UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 28 February 2016

వర్ణ, వర్గ, మత భేదాలను తిరస్కరిస్తూ సమాజంలో మానవీయ విలువలను సృజనాత్మకంగా ఆవిష్కరించిన గొప్ప సంస్కరణ శీలి, యుగ ద్రష్ట, మహా పురుషుడు సంత్‌ శిరోమణి గురు రవిదాసు.



సంత్ రవిదాస్ (ఆంధ్రజ్యోతి 28.2.2016)
కార్ల్‌ మార్క్స్‌ కన్నా వందల సంవత్సరాల క్రితమే సామ్యవాద సిద్ధాంత ప్రతిపాదన మనసమాజంలో జరగడం గమనించదగ్గ విషయం. రవిదాసు ఆలోచనా విధానం ఎంతో ఉన్నతమైనది. విలువైనది. ఆయన ఎల్లలు లేని తాత్వికతను, అమోఘమైన, అద్భుతమైన భావనాశక్తిని భారతీయ సమాజానికి అందించారు.
వర్ణ, వర్గ, మత భేదాలను తిరస్కరిస్తూ సమాజంలో మానవీయ విలువలను సృజనాత్మకంగా ఆవిష్కరించిన గొప్ప సంస్కరణ శీలి, యుగ ద్రష్ట, మహా పురుషుడు సంత్‌ శిరోమణి గురు రవిదాసు. పదిహేనవ శతాబ్దంలోనే మనిషి స్వాతంత్ర్యాన్ని సమర్థించిన గొప్ప స్వాప్నికుడు ఆయన. ఉత్తరప్రదేశలోని వారణాసిలో ఒక హరిజన కుటుంబంలో జన్మించిన ఈ సామాజిక సంస్కర్త జయంతి ఉత్సవాలు ఉత్తరభారతంలో ఘనంగా జరుగుతున్నాయి. పరాధీనత్వాన్ని, బానిసత్వాన్ని రవిదాసు వ్యతిరేకించినట్లుగా వారి సమకాలీనుల్లో మరొకరు వ్యతిరేకించలేదంటే అతిశయోక్తికాదు. వారి దృష్టిలో పరాధీనత్వం(బానిసత్వం) పెద్ద పాపం, శాపం. వాస్తవానికి పరాధీన వ్యక్తి జీవితం అత్యంత దుర్భరం. బహిష్కరణల సమ్మేళనం. జీవితాంతం అవమానాలు, అత్యాచారాలు. అందుకే స్వాతంత్య్రం కోసం మనిషి సహజంగానే పరితపిస్తుంటాడు. దీన, హీన పతిత జీవితం గడపాలని ఎవరూ కోరుకోరు. అది అనివార్యం అయితే తప్ప. పరాధీనత మానసికం కావచ్చు లేదా శారీరకం. పరాధీనత్వం నుంచి బయటపడాలని రవిదాసు ఉద్భోదిస్తాడు : మనిషి సుఖ స్థావరాలు రెండే రెండు,/ మొదటి సుఖ స్థావరం స్వరాజ్యం(స్వాతంత్య్రం),/ రెండోది శ్మశానం. అనగా మనిషి జీవితానికి పర్యాయ పదం స్వరాజ్యం అంటే స్వాతంత్య్రం. అది లేకపోతే మనిషి జీవితం శ్మశాన సదృశ్యమే. స్వతంత్ర జీవులే నిజానికి సుఖ జీవులు.
స్వాతంత్ర్యాన్ని పొందడం, పొందిన స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. అందుకోసం భక్తిని కాదు శక్తిని కూడగట్టు కోవాలి. భక్తికి బదులు శక్తియే మనిషిని విజయం వైపు తీసుకువెళ్తుందని చరిత్రలో ఎన్నో సంఘటనలు రుజువు చేసాయి. భక్తి మనిషిని నిష్ర్కియత్వానికి గురిచేస్తుంది. పరాధీనత్వమనే సుడిగుండంలోకి నెట్టి వేస్తుంది. ప్రశ్నించే తత్వాన్ని చంపి వేస్తుంది. ఏ సమాజంలోనైతే ప్రశ్నకు స్థానం ఉండదో ఆ సమాజంలో ప్రగతి కుంటుబడుతుంది. రవిదాసు శక్తిని ఆరాధిస్తాడు. పరాధీనత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలంటాడు.
స్వరాజ్యం లేదా స్వాతంత్య్రంలోనే మనిషి జీవితం, ఔన్నత్యం ఇమిడి ఉన్నాయని రవిదాసుకు తెలుసు. స్వరాజ్యం లేదా స్వాతంత్య్రం మనిషికి జీవన్మరణ ప్రశ్న. రవిదాసు కలలు గనే స్వరాజ్యం లేదా రాజ్యం చాలా ఉన్నతమైనది. ఆదర్శవంతమైనది. మానవీయ సమానత్వంతో కూడుకున్నది. మనిషి ఆర్థిక ఇక్కట్లను అధిగమించి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో జీవించే వ్యవస్థను రవిదాసు కోరుకుంటాడు. వారు కోరుకునే రాజ్యంలో ప్రజాస్వామ్య, సామ్యవాద, మానవతా విలువలు ఆవిష్కరించబడతాయి : నేను ఆశించే రాజ్యంలో లభించు నందరికీ పరమాన్నం/ చిన్న పెద్ద లేదు భేదం/ అందరూ సమానం. రవిదాసు కోరుకునే రాజ్యంలో మనిషికి అవసరమైన మౌలిక వసతులు - కూడు, గూడు, గుడ్డ కల్పించబడతాయి. మనిషి సునిశ్చితమైన, సుఖవంతమైన, శాంతియుత జీవనం గడపడానికి అవకాశాలు ఏర్పడతాయి. శాంతి, సుఖం, సమృద్ధి మనిషికి ఆనందాన్నిస్తాయి. తాను ఊహించిన సమాజానికి ‘బేగంపుర’ అని నామకరణం చేశా రు. అంటే దుఖంలేని లేదా దుఖ రహితం. వర్గ, వర్ణ, దోపిడీ రహిత సమాజాన్ని ప్రతిపాదిస్తాడు. అదొక ఆనంద ధామ సిద్ధాంతం. నేరాలు ఘోరాలు, భయాందోళనలు, ఆకలి, దుఖం అన్నిరకాల వైషమ్యాల నుంచి ‘బేగంపుర’ దూరంగా ఉంటుంది. కార్ల్‌ మార్క్స్‌ కన్నా వందల సంవత్సరాల క్రితమే సామ్యవాద సిద్ధాంత ప్రతిపాదన మనసమాజంలో జరగడం గమనించదగ్గ విషయం. రవిదాసు ఆలోచనా విధానం ఎంతో ఉన్నతమైనది. విలువైనది. వారు ఎల్లలు లేని తాత్వికతను, అమోఘమైన, అద్భుతమైన భావనాశక్తిని భారతీయ సమాజానికి అందించారు. ఈనాడు మనం చూస్తున్న అభివృద్ధి చెందిన ప్రచార మాధ్యమాలు ఆ కాలంలో గాని ఉండి ఉంటే వారిచ్చిన చైతన్యం ద్వారా ఎన్నో మార్పులు, విప్లవాలు సంభవించి ఉండేవి.
రవిదాసు దేవీ దేవతలను, అవతారాలను ఆశ్రయించమని గాని, పూజించమని గాని చెప్పలేదు. ప్రజలు తమ శక్తియుక్తుల మీదనే విస్వాసం, నమ్మకం ఉంచి ముందుకు సాగాలని ప్రబోధించారు. వారి దృష్టిలో ఆత్మ విశ్వాసమే విజయ రహస్యం. తుది శ్వాస వరకు విశ్వాసమే ప్రబల అస్త్రం. రవిదాసు శ్రమనే విశ్వసించాడు. శ్రమ సాధనే ప్రపంచంలో సుఖ శాంతులు ప్రసాదిస్తుంది. శ్రమతోనే వ్యక్తి వ్యక్తిత్వం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. వారంటారు : పుట్టుకతోనే గొప్పది కాదు కులం/ కులం కన్న కర్తవ్యం ప్రధానం/ ధర్మమే ఇలలో సత్యం/ రవిదాసు కోరెను దానిని నిత్యం. అందరూ పుట్టుకతో సమానం. అందరిలో ఉండే రక్తం రంగు ఒక్కటే. అందరిది ఒకే రకమైన మాంసం, ఒకే రకమైన ఎముకలు. మరి మనుషులు మతం పేరు మీద, వర్ణం పేరు మీద, కులం పేరు మీద ఎందుకు విడిపోతారు? ఇలాంటి మౌలికమైన అంశాలను రవిదాసు లేవనెత్తుతూ ఇలా సమాధానం ఇస్తారు : హిందువులు, తురకల మధ్య లేదు భేదం/ అందరిలోను ఒక్కటే రక్తం, మాంసం/ ఇరువురిని శోధించి రవిదాసు కనుగొనెను/ లేదు ఎలాంటి తర్క మీమాంసం. ఈ రోజు దేశంలో ఏది దేశ భక్తి? ఏది దేశం ద్రోహం? ఎవరు దేశ భక్తులు? ఎవరు దేశ ద్రోహులు? అనే అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రవిదాసు చెప్పిన పై విషయాలను గుర్తుంచుకుంటే సమస్యలకు మూలమేంటో అర్థమవుతుంది. భారత దేశంలో కులం, మతం ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. అవి సమాజంలో పెనుసవాళ్ళుగా పరిణమించాయి. రోజు రోజుకు సమాజంలో అంతరాలు పెంచుతున్నాయి. ఆ కాలంలోనే రవిదాసు కులం గురించి, మతం గురించి వాఖ్యానించారు : కుల మతాల కుమ్ములాటల్లో జనమంతా కూరుకుపోయే/ రవిదాసు గాంచెను కుల జాఢ్యం మానవత్వాన్ని మంటగలిపే.---ప్రొఫెసర్ వి.కృష్ణ

No comments:

Post a Comment