Mudragada Padmanabham write a letter to AP CM
బ్రిటిష్ పాలనలో ఉన్న కోటా తొలగించారు
హామీలు అమలు చేయకపోతే 11 నుంచి మళ్లీ దీక్ష
బాబుకు ముద్రగడ లేఖ…
‘‘బ్రిటిష్ పాలనలో ఉన్న రిజర్వేషన్ల నుంచి ఏ కులాన్నయినా తొలగించారా? కానీ, దరిద్రపు జాతి పేదరికంలో ఉండి మగ్గటం వలన రోడ్లు ఎక్కి అడిగే పరిస్థితి లేకుండా పోయింది. స్వాతంత్య్రం ఈ దేశానికి వచ్చిందేమోకానీ, మా జాతికి రాలేదని భావిస్తున్నాను’’ అని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆక్రోశించారు. అంబేద్కర్, దామోదరం సంజీవయ్య కూడా కాపులకు రిజర్వేషన్లను సమర్థించారన్నారు. ‘ఈ దరిద్రపు జాతి అంతరించి పోవాలన్నదే మీ కోరికగా కనిపిస్తోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. దీక్ష ఉపసంహరణ సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. కొత్తగా స్కాలర్షిప్లు, సబ్ప్లాన్ అంటూ బోగస్ హామీలు ఇచ్చారన్నారు. దీనిపై ముఖ్యమంత్రికి ముద్రగడ రాసిన మంగళవారం ఓ లేఖ రాశారు. ఇందులో చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో ఆరోపణలు చేశారు. ‘‘కాపులకు రుణ మంజూరుపై మోసపూరిత జీవో జారీ చేశారని, జన్మభూమి కమిటీ ప్రమేయంతోనే దరఖాస్తులు ఆమోదించేలా నిబంధనలున్నాయని, ఇదేం న్యాయమని అడుగుతున్నారు. ఇలా ఇచ్చే నిధులు మీ రెండు ఎకరాల ఎస్టేట్లోవి కావు. తక్షణం ఇస్తామన్న రూ.500 కోట్ల మాట మరిచిపోయి… బడ్జెట్లో వెయ్యికోట్లు పెడతామంటున్నారు. మా జాతికి ఎందుకూ అక్కరకు రాని రుణాల మంజూరుకు భారీ కార్యక్రమం పెట్టి, ఒక 420 నాయకుడితో నేను కాపు జాతిలో చెడపుట్టానని తిట్టిస్తున్నారు. నా మొదటి ఉత్తరం వచ్చేదాకా… మా జాతివల్ల కుర్చీలో ఉన్నానని చెప్పడం తప్ప వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? ఈ దరిద్రపు జాతి పూర్తిగా అంతరించి పోవాలన్నదే మీ కోరికగా కనిపిస్తోంది. రెండు ఎకరాల రైతు అయిన మీరు ఈ పేద జాతిపై సానుభూతి చూపకపోవడం అతి దారుణం’’ అని ముద్రగడ ఆక్రోశించారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ… ‘‘మీరు చెప్పుకొనే క్యారెక్టరు పిల్లనిచ్చిన మామను సీఎం
మోసపూరిత హామీలు…
కాపు ఉద్యమాన్ని బాబు మోసపూరిత వాగ్దానాలతో నీరుగార్చారని ముద్రగడ ఆరోపించారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నోటిమాటతో దీక్ష విరమించినందుకు సిగ్గుపడుతున్నా. మరోసారి ఉద్యమిస్తా. రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ఖరారు చేస్తా’’ అని తెలిపారు. కాపులకు రుణాల మంజూరులో పచ్చచొక్కాలకే ప్రాధాన్యం ఇచ్చి అసలైన పేదలను విస్మరించారన్నారు. కాపు సంక్షేమానికి రూ.500 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని చెప్పి… పైసా ఇవ్వలేదన్నారు. తుని ఘటనలో లోతైన విచారణ చేపట్టాకే కేసులు పెడతామని హామీ ఇచ్చి… ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. తమ ఉద్యమం వెనుక ఏ పార్టీ ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు.
No comments:
Post a Comment