మళ్లీ మాట మారుస్తున్న చంద్రబాబు..!
“తునిలో జరిగిన ఘటనలు దారుణం..ముందస్తు వ్యూహం ప్రకారమే జరిగింది….ఇది గోదావరి జిల్లా వాళ్ల పనికాదు..కాపుల గురించి నాకు బాగా తెలుసు..వాళ్లు శాంతిస్వభావులు..పులివెందుల నుంచి వచ్చిన వారు చేసిన పని ఇది. ఓ రౌడీ స్వభావంతో రాష్ట్రం అతలాకుతలం కావాలా…?” ఇవి చంద్రబాబు మాటలు. తుని ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు. కాపు గర్జనలో జరిగిన విధ్వంసానికి తూర్పు గోదావరి జిల్లా వాసులు కారణం కాదని ఆయన సర్టిఫికెట్ ఇచ్చేశారు. బయట నుంచి వచ్చిన అసాంఘిక శక్తులే ఇలాంటి కుట్రలు పన్నినట్టు ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలే దీనికి కారణమని సూత్రీకరించారు. ఆ తర్వాత హోంమంత్రి కూడా అదే స్పష్టం చేశారు.
అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం మరోమారు మాట తప్పుతున్నట్టు కనిపిస్తోంది. కాపు రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన హామీ విషయంలో కూడా ఇదేరీతిలో వ్యవహరించినందువల్లే ఇప్పుడు పరిస్థితి ఇంతవరకూ వచ్చిందన్నది కాదనలేని సత్యం. ఆయన హామీని నిలబెట్టుకుని ఉంటే అసలు ఉద్యమానికే అవకాశం లేదు. అయినప్పటికీ దారుణం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన తీరు మారడంలేదని కేసుల విషయంలో స్పష్టం అవుతోంది. ఈ ఘటనలకు తూర్పూ గోదావరి జిల్లా వాసులు కారణం కాదని..వారంతా శాంతిస్వభావులని చెప్పిన సీఎం ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా శాంతిస్వభావంతో ఉంటుందని, పులివెందుల అలా కాదంటూ ఆరోపణలుకు దిగజారిన సీఎం హయంలోనే ఇప్పుడు శాంతిస్వభావులను వేధించడం మొదలవుతోంది.
తునిలో ఆదివారం జరిగిన కాపు ఐక్య గర్జన సభలో చోటు చేసుకున హింసాత్మక, విధ్వంసక చర్యలకు బాధ్యులైన వారిపై చర్యలకు ఏపీ ప్రభత్వం ఉప క్రమిచించింది. సోమవారం నుంచి ఈ విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో, వారిపై కేసుల నమోదు చేసే ప్రక్రియలో పోలీసులు పడ్డారు. ఇందులో భాగం సభకు హాజరైన 27 మంది మఖ్యనేతలపై పోలీసులు కేసులు పెట్టారు. కాపు ఐక్యగర్జన సభకు నాయకత్వం వహించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో పాటు వైసీపీ, కాంగ్రెస్, బిజేపీ పార్టీలకు చెందిన నాయకులపై కేసులు పెట్టారు. 36 కేసులకు పైగా నమోదయ్యాయి. అన్ని కేసులలో ముద్రగడ పద్మనాభంను ఎ వన్ గా చూపించారు. అల్లర్లు, దహనకాండకు పాల్పడిన 350 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు గుర్తించారు. అయితే అమాయికులపై కేసులు పెడుతున్నారని కాపు సంఘం నేతలు ఆరోపిస్తుంటే.. ఆధారాలున్న వారినే అరెస్ట్ చేస్తామని, అమాయికలను ఇబ్బందిపెట్టమని, అసాంఘిక శక్తులను వదిలేదిలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. నాటి అల్లర్ల , దహనకాండ వల్ల 136 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
కేసులు నమోదు అయిన నాయకులు జాబితా ఇలా వుంది..
1.ముద్రగడ పద్మనాభం- ఏ1
2. పళ్లం రాజు (కేంద్ర మాజీ మంత్రి)
3.బొత్స సత్యనారాయణ (మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నేత)
4. కన్నా లక్ష్మీనారాయణ (మాజీమంత్రి, బీజేపీ నేత)
5. వట్టి వసంత్ కుమార్ (మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత)
6. ఆకుల రామకృష్ణ కాంగ్రెస్ , కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు.
7. వాసిరెడ్డి యేసుదాసు,తూర్పు గోదావరి జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షులు.
