కాపు సోదరులారా, ఎటుపోతున్నాం మనం?
మనం ఇక్కడ ఒక గ్రూప్ గా ఉన్నది ఒకరిని ఒకరం తిట్టుకొని ఆనందం పొందడానికా? కొంచమైనా అలోచిస్తున్నారా? ఎక్కడ చూసినా పచ్చబ్యాచ్, రెడ్డి బ్యాచ్ అని కామెంట్లు అవి కూడా ఓపెన్ గా పెట్టడం ఇది మనకుగాని మన కులానికిగాని మంచిదేనా మీరే అలోచించండి?.
ఎప్పుడైతే మనం మన పనులు మీద శ్రద్ద పెడతామో అప్పుడే మనం ఎదగడానికి ఆస్కారం ఎక్కువ. ఉన్న అవకాశాలని పాడుచేసుకొని బాధపడటంకంటే, ఉన్న వారిని వాడుకొని ఏలా పైకి రావాలో నేర్చుకోవడం మంచిది. ఒక వ్యక్తి ఒకరిని ఉద్దేశించి ఒకమాట అన్నాడు అంటే వారి మీద దండయాత్రలాగా మీద పడటం కంటే మీరు ఏమి చేయగలరు, ఏమి చేశారు అన్న ప్రశ్నలు వారికి చేరేలా మనం వారితో సన్నిహిత సంభందాలు కలిగి వారి నోటికి తాళం వేయటం నేర్చుకోవాలి.
ఇప్పుడు మనం ప్రతి రాజకీయపార్టికి కావాలి అందుకనే ఎవ్వరు పదవిలో ఉంటే వారు మనకి నామాలు పెట్టడం కాదు మనమే వారికి దైవాలుగా మారదాం, వాళ్ళని మన కాళ్ళు పట్టుకొనేలా చేయాలి అంతేగాని అందరికి దూరం కాకూడదు. అలా చేస్తే ఏ ఇతరకులము కూడా మనకు చేరువకాదు. ఇది మీరు మీ అంతరాత్మతో చర్చించండి నిజం మీకే అర్దం అవుతుంది. మనం పోరాటం వ్యవస్థ మీద చేయాలికాని రాజకీయపార్టీల మీద కాదు.
ప్రతి కులంతో సఖ్యత పెంచుకుందాం అలాగని వారిని బుజానికి ఎత్తుకోవద్దు. నామాటలు మీకు మింగుడు పడకపోవచ్చు గాని ఇదే రాజకీయం, మీకు అర్దం అవ్వాలి అంటే ఒక్కసారి అలోచించి చూడండి నిజం మీకే అర్దం అవుతుంది.
ఐనా సరే అవేశంతోనే పనిచేస్తాం అంటే మీ ఇష్టం
మీ సాయిబాబా నాయుడు

No comments:
Post a Comment