UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 16 February 2017

101 విదేశీ ఉపగ్రహాలను తన విజయాశ్వమైన పీఎ్‌సఎల్‌వీ రాకెట్‌ ద్వారా ప్రయోగించి పక్కా ప్రణాళిక ప్రకారం నిర్దేశిత కక్ష్యల్లోకి చేర్చింది. ఈ విజయం ద్వారా ఇస్రో సైంటిస్టులు మన శాస్త్రవేత్తల మేధను మరోసారి ప్రపంచానికి చాటారు.


🔲అంతరిక్షంలో ఇస్రో అద్భుతం
15-02-2017 23:40:10
ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాల ప్రయోగం..ప్రపంచంలో ఏ దేశమూ సాధించని విజయం29.30 నిమిషాల్లో విజయవంతంగా కక్ష్యలోకిజాతి మొత్తం గర్వించదగిన అద్భుత ఘట్టాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం ఉదయం 9.28 గంటలకు ఆవిష్కరించారు. ఒకే రాకెట్‌ ద్వారా 104 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతరిక్ష రంగంలో భారత్ సత్తా చాటారు! ఈ విజయం అపూర్వం. ‘అపూర్వం’ అంటే ఏదో మాటవరసకు అంటున్నమాట కాదు! నిజంగానే.. మునుపెన్నడూ ఎవరూ సాధించని ఘనత ఇది. ఈ విజయంతో ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగి ‘వందేమాతరం’ అంటూ నినదించిందంటే అతిశయోక్తి కాదు.
శ్రీహరికోట (సూళ్లూరుపేట), ఫిబ్రవరి 15: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. విదేశీ ఉపగ్రహాల ప్రయోగానికి కేరాఫ్‌ చిరునామాగా మారిన ఇస్రో.. బుధవారంనాడు 3 స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను తన విజయాశ్వమైన పీఎ్‌సఎల్‌వీ రాకెట్‌ ద్వారా ప్రయోగించి పక్కా ప్రణాళిక ప్రకారం నిర్దేశిత కక్ష్యల్లోకి చేర్చింది. ఈ విజయం ద్వారా ఇస్రో సైంటిస్టులు మన శాస్త్రవేత్తల మేధను మరోసారి ప్రపంచానికి చాటారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ ధవన అంతరిక్ష కేంద్రం (షార్‌) ఈ అద్భుత ఆవిష్కరణకు వేదిక అయ్యింది. మంగళవారం తెల్లవారుజామున 5.28 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్‌ బుధవారం 9:28 గంటలకు ముగిసింది. కౌంట్‌డౌన్‌ ముగియగానే.. షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్‌వీ-సీ37 రాకెట్‌ 104 ఉపగ్రహాలతో నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఆకాశంలో కొద్దిసేపు మబ్బులమాటున దోబూచులాడుతూ కనుచూపుమేర కనువిందుచేస్తూ అంతరిక్షంలోకి ఉరకలెత్తింది. ఎక్కడా తడబాటు లేకుండా ప్రయాణించి శాస్త్రవేత్తలు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంది. గమ్యస్థానం రాగానే బస్సు దిగే ప్రయాణికుల్లా 104 ఉపగ్రహాలూ రాకెట్‌ నుంచి విడివడి నిర్ణీత కక్ష్యల్లో ఒదిగిపోయాయి. ఎలాంటి అపశ్రుతులూ లేకుండా ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. గట్టిగా చప్పట్లు చరుస్తూ.. ఒకరినొకరు ఆనందంతో ఆలింగనం చేసుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు.
