కొత్తూరు, ఫిబ్రవరి 17: ఊరిని దత్తత తీసుకోవడమంటే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేలా చేయడమేనని ‘శ్రీమంతుడు’ సినిమాలో చెప్పిన ప్రిన్స్ మహేశ్ బాబు.. నిజజీవితంలోనూ ఆ డైలాగ్ను అనుసరిస్తున్నారు.. తాను దత్తత తీసుకున్న రంగారెడ్డి జిల్లా సిద్ధాపూర్ గ్రామంలో మరో అభివృద్ధి కార్యక్రమానికి విరాళమందించారు. ఈ గ్రామంలో నూతన పాఠశాల భవన నిర్మాణం కోసం మహేశ్బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ జిల్లా కలెక్టర్ రఘునందన్రావుకు రూ.30 లక్షల చెక్కును అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా మహే్షబాబు సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొన్న సంగతి తెలిసిందే.
గతంలో నమ్రతా శిరోద్కర్ గ్రామంలో రెండుసార్లు పర్యటించి గ్రామస్థుల ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహే్షబాబు ట్రస్టుకు చెందిన హీల్ ఏ చైల్డ్ సంస్థ ద్వారా గ్రామంలో మెగా వైద్యశిబిరాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్నత పాఠశాలకు భవనం లేదు. ఇప్పటికీ ప్రాథమికోన్నత పాఠశాలలోనే కొనసాగుతోంది. ఈ అంశాన్ని గ్రామస్థులు నమ్రతా శిరోద్కర్ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్ రఘునందన్రావు ఇటీవల గ్రామాన్ని సందర్శించి శివారులోని రెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో పాఠశాలను నిర్మించాలని సర్పంచ్కు సూచించారు. ఈ స్థలంలో నూతన పాఠశాల భవనం నిర్మాణం కోసం నమ్రత శిరోద్కర్ కలెక్టర్ రఘునందన్రావుకు రూ.30 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమెను కలెక్టర్ అభినందించారు. నమ్రతకు గ్రామ సర్పంచ్ ఎర్రోళ్ల నర్సమ్మ, ఎంపీటీసీ సభ్యుడు బాలయ్య, గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment