UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 3 March 2016

Mudragada Padmanabham write a letter to AP CM

బ్రిటిష్‌ పాలనలో ఉన్న కోటా తొలగించారు
హామీలు అమలు చేయకపోతే 11 నుంచి మళ్లీ దీక్ష
బాబుకు ముద్రగడ లేఖ…

‘‘బ్రిటిష్‌ పాలనలో ఉన్న రిజర్వేషన్ల నుంచి ఏ కులాన్నయినా తొలగించారా? కానీ, దరిద్రపు జాతి పేదరికంలో ఉండి మగ్గటం వలన రోడ్లు ఎక్కి అడిగే పరిస్థితి లేకుండా పోయింది. స్వాతంత్య్రం ఈ దేశానికి వచ్చిందేమోకానీ, మా జాతికి రాలేదని భావిస్తున్నాను’’ అని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆక్రోశించారు. అంబేద్కర్‌, దామోదరం సంజీవయ్య కూడా కాపులకు రిజర్వేషన్లను సమర్థించారన్నారు. ‘ఈ దరిద్రపు జాతి అంతరించి పోవాలన్నదే మీ కోరికగా కనిపిస్తోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. దీక్ష ఉపసంహరణ సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. కొత్తగా స్కాలర్‌షిప్‌లు, సబ్‌ప్లాన్‌ అంటూ బోగస్‌ హామీలు ఇచ్చారన్నారు. దీనిపై ముఖ్యమంత్రికి ముద్రగడ రాసిన మంగళవారం ఓ లేఖ రాశారు. ఇందులో చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో ఆరోపణలు చేశారు. ‘‘కాపులకు రుణ మంజూరుపై మోసపూరిత జీవో జారీ చేశారని, జన్మభూమి కమిటీ ప్రమేయంతోనే దరఖాస్తులు ఆమోదించేలా నిబంధనలున్నాయని, ఇదేం న్యాయమని అడుగుతున్నారు. ఇలా ఇచ్చే నిధులు మీ రెండు ఎకరాల ఎస్టేట్‌లోవి కావు. తక్షణం ఇస్తామన్న రూ.500 కోట్ల మాట మరిచిపోయి… బడ్జెట్‌లో వెయ్యికోట్లు పెడతామంటున్నారు. మా జాతికి ఎందుకూ అక్కరకు రాని రుణాల మంజూరుకు భారీ కార్యక్రమం పెట్టి, ఒక 420 నాయకుడితో నేను కాపు జాతిలో చెడపుట్టానని తిట్టిస్తున్నారు. నా మొదటి ఉత్తరం వచ్చేదాకా… మా జాతివల్ల కుర్చీలో ఉన్నానని చెప్పడం తప్ప వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? ఈ దరిద్రపు జాతి పూర్తిగా అంతరించి పోవాలన్నదే మీ కోరికగా కనిపిస్తోంది. రెండు ఎకరాల రైతు అయిన మీరు ఈ పేద జాతిపై సానుభూతి చూపకపోవడం అతి దారుణం’’ అని ముద్రగడ ఆక్రోశించారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ… ‘‘మీరు చెప్పుకొనే క్యారెక్టరు పిల్లనిచ్చిన మామను సీఎం
పదవి నుంచి దించినప్పుడే లోకానికి తెలిసింది. మీరు 1984 నుంచి చేసిన నేరాల చిట్టా విప్పమంటారా? ఇప్పుడు నాపై పెడుతున్న ఆంక్షలు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మీపై పెట్టి ఉంటే మీరు ఎక్కడ ఉండేవారో? ‘మా సోదరులను బెదిరించడం కాదు… దమ్మూ ధైర్యం, చీమూ నెత్తురు ఉంటే మా జాతిని టెర్రరిస్టులుగా ముద్ర వేసి జైలులో పెట్టండి’’ అని సవాలు విసిరారు. ‘‘పట్టిసీమకు, పప్పు బెల్లాలకు, రాజధానికి కొబ్బరికాయ కొట్టడానికి, విదేశాలు తిరగడానికి, ప్రత్యేక విమానాల్లో విహరించడానికి, గెస్టు హౌసులకు, ఆఫీసులకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారే! మాకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదని అబద్దాలు చెప్పి తప్పించుకుంటే ఈ జాతి సహించదు. మీ రెండు ఎకరాల ఎస్టేట్‌ నిధులుకానీ, చీకటి ఒప్పందాల నిధులుకానీ మేం కోరడంలేదు. రాష్ట్ర ఆదాయంలో మా జాతి పన్నుల రూపంలో కట్టిన వాటా కూడా ఉంది. తక్షణం హామీలు అమలు చేయాల్సిందే. ఇవన్నీ మీ సంతకంతో అధికారికంగా హామీ పత్రం మార్చి 10వ తేదీ సాయంత్రం లోపు పంపాలి. లేనిపక్షంలో 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నా ఇంటి ఆవరణలో తిరిగి ఆమరణ దీక్ష చేపడతా’’ అని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.

మోసపూరిత హామీలు…
కాపు ఉద్యమాన్ని బాబు మోసపూరిత వాగ్దానాలతో నీరుగార్చారని ముద్రగడ ఆరోపించారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నోటిమాటతో దీక్ష విరమించినందుకు సిగ్గుపడుతున్నా. మరోసారి ఉద్యమిస్తా. రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ఖరారు చేస్తా’’ అని తెలిపారు. కాపులకు రుణాల మంజూరులో పచ్చచొక్కాలకే ప్రాధాన్యం ఇచ్చి అసలైన పేదలను విస్మరించారన్నారు. కాపు సంక్షేమానికి రూ.500 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని చెప్పి… పైసా ఇవ్వలేదన్నారు. తుని ఘటనలో లోతైన విచారణ చేపట్టాకే కేసులు పెడతామని హామీ ఇచ్చి… ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. తమ ఉద్యమం వెనుక ఏ పార్టీ ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు.

No comments:

Post a Comment