ఆలస్యంగా విదేశీ ఉపగ్రహ సంకేతాలు
ఉత్తరం నుంచి దక్షిణ దిశగా రాకెట్‌ను పయనింపజేసి ఉపగ్రహాలను భూమికి 510 కిలోమీటర్ల ఎత్తు నుంచి 530 కి.మీ ఎత్తులో ధ్రువ సూర్యానువర్తన కక్ష్యలో వదిలిపెట్టారు. మారిష్‌సలో ఉన్న భూ కేంద్రం మనదేశపు మూడు ఉపగ్రహాలతోపాటు మరో ఐదు విదేశీ ఉపగ్రహాల సంకేతాలను అందుకుంది. అనంతరం మన భూ కేంద్రాలు లేకపోవడంతో వాటి సంకేతాలు అందుకునే అవకాశం లేక సమాచారం రావడం ఆలస్యమైంది. కొద్దిసేపటి తరువాత దక్షిణ ధ్రువ ప్రాంతంలోని అంటార్కిటిక్‌ భూ కేంద్రాలు వాటి సంకేతాలు అందుకున్నట్లు ఇస్రోకు సమాచారం అందింది. దీంతో ఈ ప్రయోగం దిగ్విజయంగా జరిగిందని ఇస్రో చైర్మన కిరణ్‌కుమార్‌ ప్రకటించారు. షార్‌లోని జీరోపాయింట్‌లోని మిషన కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఆయన పర్యవేక్షణలో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. తదుపరి మిషన కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 104 ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి చేరవేశామంటూ ఇస్రో బృందాన్ని అభినందించారు. ఈ ఏడాది మరిన్ని ముఖ్యమైన, ఉత్కంఠభరితమైన ప్రయోగాలు నిర్వహించనున్నామని చెప్పారు. అనంతరం జయకుమార్‌ (ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌), కున్హికృష్ణన (షార్‌ డైరెక్టర్‌), కె.శివన (వీఎ్‌సఎ్‌ససీ డైరెక్టర్‌), సోమనాథ్‌ (ఎల్‌పీఎ్‌ససీ డైరెక్టర్‌), పీవీ వెంకటకృష్ణ (ఐపీఆర్‌సి డైరెక్టర్‌), ఎంవీ దేకనే (ఐఐఎ్‌సయు డైరెక్టర్‌), అన్నాదొరై (ఐఎస్‌ఎసీ డైరెక్టర్‌), తపన మిశ్ర (ఎస్‌ఏసీ డైరెక్టర్‌), సదానందరావు (కార్టోశాట్‌ ఉపగ్రహ డైరెక్టర్‌) మాట్లాడారు.
అమెరికా 29.. రష్యా 37.. మనం 104
ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్‌తో 104 ఉపగ్రహాలు ప్రయోగించడం ప్రపంచంలోనే ఓ రికార్డ్‌. 2013లో ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా 29 ఉపగ్రహాలను తన ఆర్బిటల్‌ సైన్స అంతరేస్‌ రాకెట్‌తో ప్రయోగించింది. 2014లో రష్యా తన డెనార్‌ రాకెట్‌తో ఒకేసారి 37 ఉపగ్రహాలను రోదసిలోకి చేరవేసింది. 2016 జూన్‌లో 20 ఉపగ్రహాల ప్రయోగమే ఇస్రో పేరిట ఇప్పటి దాకా ఉన్న రికార్డు. తాజా ప్రయోగంతో ఈ రికార్డులన్నీ బద్దలయ్యాయి. అయితే ఇస్రో మాత్రం.. ‘‘ఇది రికార్డు కోసం చేసిన ప్రయోగం కాదని.. మన సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు చేసిన ప్రయోగమ’’ని సవినయంగా ప్రకటించడం విశేషం.
ఇప్పటిదాకా 180 విదేశీ ఉపగ్రహాలు
గత 17 ఏళ్లూ ఒకెత్తు.. తాజా ప్రయోగం ఒకెత్తు!
భారతదేశం ఇప్పటిదాకా మొత్తం 226 ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టగా.. అందులో 180 విదేశాలకు చెందినవే! ఇస్రో వాణిజ్య ప్రయోగాల సత్తాను, ఘనతను చాటే గణాంకాలివి. ఈ లెక్కలో మరో విశేషం ఉంది. ఆ 180 ఉపగ్రహాల్లో 101.. బుధవారంనాటి ప్రయోగంలో పంపినవే! మిగతా 79 ఉపగ్రహాలనూ గత 17 ఏళ్ల వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మనదేశం ప్రయోగించిన తొలి విదేశీ ఉపగ్రహం.. జర్మనీకి చెందిన 45 కిలోల టబ్‌ శాట్‌. 1999లో పీఎ్‌సఎల్‌వీ సీ2 ద్వారా ఇస్రో దాన్ని ప్రయోగించింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. బుధవారం ప్రయోగం ద్వారా.. 180 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించిన అంతరిక్ష పరిశోధన సంస్థగా ఇస్రో మరో రికార్డు కూడా సాధించింది. ఈ ప్రయోగం విజయవంతంతో ఇక విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలతో ఇస్రో మరింత బిజీ అయిపోయే అవకాశం కనిపిస్తోంది.
