వై ఎస్ హెలీకాప్టర్ చావు ఒక హత్య - యాక్సిడెంట్ కాదు !
2009 లో ఈ దేశాన్ని , రాష్ట్రాన్నీ కుదిపేసిన విషయం వై ఎస్ రాజశేకర రెడ్డి చావు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలం లోనే భారీ హెలీకాప్టర్ ప్రమాదం లో మరణించిన ఆయన చావు ఇప్పటికీ చాలా మందికి మింగుడు పడని విషయం. రాజకీయాలని దగ్గర నుంచి చూసిన వారు మాత్రం ఇది హత్య అనీ ఆక్సిడెంట్ కానే కాదు అనీ అంటూ ఉంటారు ఇప్పటికీ. వై ఎస్సార్ మరణం తరవాత ఎన్నో సంచలనాలు జరిగినా అన్నింటా నిజాలు బయటకి వచ్చాయి కానీ ఈ విషయం లో మాత్రం ఆయన మరణం వెనకాల నిజాలు బయట పడనే లేదు.
హెలీకాప్టర్ లో ఉన్న బ్లాక్ బాక్స్ కి సంబంధించిన వివరాలు ఇప్పటి వరకూ బయటకి రాలేదు అంటే పరిస్థితి అర్ధం చేస్కోవచ్చు. ఇప్పుడు ఒక రష్యన్ పత్రిక వై ఎస్ మరణం సాధారణమైన మరణం కాదు అనీ ఆయన్ని చంపడం కోసం దాదాపు వెయ్యి కోట్ల వరకూ ఖర్చు పెట్టారు అనీ చెబుతున్నారు.
ఎంత చెప్పినా వినని , కన్విన్స్ అవ్వని YSR మీద కక్ష పెంచుకుని ఎలాగైనా అడ్డం తొలగించాలి అని కంపెనీ వర్గం ప్లాన్ చేసింది అంటున్నారు. ఏపీ లో ఎవ్వరి సహకారం లేకుండా అప్పటికిప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపడం అంటే కుదిరే పని కాదు అనీ దానికి సహకారం లో ఏపీ లో ముఖ్యమైన ఒక వ్యక్తి సహకారం పొందారు . వైఎస్సార్ తో ఎప్పటి నుంచో వైఎస్సార్ తో వైరం ఉన్న ఆ పత్రికా ప్రముఖుడు ఈ హత్య లో భాగం అయ్యారు. " అని exile అనే రష్యన్ పత్రిక రాసుకొచ్చింది. YSR కొడుకు ముఖ్యమంత్రి అయతే ఆయన చావు మీద ఎక్కడ విచారణ మొదలు పెడతాడో అని అతన్ని కూడా ఇదే వర్గం అడ్డుకుంది అనీ జైలు కి కూడా పంపించి అతని పవర్ ని తగ్గించింది అనీ చెప్పుకొచ్చింది ఆ పత్రిక.
No comments:
Post a Comment