Pasam Jagannadham Naidu
ఇంతకు దొర ఎవరు?..దొంగ ఎవరు? .మీరెండు కుటుంబాల డ్రామాలు కట్టి పెట్టి.ప్రజలకు అసలు
విషయం ఎలా తేల్చ గలరో చెప్పండి.తునిలో అల్లర్లు,దహనాలు,జగన్ చేయించాడని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నాడు..చంద్రబాబు చేయించాడని జగన్ ఆరోపిస్తున్నాడు..అసలు విషయం ఏమిటి?రెండు కుటుంబాలు నాటకాలు చేస్తున్నారా?..తునిలో నిరాహార దీక్ష చేస్తున్నట్టు చాలా
కాలంగా ప్రకటిస్తున్నారు.అది చాలా సున్నితమైన విషయం..గొడవలు అల్లర్లు జరుగుతాయని
జనానికి అనుమానం ఉంది గాని ప్రభుత్వానికి పోలీస్ కు అను మానం రాలేదా?ఎందుకు ముందు
జాగ్రత్తలు తీసుకోలేదు?ఇదే డ్రామాలు వచ్చే మూడేళ్ళు కొనసాగించే స్తారా?అసలు ఆంధ్రప్రదేశ్ లో
ప్రభుత్వం అంటూ ఉందా?ఎంతోమందిరైళ్ళు,బస్సుల ప్రయాణీకులు గుండెలు అరచేతిలో పెట్టుకుని
భయోత్పాతంతో పరుగులు తీసారే..మహిళలు,చిన్న,చిన్న పిల్లలు వృద్దులు పసికండులతో సహా
మీ చేతగాని పాలనకు,మీ అసమర్ధతకు నరకయాతన అనుభ వించారే?నీరో చక్రవర్తిలా మీ చేష్టలకు పాలనకు ప్రజలు బలవ్వాలా?ప్రజల ధన,మాన,ప్రాణాలకు భద్రత కలిపించడం అంటే ఇదేనా?
తుని సంఘటనలో మీ గూడు పుటాణీ లేదా ?చంద్రబాబు?జగన్ మీరు కలిసి ఆడిన నాటకం లో భాగం కాదా ఇది ?లేదనుకుంటే విధ్వంసకర సంఘటనలను ఎలా చూస్తూ ఊరుకున్నారు.సాను .
భూతి కోసమా?మీరు అధికారంలో ఉన్న విషయం మరచి పోయి సాను భూతి కోసం ప్రయత్నించారా?
శాంతి భద్రతలు చేతిలో పెట్టుకుని మరొకరి హస్తం ఉంది అని ఎలా అనగలిగారు...అంతా సజావుగా సాగితే చంద్రబాబు మహిమ..లేదంటే ప్రతి పక్షం మహిమ అని తమరికి ఎవరి మీదో నెట్టడం అలవాటే
కదా?ముందు జరిగిన సంఘటనలకు ప్రజలకు సంజాయిషీ ఇవ్వండి..న్యాయ విచారణ చేయించండి..అధికార ప్రతి పక్షాలు రాష్ట్ర పరువును నిలపడానికి కృషి చేయండి.
No comments:
Post a Comment