ఆధునిక భారతావని ప్రతినిధి.. కేటీఆర్
మంత్రి కేటీఆర్కు రెండోసారి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం
ఆధునిక భారతావనికి ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు ప్రతినిధి అని అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అభివర్ణించింది. మంత్రి కేటీఆర్కు పంపిన ప్రత్యేక ఆహ్వానంలో స్టాన్ఫోర్డ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ అంజిని కొచ్చార్ ఈ విషయాన్ని తెలిపారు. వరుసగా రెండోసారి తమ యూనివర్సిటీ వార్షిక సదస్సులో కీలకోపన్యాసం చేయాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. ఈ ఏడాది మే 18-19 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో ఉపాధి-ఉద్యోగాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ అంశాల మీద ప్రసంగించాలని విజ్ఞప్తి చేశారు.
ఐటీ రంగంలో గత రెండున్నరేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ, టెక్నాలజీ వినియోగం ద్వారా ఉద్యోగాలను, ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించేందుకు ఉన్న అవకాశాలపై మాట్లాడాల్సిందిగా కోరారు. ఈ సమావేశానికి స్టాన్ఫోర్డ్ విద్యార్థులు, ఫ్యాకల్టీతోపాటు వివిధ దేశాల నుంచి పరిశ్రమల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. వీరందరికీ తెలంగాణ సాధించిన ప్రగతి ఒక అధ్యయనం (కేస్ స్టడీ)గా ఉపయోగపడుతుందని యూనివర్సిటీ మంత్రికి పంపిన లేఖలో తెలిపింది. వరుసగా రెండో ఏడాది తనకు ఆహ్వానం రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు
No comments:
Post a Comment