హైదరాబాద్లో ‘హెలీ టూరిజం’ షురూ
హైదరాబాద్ టూరిజం చరిత్రలో ఇవాళ సుదినం: చందూలాల్
హైదరాబాద్ టూరిజం చరిత్రలో ఇవాళ సుదినం: చందూలాల్
హైదరాబాద్ టూరిజం చరిత్రలో నూతన అద్యాయం మొదలైంది. భాగ్యనగర సొయగాలను విహంగ వీక్షణం ద్వారా చూసే అవకాశం ప్రజలకు దక్కింది. ఇవాళ నెక్లెస్ రోడ్డులో తెలంగాణ పర్యాటక శాఖ-ఇండివెల్ ఏవియేషన్ సంస్థ సంయుక్తంగా చేపట్టిన హెలీ టూరిజం ఇన్ హైదరాబాద్ కార్యక్రమాన్ని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి చందూలాల్ మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్ టూరిజం చరిత్రలో సుదినం అని తెలిపారు. నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పర్యాటక శాఖ-ఇండివెల్ ఏవియేషన్ సంస్థ సంయుక్తంగా చేపట్టిన హెలీ టూరిజంను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రపంచ దేశాల్లో మాదిరి ఇక్కడ కూడా ఈ అవకాశం కల్పించాలని అందరూ వినియోగించుకుని ఎంజాయ్ చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పేర్వారం రాములు, టూరిజం కార్యదర్శి బుర్ర వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పేర్వారం రాములు, టూరిజం కార్యదర్శి బుర్ర వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment