ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డా|| ఎం.వి.రావు గారి మృతి.
మా ముత్తాత గారు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డా|| ఎం.వి.రావు ఆనారోగ్యం తో మంగళవారం రాత్రి హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన డా. ఎం వి రావు గారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
భారత వ్యవసాయ పరిశోధనా రంగానికి ఎనలేని సేవచేసి నోబల్ బహుమతి గ్రహీత ‘‘నార్మన్ బోర్లాగ్’’ డా॥ స్వామినాథన్ల సహచరుడిగా ‘‘ఆకుపచ్చ విప్లవ’’ సేనానిగా తనకంటూ ప్రత్యేక స్దానాన్ని పొందారు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేసారు. ఇండియన్ కౌన్సిల్ అఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ప్రత్యేక డైరెక్టర్ గా, అగ్రి బయోటేక్ ఫౌండేషన్ చైర్మన్ గా, భారత ప్రభుత్వ వ్యవసాయ శాఖ శిక్షణ, పరిశోదన (DARE) కు ప్రత్యేక సెక్రటరీ గా, జనరల్ క్రాప్ సైన్సెస్ లోడిప్యుటీ డైరెక్టర్ గా, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతులు గా అనేక సేవలు అందించారు.
అమెరికా పుర్డు యూనివర్సిటీ, బనారస్ హిందు యూనివర్సిటీల నుండి అవార్డులు, ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అకాడమీ నుండి గోల్డ్ మెడల్ ఇంకా అనేక అవార్డు లు పొందారు.
ఆయన మృతి తీరని లోటు. ఆయన మృతికి బండారు ప్రతాప్ నాయుడు, బండారు పటేల్ రాజా నాయుడు, ఎ.ఎం.సి చైర్మన్ రాయుడు శ్రీరాములు, డా. చినిమిల్లి సత్యనారాయణరావు గారు పలువురు ప్రగడ సంతాపం తెలిపారు.
ఆయన మృతి తీరని లోటు. ఆయన మృతికి బండారు ప్రతాప్ నాయుడు, బండారు పటేల్ రాజా నాయుడు, ఎ.ఎం.సి చైర్మన్ రాయుడు శ్రీరాములు, డా. చినిమిల్లి సత్యనారాయణరావు గారు పలువురు ప్రగడ సంతాపం తెలిపారు.
No comments:
Post a Comment