..అందుకే పీఎస్‌ఎల్‌వీ ఎక్సెల్‌!
తొలినాళ్లలో ప్రయోగించిన లాంచ్‌ వెహికల్‌ను పీఎ్‌సఎల్‌వీ జి (జనరిక్‌)గా వ్యవహరిస్తారు. రెండో వేరియంట్‌.. పీఎ్‌సఎల్‌వీ సీఏ(కోర్‌ ఎలోన్‌). 1000 కిలోల కన్నా తక్కువ బరువుండే ఉపగ్రహాలను ప్రయోగించేందుకు దీన్ని వినియోగిస్తారు. 1750 కిలోల దాకా బరువైన ఉపగ్రహాలను చేరవేసేందుకు పీఎ్‌సఎల్‌వీ-ఎక్స్‌ఎల్‌ వేరియంట్‌ను అభివృద్ధి చేశారు. భారీ ప్రయోగాలకు పీఎ్‌సఎల్‌వీ ఎక్స్‌ఎల్‌ రకాన్నే ఎంచుకుంటారు. ఉదాహరణకు.. ఇస్రో గతంలో చేపట్టిన చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌ తదితర ప్రతిష్ఠాత్మక ప్రయోగాలకు ఎక్స్‌ఎల్‌ వేరియంట్‌నే వినియోగించారు. బుధవారం ప్రయోగంలో ఉపగ్రహాల బరువు 1378 కిలోలు కావంతో ఇస్రో తన అమ్ములపొదిలో అత్యంత శక్తిమంతమైన ఎక్స్‌ఎల్‌ రకాన్నే వినియోగించింది. పీఎ్‌సఎల్‌వీ ఎక్స్‌ఎల్‌ వెర్షన్‌ను ఇస్రో వినియోగించడం ఇది పదహారోసారి.
ప్రయోగం ఇలా..
10..9..8..7..6..5..4..3..2..1..0
కౌంట్‌డౌన్‌ ముగిసింది! ప్రపంచమంతా ఆసక్తిగా.. శాస్త్రవేత్తలు ఒకింత ఉద్వేగంతో కూడిన ఉత్సుకతతో చూస్తుండగా.. రాకెట్‌ నారింజరంగు మంటలు చిమ్ముకుంటూ రోదసిలోకి దూసుకుపోయింది. నిర్ణీత షెడ్యూలు ప్రకారం.. పైకెగిరిన 1.57 నిమిషాలకు 69.1 కిలోమీటర్ల ఎత్తుకు చేరి ప్రథమ దశ తన పని ముగించి విడిపోయింది. 4.28 నిమిషాల ప్రయాణం తర్వాత రాకెట్‌ 220.8 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోగానే రెండో దశ కూ డా విడిపోయింది. మూడో దశ మోటారుతో రాకెట్‌ 8.21 నిమిషాలు పయనించి 429 కి.మీ ఎత్తుకు చేరింది. చివరిదైన నాలుగో దశ మోటారు.. 104 ఉపగ్రహాలతో ఉన్న అడాప్టర్‌తో పయనించి 16.48 నిమిషాలకు 510 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఉపగ్రహాల అడాప్టర్‌ను రోదసిలో ముందుకునెట్టి అదీ విడిపోయిది. దాంతో అడాప్టర్‌ నుంచి 17.30 నిమిషాలకు మన దేశానికి చెందిన 714 కిలోల కార్టోశాట్‌ ఉపగ్రహం విడిపోయింది. 17.39 నిమిషాలకు ఐఎనఎ్‌స-1ఎ, 1బిలు వరుసగా విడిపోయాయి. ఇక అడాప్టర్‌లోని 101 విదేశీ ఉపగ్రహాలను ఓ క్రమపద్ధతితో విడివడేలా చేశారు. 4 నుంచి 12 సెకన్లలోపు రెండేసి ఉపగ్రహాలను జంటలుగా రోదసిలోకి వదిలిపెట్టారు. అలా 18.40 నిమిషాల నుంచి 28.30 నిమిషాలలోపు 101 విదేశీ ఉపగ్రహాలు అడాప్టర్‌ నుంచి విడిపోయి కక్ష్యలోకి స్థిరపడేలా చేశారు.