8.జక్కంపూడి విజయలక్ష్మి (వైఎస్ఆర్ సీపీ)
9. కే.వీ.సీహెచ్. మోహన్ రావు (మాజీమంత్రి)
10. వి.హనుమంతరావు (కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రం)
11. అంబటి రాంబాబు (మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి)
12. జ్యోతుల నెహ్రూ, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
13.వరుపుల సుబ్బరావు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
14. దాడిశెట్టి రాజా, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
15. గంగా భవానీ (మాజీ ఎమ్మెల్సీ)
16.జీవీ సుధాకర్, సినీ నటుడు
17. అడపా నాగేంద్ర, బీజేపీ నేత, విజయవాడ
18. నల్లా విష్ణు (అమలాపురం)
19. నల్లా పవన్ (బీజేపీ, అమలాపురం)
20.కె.తాతాజీ (కాంగ్రెస్, అమలాపురం) కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు
21. బండారు శ్రీనివాసరావు (వేదపాలెం, టీడీపీ)
22. ముత్యాల వీరభద్రరావు (వైఎస్ఆర్ సీపీ, కొత్తపేట)
23. ఎంఎస్ఆర్ నాయుడు (నెం.1 చానల్ ఎండీ)
24.దూలిపూడి చక్రం (పసుపులంక, వైఎస్ఆర్ సీపీ)
25. యెల్లా దొరబాబు (బీజేపీ, ఏఎల్ డీఏ చైర్మన్)
26. ఆలేటి ప్రకాష్, కాపు రిజర్వేషన్ పోరాట సమితీ నాయకులు,
27. జామి ఠానేలంకల (వైఎస్ఆర్ సీపీ, ముమ్మడివరం మండలం)
1.ముద్రగడ పద్మనాభం- ఏ1
2. పళ్లం రాజు (కేంద్ర మాజీ మంత్రి)
3.బొత్స సత్యనారాయణ (మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నేత)
4. కన్నా లక్ష్మీనారాయణ (మాజీమంత్రి, బీజేపీ నేత)
5. వట్టి వసంత్ కుమార్ (మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత)
6. ఆకుల రామకృష్ణ కాంగ్రెస్ , కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు.
7. వాసిరెడ్డి యేసుదాసు,తూర్పు గోదావరి జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షులు.
8.జక్కంపూడి విజయలక్ష్మి (వైఎస్ఆర్ సీపీ)
9. కే.వీ.సీహెచ్. మోహన్ రావు (మాజీమంత్రి)
10. వి.హనుమంతరావు (కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రం)
11. అంబటి రాంబాబు (మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి)
12. జ్యోతుల నెహ్రూ, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
13.వరుపుల సుబ్బరావు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
14. దాడిశెట్టి రాజా, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
15. గంగా భవానీ (మాజీ ఎమ్మెల్సీ)
16.జీవీ సుధాకర్, సినీ నటుడు
17. అడపా నాగేంద్ర, బీజేపీ నేత, విజయవాడ
18. నల్లా విష్ణు (అమలాపురం)
19. నల్లా పవన్ (బీజేపీ, అమలాపురం)
20.కె.తాతాజీ (కాంగ్రెస్, అమలాపురం) కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు
21. బండారు శ్రీనివాసరావు (వేదపాలెం, టీడీపీ)
22. ముత్యాల వీరభద్రరావు (వైఎస్ఆర్ సీపీ, కొత్తపేట)
23. ఎంఎస్ఆర్ నాయుడు (నెం.1 చానల్ ఎండీ)
24.దూలిపూడి చక్రం (పసుపులంక, వైఎస్ఆర్ సీపీ)
25. యెల్లా దొరబాబు (బీజేపీ, ఏఎల్ డీఏ చైర్మన్)
26. ఆలేటి ప్రకాష్, కాపు రిజర్వేషన్ పోరాట సమితీ నాయకులు,
27. జామి ఠానేలంకల (వైఎస్ఆర్ సీపీ, ముమ్మడివరం మండలం)
ఈ జాబితా పరిశీలిస్తే బాబు మాటల మర్మం ఇట్టే అర్థమవుతుంది. లిస్టులో బొత్సా, కన్నా, వీహెచ్ వంటి వారిని మినహాయిస్తే మిగిలిన 21 మంది గోదావరి జిల్లాల వాసులే. వారేకాకుండా కేసుల కోసం ఇప్పటికే అనుమానితుల జాబితాలో అదుపులోకి తీసుకున్న వారందరూ గోదావరి వాసులే. అంటే గోదావరి జిల్లా వాసులకు ఇది సంబంధం లేదని ఆరోజు సీఎంచెప్పిన మాటలకు భిన్నంగా ఇప్పుడు పోలీస్ వ్యవహారం కొనసాగుతోంది. అంటే అది చంద్రబాబు చెప్పిన అబద్దమైనా కావాలి..లేక పోలీసులు కావాలనే వేదిస్తున్నట్టు అయినా జరగాలి. కానీ ప్రభుత్వం మాత్రం పైకి ఒకటి చెబుతూ..చేతలు మరోలా సాగిస్తుందన్నది స్పష్టమవుతోంది. గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలను, యువతను వేదించడానికి సిద్ధపడుతుందని అర్థమవుతోంది.
No comments:
Post a Comment