హైదరాబాద్ మహానగరంతోనూ, హైదరాబాదీయులతోనూ ఎన్టీఆర్ కున్న అనుబంధం అనిర్వచనీయం. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు అయినా, ఎన్టీఆర్ జీవితంలో ముఖ్యమైన రాజకీయ, ప్రజాసేవా పర్వంలోని ముఖ్యఘట్టాలన్నిటికీ హైదరాబాదే వేదిక.
రాజకీయ ప్రవేశానికి ముందే తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలన్న నాటి ముఖ్యమంత్రుల కోరికపై హైదరాబాదులో చిత్ర నిర్మాణాలను ప్రారంభించారు ఎన్టీఆర్. ఇక్కడే ముషీరాబాద్, నాచారంలలో స్టూడియోలను నిర్మించారు. థియేటర్లను కూడా నిర్మించి తెలుగునాట పరిశ్రమ నిలదొక్కుకోడానికి కృషి చేశారు. ప్రతిష్టాత్మకమైన 'దానవీరశూర కర్ణ' చిత్రం అవుట్ డోర్ షూటింగ్ మొత్తం నాచారం పరిసర ప్రాంతాలలో జరిపినదే. సినీ పరిశ్రమ హైదరాబాదుకు రావాలన్న లక్ష్యంతోనే కుటుంబంతో సహా ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నారు ఎన్టీఆర్.
ఆ తరవాత 1982 మార్చి 21, సా. 6. 15 గంటలకు హైదరాబాదులోని రామకృష్ణా స్టూడియోస్ లోనే రాజకీయ ప్రవేశ ప్రకటన చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 'తెలుగుదేశం పార్టీ' స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. ఎన్టీఆర్ చేతులమీదుగా తెదేపా పతాక రూపకల్పన జరిగింది ఇక్కడే. తెలుగుదేశం పార్టీ మొదటి పబ్లిక్ మీటింగ్, నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లోనే జరిగింది. దానికి 80 వేల మంది ప్రజలు హాజరయ్యారు. ప్రచారం కూడా మొదట తెలంగాణ నుండే ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఇక్కడి ఎల్బీ స్టేడియంలోనే.
చంద్రబాబు సైబర్ టవర్స్ ను నిర్మించక ముందు హైదరాబాదుకు సంకేతంగా నిలిచింది హుస్సేన్ సాగర్లోని బుద్ధ ప్రతిమ. ట్యాంక్ బ్యాండ్ ను సుందరంగా తీర్చిదిద్ది దానిపై తెలుగు మహనీయుల విగ్రహాలను నెలకొల్పారు ఎన్టీఆర్. ఆ విగ్రహలంటే ఆయనకు ప్రాణం. ఒకసారి ట్యాంక్బండ్ మీద 70 కిలోమీటర్ల వేగంతో కారులో వెళ్తున్నారాయన. ఉన్నట్టుండి కారును ఆపమన్నారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి ఆపారు. 'వెనక్కి తీసుకోండి' అన్నారు ఎన్టీఆర్. రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద ఆపమన్నారు. కాన్వాయ్ వెంట ఉన్న ఒక అధికారిని పిలిచి.."ఆ గుర్రానికి ఉన్నవి కాళ్లా, కర్ర పుల్లలా'' అని అడిగి అక్కడే ఒక కాగితం మీద ఓ నమూనా గీసి.. "నేను మద్రాస్ నుంచి వచ్చేలోపు ఇలా చెక్కించండి'' అని ఆదేశించారు. ట్యాంక్ బండ్ విగ్రహాలంటే ఎన్టీఆర్ కు అంత మమకారం ఉండేది.
తన అర్ధాంగి క్యాన్సర్ తో చనిపోతే ఆమె స్మారకార్థం 'బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి'ని కూడా హైదరాబాదులోనే నిర్మించారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రి నిర్వహణను ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ చూస్తున్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ... తన తండ్రి సమయానికి విలువిచ్చే వారని, కాలం ఆయన వెంట పరిగెట్టేదని చెబుతారు బాలకృష్ణ.
ఎన్టీఆర్ అంతిమ ప్రయాణం కూడా హైదరాబాద్ నగర వీధులలో లక్షలాది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలుకుతుండగా కొనసాగింది. జనసాగరం ఒకపక్క, హుస్సేన్ సాగర్ ఒక పక్క ఉండగా ఆయన అంత్యక్రియలు ముగిసాయి. తనకిష్టమైన ట్యాంక్ బండ్ చెంతనే, తాను తీర్చిదిద్దిన విగ్రహాల సమీపానే ఎన్టీఆర్ శాశ్వతంగా కనుమరుగయ్యారు.
