చారిత్రకాధారములు లేవు. ఈ రెంటి కులములలోని ఆచారవ్యవహారములు, గోత్రములు, ఇంటిపేర్లలో చాల సామీప్యత గలదు. వెలమ అను పదము మొదటిసారిగా నెల్లూరు మండలములో దొరికిన 16వ శతాబ్దమునాటి ఒక శాసనములో గలదు. చరిత్రకారుల అభిప్రాయము ప్రకారము 11వ శతాబ్దములో వెలనాటినుండి (గుంటూరు మండలములోని ఒక భాగము) ఓరుగల్లుకు వెడలిన యోధుల వంశముల వారు వెలమలయ్యారు. కాకతీయ చక్రవర్తి రుద్రుని కాలములో బడబానల భట్టు వెలమవారికి, కమ్మవారికి గోత్రములు నిర్ణయించాడు. దీనిని బట్టి వీరు పూర్వకాలములో బౌద్ధులు, జైనులు గా ఉండిఉండవచ్చును. వెలుగోటివారి వంశావళి, పద్మనాయక చరిత్ర వీరి చరిత్రకు కొంత ఆధారములు[1][2]. వ్యవసాయిక వృత్తిచేసుకొను కాపులు వెలమ, కమ్మవారిగా విడిపోయారు.
"....కాలచోదితమున కాకతీవరుగొల్చి కాపులెల్ల వెలమ, కమ్మలైరి"
కాకతీయుల పూర్వ కాలము
కాకతీయులకు పూర్వకాలములో రేచెర్ల వంశమునకు చెందిన వారు పలనాటి సీమలో కాలచూరి వంశమునకు చెందిన హైహయ రాజుల వద్ద సైనికులుగా, సేనాధిపతులుగా, మంత్రులుగా ఉన్నారు. మాచెర్లను పాలించిన అలుగు రాజు వద్ద దొడ్డ నాయుడు ఆతని కుమారుడు బ్రహ్మ నాయుడు మంత్రులుగా ఉన్నారు. దాయాదుల మధ్య జరిగిన పోరులో బ్రహ్మ నాయుడు మలిదేవరాజు పక్షమున పోరాడి ఓడిపోతాడు. బ్రహ్మనాయుని సాంఘిక సంస్కరణలు తెలుగువారికి సువిదితములే. ఎట్టి చారిత్రకాధారాలు లేకపోయిననూ పల్నాటి యుద్ధం తెలుగు సాహిత్య, సంప్రదాయములలో స్థిరముగా నిలిచిపోయిన వాస్తవ సంఘటన. పల్నాటి యుద్ధం కారణముగా పెక్కు రాజవంశాలు (తెలుగుచోళులు, హైహయులు, హోయసాలులు, కోట వంశస్థులు) బలహీనపడినవి. కాకతీయ సామ్రాజ్య విస్తరణకు ఈ పరిస్థితులు అనుకూలమయ్యాయి.
కాకతీయ కాలము
కాకతీయుల కాలములో వెలమలు శ్లాఘనీయమైన పాత్ర పోషించారు. గణపతిదేవుని కడ సేనాధిపతిగా నున్న రేచెర్ల రుద్రుడు సామ్రాజ్యమును విస్తరించుటకు తోడ్పడ్డాడు. మరొక సేనాని రాజ నాయకుడు కళింగ, వేంగీ దేశాలను జయించాడు. రేచెర్ల ప్రసాదాదిత్యుడు రాణి రుద్రమదేవికి కుడిభుజముగా ఉన్నాడు. రేచెర్ల వెన్న మరియు పోతుగంటి మైలి క్రీ. శ. 1303 లో అలాఉద్దీను ఖిల్జీ సైన్యముతో ఉప్పరపల్లి వద్ద తలపడి వారిని తరిమివేశారు. రేచెర్ల సింగమ నాయుడు ప్రతాపరుద్రుని ప్రముఖ సేనానులలో ఒకడు.
కాకతీయుల కాలములో వెలమలు శ్లాఘనీయమైన పాత్ర పోషించారు. గణపతిదేవుని కడ సేనాధిపతిగా నున్న రేచెర్ల రుద్రుడు సామ్రాజ్యమును విస్తరించుటకు తోడ్పడ్డాడు. మరొక సేనాని రాజ నాయకుడు కళింగ, వేంగీ దేశాలను జయించాడు. రేచెర్ల ప్రసాదాదిత్యుడు రాణి రుద్రమదేవికి కుడిభుజముగా ఉన్నాడు. రేచెర్ల వెన్న మరియు పోతుగంటి మైలి క్రీ. శ. 1303 లో అలాఉద్దీను ఖిల్జీ సైన్యముతో ఉప్పరపల్లి వద్ద తలపడి వారిని తరిమివేశారు. రేచెర్ల సింగమ నాయుడు ప్రతాపరుద్రుని ప్రముఖ సేనానులలో ఒకడు.
పద్మనాయకులు
కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఓరుగంటి దుర్గ రక్షణ 77 పద్మనాయకులకు అప్పగించాడు. వీరిలో అధికులు రేచెర్ల వంశము వారు [3]. సింథియా టాల్బోట్ సిద్ధాంతము ప్రకారము పద్మనాయకులందరూ వెలమలు కారనియూ, వారిలోని రేచెర్ల వంశమువారే వెలమలనియూ వాదన[4]. భీమేశ్వర పురాణము లో శూద్రులలో శాఖలుగా 'వెలమలు' 'పద్మనాయకులు' వేర్వేరుగా చెప్పబడిరి[5]. అటులనే ఒక తెలంగాణా శాసనములో (క్రీ. శ. 1613) ఒకనిని వెలమగా మరొకనిని పద్మనాయకునిగా పరిగణించబడిరి. దీనిని బట్టి పద్మనాయకులలో మహాయోధులైన పలు కులముల వారున్నారని చెప్పవచ్చును.
కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఓరుగంటి దుర్గ రక్షణ 77 పద్మనాయకులకు అప్పగించాడు. వీరిలో అధికులు రేచెర్ల వంశము వారు [3]. సింథియా టాల్బోట్ సిద్ధాంతము ప్రకారము పద్మనాయకులందరూ వెలమలు కారనియూ, వారిలోని రేచెర్ల వంశమువారే వెలమలనియూ వాదన[4]. భీమేశ్వర పురాణము లో శూద్రులలో శాఖలుగా 'వెలమలు' 'పద్మనాయకులు' వేర్వేరుగా చెప్పబడిరి[5]. అటులనే ఒక తెలంగాణా శాసనములో (క్రీ. శ. 1613) ఒకనిని వెలమగా మరొకనిని పద్మనాయకునిగా పరిగణించబడిరి. దీనిని బట్టి పద్మనాయకులలో మహాయోధులైన పలు కులముల వారున్నారని చెప్పవచ్చును.
"....అందు పద్మనాయకులన, వెలమలన, కమ్మలన త్రిమార్గ గంగాప్రవాహంబులుంబోలె గొత్రంబులన్నియేని జగత్పవిత్రంబులై ప్రవహింపచుండ"[6].
రాచకొండ రాజ్యము
రాచకొండ రాజు రేచెర్ల సింగమ నాయకుడు తొలుత ముసునూరి నాయకుల నాయకత్వము క్రింద తురుష్కులను తెలంగాణమునుండి తరిమివేయుటకు తోడ్పడ్డాడు. కాపానీడు ఓరుగల్లు పాలకునిగా స్థిరపడిన పిమ్మట విభేదములు తలెత్తాయి. అద్దంకి వేమారెడ్డి పై సింగమ యుద్ధము ప్రకటించగా కాపానీడు వేమారెడ్డికి సాయమందిస్తాడు. జల్లిపల్లి వద్ద క్షత్రియులతో జరిగిన యుద్ధములో సింగమ చంపబడతాడు. ఆతని కుమారులు అనవోతా నాయకుడు, మాదా నాయకుడు జల్లిపల్లిపై దాడి చేసి క్షత్రియులందరినీ సంహరించి ప్రతీకారము తీర్చుకుంటారు. పిమ్మట బహమనీలతో చేయి కలిపి 1370లో ఓరుగంటిపై దండెత్తి, కాపానీడుని వధించి తెలంగాణమునకు అధిపతులయ్యారు. కాని అతి త్వరలో బహమనీల అధికారమునకు లోబడక తప్పలేదు.
రాచకొండ రాజు రేచెర్ల సింగమ నాయకుడు తొలుత ముసునూరి నాయకుల నాయకత్వము క్రింద తురుష్కులను తెలంగాణమునుండి తరిమివేయుటకు తోడ్పడ్డాడు. కాపానీడు ఓరుగల్లు పాలకునిగా స్థిరపడిన పిమ్మట విభేదములు తలెత్తాయి. అద్దంకి వేమారెడ్డి పై సింగమ యుద్ధము ప్రకటించగా కాపానీడు వేమారెడ్డికి సాయమందిస్తాడు. జల్లిపల్లి వద్ద క్షత్రియులతో జరిగిన యుద్ధములో సింగమ చంపబడతాడు. ఆతని కుమారులు అనవోతా నాయకుడు, మాదా నాయకుడు జల్లిపల్లిపై దాడి చేసి క్షత్రియులందరినీ సంహరించి ప్రతీకారము తీర్చుకుంటారు. పిమ్మట బహమనీలతో చేయి కలిపి 1370లో ఓరుగంటిపై దండెత్తి, కాపానీడుని వధించి తెలంగాణమునకు అధిపతులయ్యారు. కాని అతి త్వరలో బహమనీల అధికారమునకు లోబడక తప్పలేదు.
దేవరకొండ రాజ్యము
కాపానీడు మరణము తరువాత అనవోత, మాదా నాయకులు రాచకొండను, దేవరకొండను తమలోతాము పంచుకొంటారు. దేవరకొండకు మాదా నాయకుడు రాజయ్యాడు. దేవరకొండ రాజ్యమును ఎనిమిది మంది రాజులు క్రీ. శ. 1287 నుండి 1475 వరకు క్రమముగా పాలించారు.
కాపానీడు మరణము తరువాత అనవోత, మాదా నాయకులు రాచకొండను, దేవరకొండను తమలోతాము పంచుకొంటారు. దేవరకొండకు మాదా నాయకుడు రాజయ్యాడు. దేవరకొండ రాజ్యమును ఎనిమిది మంది రాజులు క్రీ. శ. 1287 నుండి 1475 వరకు క్రమముగా పాలించారు.
రెండవ మాదా నాయుడు (1370--) పెద వేదగిరి నాయుడు (1384 - 1410) మూడవ మాదా నాయుడు (1410 -1425) లింగమ నాయుడు (1425 - 1475)
No comments:
Post a Comment