సాంకేతిక వివరాలు..
రాకెట్‌: పీఎస్‌ఎల్‌వీ-సీ37
ఎత్తు: 44.4 మీటర్లు
బరువు ఉపగ్రహాలతో కలిపి: 320 టన్నులు
ఉపగ్రహాలు: 104 (కార్టోశాట్‌-2 సీరీస్‌ (భారత), ఐఎనఎ్‌స-1ఎ (భారత), ఐఎన్ఎస్-1బి (భారత్), 88 ఫ్లాక్‌ 3పి (డవ్‌) ఉపగ్రహాలు (అమెరికా), 8 లెమూర్‌ ఉపగ్రహాలు (అమెరికా), బీజీయూశాట్‌ (ఇజ్రాయిల్‌), అల్‌ ఫరబీ-1 (ఖజికిస్థాన్), పీఈఏఎస్‌ఎస్‌ఎస్‌ (నెదర్లాండ్‌), డిడో-2 (స్విట్జర్లాండ్‌), నయీఫ్‌-1 (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌)
ఉపగ్రహాల బరువు: 1378 కిలోలు
ప్రయోగ వ్యయం: 250 కోట్లు
ఈ ఏడాది మరో మూడు ప్రయోగాలు
గత ఏడాది షార్‌ నుంచి 9 రాకెట్లను విజయవంతంగా ప్రయోగించాం. ఈ ఏడాది ఇదే తొలి ప్రయోగం. అద్భుత ప్రయోగం. 104 ఉపగ్రహాలను ఖచ్చితమైన కక్ష్యలో ప్రవేశపెట్టాం. కేవలం 28 గంటల కౌంట్‌డౌనతోనే ఈ రాకెట్‌ను ప్రయోగించాం! ఈ ఏడాది మరో మూడు ప్రయోగాలకు షార్‌ సిద్ధమవుతోంది. ఇస్రో మేక్‌ ఇన ఇండియాకు అనుగుణంగా పయనిస్తోంది. ఇస్రో బృందానికి అభినందనలు.
-కున్హికృష్ణన్, షార్‌ డైరెక్టర్‌
చాలా కసరత్తు చేశాం
104 ఉపగ్రహాలను రోదసిలోకి తీసుకెళ్లడం పెద్ద విషయం కాదు.. కానీ వాటిని ఢీ కొనకుండా విడిచిపెట్టడమే క్లిష్టమైన పని. అయితే ఈ ప్రయోగంకోసం ఎంతో కసరత్తు చేశాం. ఎంతో అధ్యయనం చేశాం. ప్రత్యేక డిజైనలు రూపొందించాం. రోదసి వాతావరణం సృష్టించి ఉపగ్రహాలు విడిపోయే ప్రక్రియను పలు దఫాలు పరీక్షించాం. చివరికి ప్రయోగించి విజయం సాధించాం. ఇది ఇస్రో సమష్టి కృషి. పరిశ్రమలు చేయూతనిచ్చాయి. అలాగే మార్చిలో జీఎ్‌సఎల్‌వీ-మార్క్‌3 కూడా విజయవంతంగా ప్రయోగిస్తామనే ఆత్మవిశ్వాసం మాకుంది.
-కె.శివన్, వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌
ప్రత్యేక అడాప్టర్‌తో ఉపగ్రహాల అమరిక
ఓ చాలెంజ్‌గా తీసుకున్నాం.. 104 ఉపగ్రహాల అమరికకు ప్రత్యేక అడాప్టర్‌ రూపొందించాం. వాటిని అమర్చి రోదసిలోకి పంపి అక్కడ అవి విడిపోయేందుకు కమాండ్‌ ఇస్తూ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. ఇస్రో బృందం ఈ ప్రయోగాన్ని అద్భుతంగా నిర్వహించింది. సీనియర్ల సలహాలు, దేశంలోని పరిశ్రమల సహకారంవల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. సహచరులందరికీ నా అభినందనలు.
-జయకుమార్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌

No comments:

Post a Comment