పాలకులు మారినా, కాలం మారినా, ఎన్ని ఉద్యమాలు జరిగినా హైదరాబాదీయుల మనో ఫలకం నుండి ఎన్టీఆర్ స్మృతులను చెరిపివేయడం ఎవరితరం కాదు.
రాజకీయ ప్రవేశానికి ముందే తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలన్న నాటి ముఖ్యమంత్రుల కోరికపై హైదరాబాదులో చిత్ర నిర్మాణాలను ప్రారంభించారు ఎన్టీఆర్. ఇక్కడే ముషీరాబాద్, నాచారంలలో స్టూడియోలను నిర్మించారు. థియేటర్లను కూడా నిర్మించి తెలుగునాట పరిశ్రమ నిలదొక్కుకోడానికి కృషి చేశారు. ప్రతిష్టాత్మకమైన 'దానవీరశూర కర్ణ' చిత్రం అవుట్ డోర్ షూటింగ్ మొత్తం నాచారం పరిసర ప్రాంతాలలో జరిపినదే. సినీ పరిశ్రమ హైదరాబాదుకు రావాలన్న లక్ష్యంతోనే కుటుంబంతో సహా ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నారు ఎన్టీఆర్.
ఆ తరవాత 1982 మార్చి 21, సా. 6. 15 గంటలకు హైదరాబాదులోని రామకృష్ణా స్టూడియోస్ లోనే రాజకీయ ప్రవేశ ప్రకటన చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 'తెలుగుదేశం పార్టీ' స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. ఎన్టీఆర్ చేతులమీదుగా తెదేపా పతాక రూపకల్పన జరిగింది ఇక్కడే. తెలుగుదేశం పార్టీ మొదటి పబ్లిక్ మీటింగ్, నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లోనే జరిగింది. దానికి 80 వేల మంది ప్రజలు హాజరయ్యారు. ప్రచారం కూడా మొదట తెలంగాణ నుండే ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఇక్కడి ఎల్బీ స్టేడియంలోనే.
చంద్రబాబు సైబర్ టవర్స్ ను నిర్మించక ముందు హైదరాబాదుకు సంకేతంగా నిలిచింది హుస్సేన్ సాగర్లోని బుద్ధ ప్రతిమ. ట్యాంక్ బ్యాండ్ ను సుందరంగా తీర్చిదిద్ది దానిపై తెలుగు మహనీయుల విగ్రహాలను నెలకొల్పారు ఎన్టీఆర్. ఆ విగ్రహలంటే ఆయనకు ప్రాణం. ఒకసారి ట్యాంక్బండ్ మీద 70 కిలోమీటర్ల వేగంతో కారులో వెళ్తున్నారాయన. ఉన్నట్టుండి కారును ఆపమన్నారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి ఆపారు. 'వెనక్కి తీసుకోండి' అన్నారు ఎన్టీఆర్. రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద ఆపమన్నారు. కాన్వాయ్ వెంట ఉన్న ఒక అధికారిని పిలిచి.."ఆ గుర్రానికి ఉన్నవి కాళ్లా, కర్ర పుల్లలా'' అని అడిగి అక్కడే ఒక కాగితం మీద ఓ నమూనా గీసి.. "నేను మద్రాస్ నుంచి వచ్చేలోపు ఇలా చెక్కించండి'' అని ఆదేశించారు. ట్యాంక్ బండ్ విగ్రహాలంటే ఎన్టీఆర్ కు అంత మమకారం ఉండేది.
తన అర్ధాంగి క్యాన్సర్ తో చనిపోతే ఆమె స్మారకార్థం 'బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి'ని కూడా హైదరాబాదులోనే నిర్మించారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రి నిర్వహణను ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ చూస్తున్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ... తన తండ్రి సమయానికి విలువిచ్చే వారని, కాలం ఆయన వెంట పరిగెట్టేదని చెబుతారు బాలకృష్ణ.
ఎన్టీఆర్ అంతిమ ప్రయాణం కూడా హైదరాబాద్ నగర వీధులలో లక్షలాది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలుకుతుండగా కొనసాగింది. జనసాగరం ఒకపక్క, హుస్సేన్ సాగర్ ఒక పక్క ఉండగా ఆయన అంత్యక్రియలు ముగిసాయి. తనకిష్టమైన ట్యాంక్ బండ్ చెంతనే, తాను తీర్చిదిద్దిన విగ్రహాల సమీపానే ఎన్టీఆర్ శాశ్వతంగా కనుమరుగయ్యారు.
పాలకులు మారినా, కాలం మారినా, ఎన్ని ఉద్యమాలు జరిగినా హైదరాబాదీయుల మనో ఫలకం నుండి ఎన్టీఆర్ స్మృతులను చెరిపివేయడం ఎవరితరం కాదు.
No comments:
Post a Comment